RangaReddy

News April 19, 2024

HYD: జిల్లాలో 5 లక్షల డూప్లికేట్ ఓట్ల తొలగింపు: ఈసీ

image

హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయిలో డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. గత రెండేళ్లలో దాదాపు 60.6 లక్షల మంది కొత్త ఓటర్లు చేరినట్లు సీఈఓ వికాస్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌ జిల్లాలో 5 లక్షల డూప్లికేట్ ఓట్లు తొలగించినట్లు ఈసీ పేర్కొంది. చాంద్రాయణగుట్టలో 59,289 ఓట్లు, యాకుత్‌పురాలో 48,296 డూప్లికేట్ ఓట్లు గుర్తించామని ఎన్నికల సంఘం వెల్లడించింది.

News April 19, 2024

HYD: బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్లు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగుల అరెస్ట్

image

బ్లాక్‌లో IPL టికెట్లను అమ్ముతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులను సైబరాబాద్ SOT పోలీసులు అరెస్ట్ చేశారు. కొండాపూర్ ప్రాంతంలో ఐపీఎల్ టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నారన్న సమాచారంతో ముగ్గురు యువకులను పట్టుకుని వారి నుంచి 15 ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సన్ రైజర్స్ V/s రాయల్ ఛాలెంజర్ టిక్కెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో టికెట్ రూ.10వేలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు.

News April 19, 2024

HYD: BJPకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ

image

బీజేపీకి భారీ షాక్ తగిలింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మాజీ ఎంపీ రవీందర్ నాయక్ కాంగ్రెస్‌లో చేరారు. నాటి ప్రధాని ఇందిరమ్మ కుటుంబానికి అత్యంత సన్నిహితుల్లో రవీందర్ నాయక్ ఒకరు. రాష్ట్రంలో గిరిజనులను ప్రభావితం చేసే నాయకుడు కావడంతో పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం కాంగ్రేస్‌కు మరింతగా కలిసి రానుంది.

News April 19, 2024

సికింద్రాబాద్: నామినేషన్ దాఖలు చేసిన కిషన్ రెడ్డి

image

సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. కిషన్ రెడ్డి వెంట రాజ్యసభ సభ్యులు కే.లక్ష్మణ్ ఉన్నారు. తనకు ఎంపీగా అవకాశం ఇచ్చిన బీజేపీ అధిష్టానానికి కిషన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరోసారి ప్రజల ఆశీర్వాదం తనపై ఉందని నమ్ముతున్నట్లు తెలిపారు. మరోసారి ఎంపీగా గెలిచి ప్రజలకు సేవ చేస్తానని అన్నారు.

News April 19, 2024

నామినేషన్ దాఖలు చేసిన వంశీ చంద్ రెడ్డి

image

మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వంశీచంద్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే ఎన్నెం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ హాజరయ్యారు. ఉదయం వంశీ చంద్ రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు.

News April 19, 2024

సికింద్రాబాద్: ట్రాక్ పునరుద్ధరణలో దక్షిణ మధ్య రైల్వే రికార్డ్

image

దక్షిణ మధ్య రైల్వే తన రైలు నెట్ వర్క్‌లో ట్రాక్ పునరుద్ధరణ పనులకు సంబంధించి మునుపెన్నడూ లేని విధంగా 649 కిలోమీటర్ల ట్రాక్ పునరుద్ధరణను పూర్తి చేయడం ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పనితీరును సాధించిందని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సిహెచ్ రాకేష్ తెలిపారు. ఇది జోన్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఆర్థిక సంవత్సరంలో కూడా సాధించని అత్యుత్తమ రికార్డు అని ఆయన అన్నారు.

News April 19, 2024

కుక్కల బెడద తగ్గించేందుకు నిధులు అవసరం: కొండా

image

జీహెచ్ఎంసీ పరిధిలో కుక్కల బెడదను తగ్గించేందుకు నిధులు అవసరమని, మణికొండ మున్సిపాలిటీకి సైతం నిధులు అవసరం పడతాయని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇటీవల ఓ వ్యక్తి పై కుక్కలు తీవ్రంగా దాడి చేయడంతో ఆసుపత్రి పాలయ్యాడు. దీని పై స్పందించినా ఆయన, నిధులను సమకూర్చుకొని తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాల పై ఉందన్నారు.

News April 19, 2024

ఓయూ ఎంబీఏ పరీక్షా ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ (సీబీసీఎస్) మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

News April 19, 2024

HYD: తల్లి, చెల్లిని పోషించలేక యువకుడి ఆత్మహత్య

image

తల్లి, చెల్లిని పోషించలేకపోతున్నానని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన  శామీర్‌పేట పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బాబాగూడకు చెందిన సంపత్ గౌడ్ (23) హైటెక్ సిటీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. కాగా చేసిన పనికి 2 నెలలుగా జీతాలు రాకపోవడంతో చేతిలో డబ్బులు లేకపోవడంతో తల్లితో చెప్పుకోలేకపోయాడు. బయటకు వెళ్తున్నట్లు చెల్లికి చెప్పి ఓ పాఠశాల సమీపంలో ఉరేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.

News April 19, 2024

HYD: డిప్లొమా, B.Tech చేశారా మీకోసమే!

image

HYD మాదాపూర్‌లోని NAC లో బీఈ, బీటెక్ సివిల్, బీఆర్క్, ఎంటెక్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పీజీ డిప్లొమో కోర్సులను అందిస్తున్నట్లు తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమో ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమో ఇన్ క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ కోర్సులున్నాయని, డిప్లొమో చేసిన వారికి కన్ స్ట్రక్షన్ సేఫ్టీ కోర్సులో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.