RangaReddy

News August 7, 2024

More 31 Days: హైదరాబాద్‌లో బిగ్గెస్ట్ ఫెస్టివల్‌

image

మరో బిగ్గెస్ట్ ఫెస్టివల్‌కు హైదరాబాద్‌ సిద్ధమవుతోంది. వినాయకచవితి‌ వేడుకల‌ నిర్వహణ‌కు భాగ్యనగర్‌ ఉత్సవ సమితి, ఇతర అసోసియేషన్‌ సభ్యులు‌ ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే ధూల్‌పేటలో భారీ గణనాథుల బుకింగ్స్‌ మొదలయ్యాయి. మండపాల నిర్వహకులు బ్యాండ్‌ షాప్‌‌ల వైపు‌ పరుగులు తీస్తున్నారు. నాగోల్, హయత్‌నగర్‌లోనూ విభిన్న రకాల గణనాథులు కొలువుదీరారు. నవరాత్రులకు మరో 31 రోజులే సమయం ఉంది.

News August 7, 2024

ప్రొ. జయశంకర్‌ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తాం: సీఎం

image

తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నికుడు , సిద్ధాంతకర్త, ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతిని పురస్కరించుకుని ఆయన కృషిని, త్యాగాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధ‌నే ఉచ్ఛ్వాస‌ నిచ్వాసలుగా జీవిత ప‌ర్యంతం గ‌డిపిన ప్రొ.జ‌య‌శంక‌ర్‌ను తెలంగాణ స‌మాజం స‌దా గుర్తుంచుకుంటుంద‌ని తెలిపారు. ఆయన ఉద్యమ స్ఫూర్తిని కొన‌సాగిస్తామ‌ని, ఆశ‌య సాధ‌న‌కు ప్రభుత్వం పూర్తిగా క‌ట్టుబ‌డి ఉందన్నారు.

News August 6, 2024

HYD: RRRకు మార్గం సుగమం

image

రీజినల్ రింగురోడ్డు నిర్మాణానికి అడుగులు వడివడిగా పడుతున్నాయి. టెండర్ల ప్రక్రియకు అడ్డుగా ఉన్న అటవీ శాఖ అనుమతుల అంశం కొలిక్కి వచ్చింది. భూములు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పటంతో ఆ ప్రక్రియ తుది దశకు చేరింది. అటవీ అనుమతులు రాగానే.. NHAI కేంద్ర ప్రభుత్వానికి పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేయనుంది. ప్రస్తుతం 162 కి.మీ. ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది.

News August 6, 2024

FLASH: HYD: రోడ్డు ప్రమాదం.. తెగిపోయిన తల

image

శంషాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు డ్రైవర్ అతివేగంతో వెళ్తూ వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తి తల కారు అద్దంలో ఇరుక్కుపోయింది. ఈడ్చుకొని వెళ్లడంతో తల తెగి కారు వెనక సీటులో పడిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 6, 2024

HYDలో JOBS.. జీతం రూ.55 వేలు

image

HYDలోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL)తోపాటు జోనల్ ఆఫీసుల్లో పనిచేసేందుకు పలు పోస్టులకు దరఖాస్తులను కోరుతోంది. ఐటీఐ, బీఈ/ బీటెక్ పాసై అనుభవం ఉండాలి. పోస్టును అనుసరించి 30-33 ఏళ్లు మించకూడదు. రూ.22,528-రూ.55,000 వరకు జీతం ఉంటుంది. AUG 8 దరఖాస్తు చివరి తేదీ. పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ, మెరిట్ లిస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ecil.co.in/job_details_17_2024.php

News August 6, 2024

FLASH: HYD: రోడ్డు ప్రమాదం.. తెగిపోయిన తల

image

శంషాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు డ్రైవర్ అతివేగంతో వెళ్తూ వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తి తల కారు అద్దంలో ఇరుక్కుపోయింది. ఈడ్చుకొని వెళ్లడంతో తల తెగి కారు వెనక సీటులో పడిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 6, 2024

హైదరాబాద్: ఆగస్టు 21న భారత్‌ బంద్‌కు పిలుపు

image

SC, ST రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా ఆగస్టు 21న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు, సుప్రీంకోర్టు న్యాయవాది కృష్ణస్వరూప్ కోరారు. నగరంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన సమావేశం అయ్యారు. INC సహకారంతో మోదీ ఈ తీర్పు చెప్పించారని విమర్శించారు. వర్గీకరణను వ్యతిరేకిస్తూ ప్రజలు బంద్‌లో పాల్గొనాలన్నారు.

News August 6, 2024

హైదరాబాద్‌లో భారీగా తగ్గిన చికెన్ ధరలు

image

శ్రావణ మాసం మొదలుకావడంతో‌ నగరంలో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. గత ఆదివారం వరకు రాజధానిలో బోనాల సంబరాలు నిర్వహించారు. దీంతో మాంసంకు డిమాండ్ పెరిగింది. కేజీ చికెన్ రూ. 200 పైననే విక్రయించారు. ఇక నిన్నటి నుంచి మాంసం ధరలు‌ తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం డ్రెస్డ్ కేజీ ధర రూ. 148, స్కిన్‌లెస్ ధర రూ. 168, ఫాంరేటు రూ. 80, రిటైల్ రూ. 102గా ఉంది. SHARE IT

News August 6, 2024

HYD: సైబర్ బాధితులకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అండ

image

సైబర్ నేరాల బారిన పడిన బాధితులకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అండగా నిలుస్తోంది. సైబర్ మోసాల్లో పోగొట్టుకున్న నగదును లీగల్ సర్వీసెస్ అథారిటీ సహకారంతో రీఫండ్ చేస్తోంది. మార్చి నుంచి జులై వరకు రూ.85.05 కోట్ల నగదును రీఫండ్ చేసింది. నగదు పొగొట్టుకున్న మొదటి గంట(గోల్డెన్ అవర్)లో ఫిర్యాదు చేస్తే నేరగాళ్లకు సొమ్ము చేరకుండా ఆపగలమని సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలిపింది.

News August 5, 2024

న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్‌ను సందర్శించిన సీఎం రేవంత్

image

అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకంగా ఉన్న ప్రఖ్యాత న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. అమెరికా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి బృందం ప్రస్తుతం న్యూయార్క్ నగరంలో పలువురు ప్రభుత్వ, ప్రైవేటు వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. ఈ పర్యటనలో సీఎం వెంట ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , ఇతర ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.