RangaReddy

News August 22, 2024

BREAKING: HYD: బాలాపూర్‌లో మరో హత్య..!

image

HYD బాలాపూర్ PS పరిధిలో మరో దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. రౌడీషీటర్ రియాజ్ హత్య మరువక ముందే మరో యువకుడిని గుర్తు తెలియని దుండగులు వెంటపడి మరీ కత్తులతో పొడిచి హత్య చేశారు. బాలాపూర్ గణేశ్ చౌక్ వద్ద ఉన్న ఓ హోటల్ ఎదుట జనం చూస్తుండగానే హత్య జరిగింది. మృతుడి ఎంవీఎస్ఆర్ మాజీ స్టూడెంట్ ప్రశాంత్‌గా గుర్తించారు. ఘటనా స్థలానికి DCP సునీతారెడ్డి చేరుకుని, కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

News August 22, 2024

HYDలో పీల్చే గాలి చంపేస్తోంది!

image

HYDలో కాలుష్యం పెరుగుతోంది. క్రమక్రమంగా విషవాయువులు పీలుస్తున్న జనాలు అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పోతున్నారు. ‘స్టేటస్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్’ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2000 నుంచి 2019 వరకు నగరంలో పీఎం 2.5 వంటి సూక్ష్మదూళి కణాల ఉద్గారాలతో అనేక మంది శ్వాసకోశ సంబంధ సమస్యల బారిన పడి మరణించినట్లు వెల్లడించింది. 2000 నాటికి కాలుష్యం బారిన పడి 2,810 మంది, 2019 నాటికి 6,460 మంది మరణించారు.

News August 22, 2024

HYD: రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక కోర్సు..!

image

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే హైదరాబాద్‌లో మాత్రమే ప్రింటింగ్ టెక్నాలజీ కోర్సు ఉంది. దీనిలో చేరడానికి పదో తరగతి పాసై తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహించే పాలిసెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే చాలు. HYDలో జూ పార్క్ సమీపంలోని కులీ కుతుబ్షా (QQ) గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో మాత్రమే ఈ కోర్సు బోధిస్తున్నారని, విద్యార్థులు మెరుగైన ఉపాధి పొందుతున్నట్లు లెక్చరర్లు తెలిపారు.

News August 22, 2024

హైటెన్షన్: హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి ధర్నా

image

HYDలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గురువారం ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ నేతల ధర్నా కార్యక్రమం జరగనుంది. మరికాసేపట్లో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఆందోళన చేపట్టనున్నారు. మరోవైపు రైతు రుణమాఫీ‌పై కేటీఆర్‌ పిలుపు మేరకు బీఆర్ఎస్‌ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఒకేరోజు అధికార, ప్రతిపక్ష నేతల ధర్నాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

News August 22, 2024

హైదరాబాద్‌లో మళ్లీ పెరిగిన చికెన్ ధరలు

image

నగరంలో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గత రెండు వారాల క్రితం కేజీ చికెన్ రూ. 160(స్కిన్‌లెస్) చొప్పున విక్రయించారు. ఇక నిన్నటి నుంచి మాంసం ధరలు‌ మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. గురువారం డ్రెస్డ్ కేజీ ధర రూ. 187, స్కిన్‌లెస్ ధర రూ. 213, ఫాంరేటు రూ. 107, రిటైల్ రూ. 129గా ఉంది. శ్రావణ మాసం తొలివారానికి, ఈ రోజు పోల్చితే కేజీకి ఏకంగా రూ. 40 పెరగడం గమనార్హం.SHARE IT

News August 21, 2024

HYD: గణేశ్ ఉత్సవాలకు భారీ బందోబస్తు: సీపీ

image

గణేశ్ ఉత్సవాలు సజావుగా సాగేలా భారీ బందోబస్తు, నిమజ్జనానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. బుధవారం గణేశ్ ఉత్సవాల బందోబస్తుపై అధికారులతో రాచకొండ సీపీ సమన్వయ సమావేశం నిర్వహించారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు మండపాల నిర్వాహకులు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లు వినియోగించాలన్నారు. మండపాల్లో డీజేలకు అనుమతి లేదని సీపీ స్పష్టం చేశారు.
SHARE IT

News August 21, 2024

HYD: ఏటా కొత్తగా 15,000 క్యాన్సర్ కేసులు!

image

HYD నగరంలోని MNJ క్యాన్సర్ ఆసుపత్రిలో ప్రతి ఏటా కొత్తగా సుమారు 15,000 క్యాన్సర్ కేసులు నమోదవుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఏటా మేజర్ సర్జరీలు 4,500, మైనర్ సర్జరీలు 6,000, రేడియేషన్ థెరపీలు దాదాపు 300 మందికి జరుగుతున్నాయి. కీమోథెరపీ చికిత్సలు సైతం 300 మందికి జరుగుతున్నట్లు తెలిపారు. దాదాపుగా 1.5 లక్షల మందికి వివిధ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

News August 21, 2024

HYDను వణికిస్తున్న డెంగ్యూ.. జాగ్రత్త!

image

HYD, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ ఏడాది హైదరాబాద్ జిల్లాలో ఏకంగా 1,751, మేడ్చల్-399, రంగారెడ్డి-310 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. గాంధీ, ఉస్మానియా, ఏరియా ఆసుపత్రుల్లో జ్వర లక్షణాలతో వస్తున్న పేషెంట్లు కిక్కిరిసిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దోమల నివారణకు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోని, దోమతెరలు వాడాలన్నారు.

News August 21, 2024

HYD: రేపటి నుంచి దోస్త్ ఇంట్రా కాలేజ్ రెండో విడత

image

దోస్త్ ద్వారా ఆయా డిగ్రీ కళాశాలల్లో చేరిన విద్యార్థులు అదే కళాశాలలో గ్రూపు మారేందుకు ఇంట్రా కాలేజ్ రెండో విడతను చేపడుతున్నామని, ఈనెల 22, 23 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని కన్వీనర్ ఆచార్య ఆర్.లింబాద్రి తెలిపారు. గ్రూపు మారేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 24న సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు.

News August 21, 2024

ఈనెల 23న హరేకృష్ణ హెరిటేజ్ టవర్ ‘అనంతశేష స్థాపన’

image

నగరం మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. నార్సింగిలో హరే కృష్ణ మూమెంట్ సంస్థ ‘హరే కృష్ణ హెరిటేజ్ టవర్ పేరుతో భారీ ఆలయాన్ని నిర్మిస్తోంది. ఈ నెల 23న అనంతశేష స్థాపన ద్వారా ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. హరేకృష్ణ మూమెంట్ ఛైర్మన్, అక్షయపాత్ర ఫౌండేషన్ ఛైర్మన్ మధు పండిట్ దాస్ ప్రభూజీ తదితరులు హాజరుకానున్నారు.