RangaReddy

News April 18, 2024

HYD: రాజాసింగ్‌పై కేసు నమోదు

image

HYD నగరం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు చేసినట్లు అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ SHO లింగేశ్వర రావు తెలిపారు. గౌలిగూడ సమీపాన బాణసంచా కాల్చారని, ర్యాలీని ఆపి, భక్తులు, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినట్లు పేర్కొన్నారు. మరోవైపు రాజాసింగ్ సహా జోగేందర్ సింగ్ బిట్టు పై కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా భారీగా భక్తులతో శోభయాత్ర నిర్వహించారని సుమోటోగా కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.

News April 18, 2024

బీఫామ్ అందుకున్న మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థి

image

మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాగి లక్ష్మారెడ్డి ఇవాళ తెలంగాణ భవన్ నందు గులాబీ అధినేత సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు. మల్కాజ్గిరి గడ్డపై గులాబీ జెండా ఎగరవేస్తామని లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షులు కేటీఆర్, ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు.

News April 18, 2024

ఆమనగల్లు: రేప్ కేసులో మైనర్ బాలునికి జైలు శిక్ష

image

ఆమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రేప్ కేసులో మైనర్ బాలుడి(17)కి గురువారం రంగారెడ్డి జిల్లా జువైనల్ కోర్టు జడ్జి ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ.4వేల జరిమానా విధించినట్లు ఎస్సై బలరాం చెప్పారు. 2018లో జరిగిన ఘటనలో కేసు విచారణలో భాగంగా జైలు శిక్ష, జరిమానా విధించినట్లు ఎస్సై వివరించారు. నేరంపై వెంటనే స్పందించి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులను అధికారులు అభినందించారు.

News April 18, 2024

సికింద్రాబాద్: ప్రజలకు నివేదిక అందించిన కిషన్ రెడ్డి

image

ఐదేళ్ల పదవీకాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గురువారం ప్రజలకు నివేదిక అందించారు. నగరంలోని బస్తీ దవాఖానాలు, క్రీడా వసతులను మెరుగుపరచడం, మహిళల కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం వివిధ రూపాల్లో రూ.10 లక్షల కోట్ల నిధులు అందించిందని తెలిపారు. మరోసారి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు.

News April 18, 2024

HYD: FREE కోచింగ్ కోర్సులు.. అర్హతలు

image

HYD నగరం NACలో గ్రామీణ యువకులకు ఉచిత కోచింగ్.. 
✓స్టోర్ సూపర్వైజర్-డిగ్రీ 
✓స్ట్రక్చర్ సూపర్వైజర్-ఇంటర్ 
✓లాండ్ సర్వేయర్-ఇంటర్ 
✓ఎలక్ట్రికల్,హౌజ్ వైరింగ్- SSC 
✓ప్లంబింగ్ అండ్ శానిటేషన్, డ్రైవాల్ అండ్ ఫాల్ సీలింగ్,వెల్డింగ్,పెయింటింగ్, డెకొరేషన్-5వ తరగతి 
✓డ్రైవాల్ అండ్ ఫాల్ సీలింగ్- 5వ తరగతి 
✓JCB బ్యాక్ హోల్డర్ ఆపరేటర్-5వ తరగతి చదివిన వారు అర్హులు •ఆసక్తి కల వారు NAC విద్యాసంస్థలో సంప్రదించండి

News April 18, 2024

HYD: FREE కోచింగ్ మీకోసమే.. త్వరపడండి!

image

HYD కొండాపూర్ పరిధిలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్(NAC) ఆధ్వర్యంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలోని ఐజీఎంఎం, ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో నిరుద్యోగ యువతకు పలు కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. 18-35 ఏళ్లలోపు వారికి ఉచిత భోజనం, హాస్టల్ వసతి కల్పిస్తూ 3 నెలలపాటు ఆయా కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.

News April 18, 2024

HYD: ఈతకు వెళ్లి ఇద్దరి మృతి

image

జగద్గిరిగుట్ట పీఎస్ పరిధి మిధుల నగర్ క్వారీ గుంతలో పడి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. పోలీసుల ప్రకారం.. అయాన్(16), నవాజ్(16), హైదర్(15) ఈతకోసం దిగారు. సమాచారం అందుకున్న బాచుపల్లి ఎస్సై మహేష్ వెంటనే స్పందించి, ఘటనా స్థలానికి చేరుకొని హైదర్‌ని రక్షించాడు. ఇద్దరు అయాన్, నవాజ్ మృత దేహాలు లభ్యమయ్యాయి. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 18, 2024

HYD: నివేదితకు బీఫాం అందజేసిన కేసీఆర్

image

కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్నకు కేసీఆర్ బీఫాంను, రూ.40 లక్షల చెక్కును తెలంగాణ భవన్‌లో అందించారు. ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని కేసీఆర్ ఆమెను ఆశీర్వదించారు. ఎన్నికల ప్రచారాన్ని ఉదృతంగా నిర్వహించి, ప్రజలందరి మన్ననలు పొందాలని సూచించారు. సర్వేలు, దివంగత ఎమ్మెల్యేలు సాయన్న-లాస్యనందిత అందించిన సేవలవైపే ఉన్నాయని అన్నారు.

News April 18, 2024

కూకట్పల్లి: JNTUH పరీక్ష ఫీజుల స్వీకరణ తేదీలు

image

కూకట్పల్లిలోని JNTUH యూనివర్సిటీలో బీటెక్ ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి వివిధ సెమిస్టర్ల పరీక్ష ఫీజుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని అధికారులు తెలియజేశారు. విద్యార్థులు పరీక్ష ఫీజులను చెల్లించాలని JNTUH సూచించింది. ఎలాంటి అధికారం లేకుండా నేటి నుంచి మే రెండవ తేదీ వరకు అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది. తర్వాత ఫీజు చెల్లిస్తే అధిక రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలియజేసింది.

News April 18, 2024

HYD: FAKE ప్రచారం చేయకండి: TSSPDCL

image

HYD నాంపల్లి కోర్టులో నేడు మధ్యాహ్నం క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుండగా పవర్ కట్ అయిందని, చీకటిలోనే జడ్జి వాదనలు విన్నారని కొందరు X వేదికగా వైరల్ చేశారు. దీని పై స్పందించిన TSSPDCL, నిర్ధారించని, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దని కోరింది. కరెంటు సరఫరాలో ఎలాంటి సమస్య లేదని, అంతర్గత సమస్య వెళ్లే జరిగిందని తెలిపింది. ఫిర్యాదు చేసిన లాయర్ విజయ్ గోపాల్ సైతం దగ్గరుండి చూశారని పేర్కొంది.