RangaReddy

News August 5, 2024

హైదరాబాద్‌‌లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్..!

image

ప్రపంచ స్థాయిలో ఐటీ రంగంలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికకు ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లో దాదాపు 15 వేల మంది ఉద్యోగులకు పని కల్పించేలా కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్, కంపెనీ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల అనంతరం ఈ ఒప్పందం జరిగింది.

News August 5, 2024

HYD: GREAT.. 4 GOVT JOBS సాధించింది!

image

HYD కూకట్‌పల్లికి చెందిన జ్ఞానవర్షిని TGPSC వెల్లడించిన ఫలితాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ఎంపికైంది. ఈ ఉద్యోగమే కాకుండా ఇంకా (AE),TPBO, గ్రూప్- 4 ఉద్యోగాలు సాధించింది. కాగా జ్ఞానవర్షిని స్వగ్రామం పరిగి నియోజకవర్గం మహమ్మదాబాద్ మండలం దేశయిపల్లి. కాగా ఆమెను పలువురు అభినందించారు.

News August 5, 2024

HYD: ‘ఇంటింటా ఇన్నోవేటర్’ గడువు పొడిగింపు

image

తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఇంటింటా ఇన్నోవేటర్-2024’ కార్యక్రమానికి సంబంధించి దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. ఎంట్రీలను సమర్పించేందుకు ఈనెల 10 వరకు గడువు పొడిగిస్తున్నట్లు చెప్పారు. సరికొత్త ఆవిష్కరణలు రూపొందించిన వారిని పరిచయం చేస్తూ వాటిని ఈనెల 15న ప్రదర్శిస్తామని వెల్లడించారు. వివరాలకు pr-tsic@telangana.gov.in వెబ్‌సైట్ చూడాలన్నారు. 

News August 5, 2024

పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసిన మంత్రి

image

జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర హౌసింగ్ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.6కోట్లతో వికారాబాద్ జిల్లా కేంద్రంలో 4 సూటెడ్ R&B గెస్ట్ హౌస్ నిర్మాణ పనులకు, ఆలంపల్లి నుంచి రాళ్లచట్టంపల్లి వరకు రూ.12 కోట్ల అంచనా వ్యయంతో డబుల్ రోడ్డు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు

News August 5, 2024

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో న్యాయపోరాటం: కేటీఆర్

image

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో న్యాయపోరాటం చేస్తామని BRS నాయకులు అన్నారు. రాజ్యాంగ నిపుణులతో పార్టీ సీనియర్ ప్రతినిధుల బృందం సమావేశం అయ్యారు. త్వరలోనే సుప్రీంకోర్టులో పార్టీ తరఫున కేసు వేస్తామని, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని హెచ్చరించారు. రాజ్యాంగ నిపుణులు, న్యాయ వాదులతో జరగిన సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే కేటీఆర్, హరీష్ రావు తదితరలు పాల్గొన్నారు.

News August 5, 2024

HYD: విచారణ కమిటీ వేసిన సీపీ

image

సైబరాబాద్ పరిధిలోని షాద్‌నగర్ పట్టణ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రాంరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి స్పందించారు. రాంరెడ్డిని సైబరాబాద్ సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్లు తెలిపారు. వచ్చిన ఆరోపణలపై షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామి విచారణ జరుగుతున్నట్లు తెలిపారు. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

News August 5, 2024

HYD: ఎస్సై ఉద్యోగం లక్ష్యం.. ప్రాణాలు తీసిన గొడవ

image

క్యాబ్ డ్రైవర్‌పై దాడి చేసిన ఘటనలో <<13779350>>యువకుడు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. NLGకి చెందిన వెంకటేశ్ రైతు బిడ్డ. అంజయ్య గౌడ్, వెంకటమ్మలకు నలుగురు ఆడపిల్లల తర్వాత వెంకటేశ్ ఐదో సంతానం. SI ప్రిపరేషన్ కోసం LBనగర్లో ఉంటూ రాత్రి పాకెట్ మనీ కోసం క్యాబ్ నడిపేవాడు. ఈ క్రమంలోనే రూ.200 కోసం జరిగిన ఘర్షణలో వెంకటేశ్ ప్రాణాలు కోల్పోయాడు. ఎకరంన్నర పొలం అమ్మి వైద్యానికి రూ.2 కోట్లు ఖర్చు పెట్టినా ఫలితం దక్కలేదు.

News August 5, 2024

HYD: రూ.200 కోసం గొడవ.. రెండేళ్లు నరకం

image

రూ.200 కోసం మొదలైన గొడవతో యువకుడి ప్రాణం పోయింది. పోలీసుల ప్రకారం.. NLG జిల్లా చింతపల్లి మండలానికి చెందిన వెంకటేశ్ HYDలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. 2022 జులై 31న వివేక్‌రెడ్డి అనే వ్యక్తి క్యాబ్ బుక్ చేసుకున్నాడు. బిల్ రూ.900 కాగా రూ.700 ఇవ్వడంతో గొడవైంది. వివేక్ 20 మంది స్నేహితులతో వెంకటేశ్‌పై దాడి చేశాడు. రూ.2కోట్ల మేర ఖర్చు చేసినా రెండేళ్లపాటు మంచాన పడ్డ వెంకటేశ్ ఆదివారం మృతిచెందాడు.

News August 5, 2024

HYD: షాద్‌నగర్ ఘటనపై సీఎం సీరియస్

image

బంగారం చోరీ కేసులో ఓ దళిత మహిళ, ఆమె భర్తపై షాద్‌నగర్ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురి చేసిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం దృష్టికి ఈ విషయం వెళ్లడంతో ఆయన పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఘటనకు బాధ్యులైన వారు ఎవరు తప్పించుకోలేరని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బాధితులకు అండగా ఉంటామన్నారు.

News August 5, 2024

నేడే ఆఖరు.. ‘రైతు బీమా’ దరఖాస్తు చేసుకోండి!

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని నూతనంగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులు బీమా కోసం వ్యవసాయశాఖ కార్యాలయంలో ఈనెల 5లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయా జిల్లాల వ్యవసాయ అధికారులు తెలిపారు. భూమి పట్టా పాసుపుస్తకం ఉండి 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు ఉన్నవారు అర్హులని, రైతులు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం(జీరాక్స్) నకలు ప్రతులు అందించాల్సి ఉంటుందన్నారు.