Warangal

News September 2, 2025

భద్రకాళి అమ్మవారి దివ్య దర్శనం

image

భద్రకాళి దేవస్థానంలో ఆలయ అర్చకులు ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి హారతి ఇచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయం చేరుకొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. దేవస్థాన అర్చకులు తదితరులు ఉన్నారు.

News September 1, 2025

WGL: ఆగస్టు మాసాన్ని ఒక్కసారి నెమరేసుకుందామా..!

image

1. ఓరుగల్లు నగరాన్ని ముంచెత్తిన వానలు
2. కాంగ్రెస్ జనహిత పాదయాత్ర
3. DCCB, సొసైటీల పదవీ కాలం పెంపు
4. ఖిలా వరంగల్ తహశీల్దార్ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు
5. వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం
6. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
7. యూరియా కొరతతో రైతుల ధర్నాలు
8. పంద్రాగస్టు వేడుకలు
9. శ్రావణమాసంతో ఆలయాలు కిటకిట
10. భద్రకాళి ఆలయ ఈవోల బదిలీ

News September 1, 2025

వరంగల్: మళ్లీ ముసురుకుంటున్న వాన..!

image

మూడు రోజులుగా గెరువిచ్చిన వాన మళ్లీ ముసురుకుంటోంది. ఆదివారం రాత్రి నుంచి చినుకులు పడుతూనే ఉన్నాయి. సోమవారం ఉదయం నగరంలో కారుమబ్బులు కమ్ముకున్నాయి. జిల్లాలో సరాసరి 35 మి.మీ వర్షపాతం నమోదు కాగా ఖానాపూర్‌లో 88 మి.మీ అధిక వర్షపాతం నమోదయ్యింది. అలాగే చెన్నరావుపేటలో 80 మి.మీ, నల్లబెల్లిలో 67.1 మి.మీ వర్షపాతం నమోదు కాగా మిగతా మండలాల్లో మోస్తరు నుంచి సాధారణ వర్షపాతం నమోదైంది.

News August 31, 2025

WGL: తప్పుల తడకగా ఓటర్ల జాబితా..! మరో మండలంలో వెలుగులోకి..!

image

గ్రామ పంచాయతీ అధికారులు ఓటర్ల జాబితాలను విడుదల చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కడారి గూడెం గ్రామంలో ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉండడంతో పాటు మరణించిన వారి పేర్ల మీద సైతం ఇంకా ఓట్లు ఉన్నాయని వెలుగులోకి వచ్చింది. తాజాగా గీసుగొండ మండలం మరియపురం గ్రామానికి చెందిన కౌడగాని రాజగోపాల్ కుటుంబ సభ్యుల నాలుగు ఓట్లు మూడు వార్డుల్లో నమోదు కావడం ఆశ్చర్యానికి గురిచేసింది.

News August 31, 2025

సీకేఎం ఆసుపత్రిలో సేవల్లో అంతరాయంపై చర్యలు: కలెక్టర్

image

సీకేఎం ఆసుపత్రిలో గర్భిణుల సేవల్లో అంతరాయంపై నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా.సత్య శారద అధికారులను ఆదేశించారు. రేడియాలజిస్టులు, మత్తు వైద్యుల కొరతను ఎంజీఎం నుంచి డిప్యూటేషన్‌తో తీర్చాలన్నారు. ఎంజీఎం ఆసుపత్రికి రెగ్యులర్ సూపరింటెండెంట్ నియామకంపై చర్యలతో పాటు సమయపాలన పాటించని వారిపై చర్యలు ఉంటాయన్నారు.

News August 30, 2025

ఐనపల్లిలోని గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్

image

ఖానాపూర్ మండలం ఐనపల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను వరంగల్ కలెక్టర్ సత్య శారద శనివారం రాత్రి సందర్శించారు. గురుకులంలోని విద్యార్థులు, సిబ్బంది హాజరు, తదితర రిజిస్టర్లను, భోజనాన్ని, గదులను పరిశీలించారు. అందుతున్న బోజన వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మమేకమైన కలెక్టర్ వారితో కలిసి ఆటలు ఆడుతూ ఉన్నారు. ఆర్డీవో, ఎమ్మార్వో తదితరులున్నారు.

News August 30, 2025

ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు ఉంటే చెప్పండి: వరంగల్ కలెక్టర్

image

జిల్లాలోని 317 గ్రామ పంచాయతీల్లో విడుదల చేసిన 3,83,736 డ్రాఫ్ట్‌ ఓటర్‌ జాబితాపై అభ్యంతరాలు తెలపాలని పార్టీల ప్రతినిధులను కలెక్టర్‌ డా.సత్య శారద కోరారు. శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైన ఆమె, జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30లోపు తెలియజేయాలని కోరారు. ఈ నెల 31 లోపు అభ్యంతరాలు పరిష్కరించి, సెప్టెంబర్‌ 2న తుది జాబితా ప్రచురిస్తామన్నారు.

News August 29, 2025

వరంగల్ జిల్లాలో తగ్గుముఖం పట్టిన వర్షాలు

image

రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు ఉదయం 6 గంటల వరకు మొత్తం 29.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. వరంగల్ మండలంలో 11.2 మి.మీ అత్యధిక వర్షపాతం నమోదు కాగా.. ఖిల్లా వరంగల్‌లో 5.5మి.మీ, ఖానాపూర్‌లో 1.8, నల్లబెల్లిలో అత్యల్పంగా 0.5 మి.మీ వర్షపాతం నమోదయింది.

News August 29, 2025

వరంగల్: గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితా ప్రదర్శన..!

image

వరంగల్ జిల్లాలోని 317 గ్రామ పంచాయతీలలో ఆయా గ్రామాల వారిగా జీపీ కార్యాలయాల ఎదుట కార్యదర్శులు ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఉన్న వివిధ పార్టీలకు చెందిన నాయకులతో గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో మీటింగ్‌లు ఏర్పాటు చేసి ఓటర్ల జాబితాపై పూర్తిగా వివరించారు. ఈనెల 30లోపు వివిధ పార్టీల నాయకులు జాబితాలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా తెలియజేయాలని సూచించారు.

News August 28, 2025

WGL: గణేష్ నిమజ్జన ప్రదేశాలను పరిశీలించిన సీపీ

image

హనుమకొండ జిల్లాలోని వచ్చే నెల 5న నిర్వహించనున్న గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ పరిశీలించారు. హనుమకొండలోని కాజీపేట బంధం చెరువు, సిద్ధేశ్వర గుండం, హసన్‌పర్తి చెరువులను ఆయన సందర్శించి, నిమజ్జన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఆయనతో పాటు సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, స్పెషల్ బ్రాంచ్ ట్రాఫిక్ ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.