India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ మహా నగర పాలక సంస్థ పన్నుల వన్ టైమ్ సెటిల్మెంట్ చెల్లింపు కోసం నేడు(ఆదివారం), రేపు(సోమవారం) మీ సేవా కేంద్రాలు, సిటిజన్ సర్వీస్ కేంద్రాలు తెరిచే ఉండనున్నాయి. వన్ టైమ్ సెటిల్మెంట్ గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో ప్రజల కోసం ఈ అవకాశాన్ని కల్పించినట్లు గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తెలిపారు. పాత బకాయిలపై 90 శాతం వడ్డీ రాయితీ మినహాయింపు పొందాలన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల ఆశావహులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రాజకీయ భవిష్యత్ను తేల్చనుంది. వరంగల్ జిల్లాలో సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈ తెలుగు నూతన సంవత్సరంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు ఈ ఏడాది నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రాజకీయ ఆశావహులకు ఈ ఏడాది ‘ కీ ‘ రోల్ కాబోతుంది.
రాష్ట్ర ప్రజానీకం, ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులకు తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉగాది పర్వదినం సందర్భంగా శనివారం విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొని, ప్రతి ఒక్కరికీ ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.
సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని మహబూబాబాద్ స్టేషన్లో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపడుతున్నందున మే 23 నుంచి 29 వరకు సుమారు 30 రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వీటితో పాటు మరో ఆరు రైళ్లను పాక్షికంగా రద్దు చేయగా, 11 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు CPRO శ్రీధర్ తెలిపారు. అలాగే 35 రైళ్లకు ఆయా తేదీల్లో మహబూబాబాద్ స్టేషన్లో స్టాపేజీని ఎత్తివేశామని వెల్లడించారు.
ప్రేమించిన అమ్మాయి దూరం పెడుతోందని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. WGL జిల్లా నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామానికి చెందిన సాయి(25) కొంతకాలంగా HYDలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఓ యువతిని సాయి ప్రేమించగా.. ఇరు కుటుంబాలు అంగీకరించాయి. కొంతకాలంగా ఆ అమ్మాయి దూరం పెడుతుండటంతో అతడు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు చెప్పారు.
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్లోని సైనిక్ స్కూల్కు చెందిన 8 మంది డిగ్రీ విద్యార్థులు అగ్నివీర్(ఇండియన్ ఆర్మీ)లో ఉద్యోగాలు సాధించారు. పాఠశాలకు చెందిన ఈశ్వర్, ఆకాష్, అంజి, ఆనంద్, సాయికుమార్, రాజేందర్, అభిలాష్, శ్రావణ్ ఉద్యోగాలు సాధించిన వారిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 8 మంది విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ సురేందర్ అభినందించారు.
ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తొగర్రాయిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ప్రవళిక(27) శుక్రవారం ఎవరూ లేని సమయంలో తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ప్రవళికకు భర్త సుధాకర్, ఇద్దరు పిల్లలున్నారు. ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు కాపాడారు. పర్వతగిరి మండలానికి చెందిన వెంకన్న అప్పుల బాధతో వరంగల్ ఓ సిటీ మైదానంలో పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు. అదే సమయంలో ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఇంటర్సెప్టర్ పోలీసులు గమనించి అతన్ని అడ్డుకున్నారు. అనంతరం చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీనియర్ నాయకుడు, నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డికి మంత్రి పదవి వస్తుందనే చర్చ కొన్ని రోజులుగా కొనసాగుతోంది. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో దొంతికి కూడా మంత్రి పదవి వస్తుందని స్థానిక నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీలో జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన కలిసినట్లు తెలిసింది. ఇంత వరకు నర్సంపేట నియోజకవర్గానికి చెందిన వారికి మంత్రి పదవి రాలేదు.
వరంగల్ నగరంలోని ఎనమాముల వ్యవసాయ మార్కెట్కు ప్రభుత్వం వరుసగా నాలుగు రోజులు సెలవు ప్రకటించింది. ఈ మేరకు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి తెలిపారు. ఈ సమయంలో మార్కెట్ యార్డులో ఎలాంటి క్రయవిక్రయాలు జరగవని చెప్పారు. ఈనెల 29 అమావాస్య బంధు, 30 ఆదివారం, ఉగాది, సోమవారం రంజాన్,31 మంగళవారం రంజాన్ మరుసటి రోజు ప్రభుత్వ సెలవుగా ప్రకటించబడింది. తిరిగి మార్కెట్ ఏప్రిల్ 2వ తారీకు ప్రారంభమవుతుందన్నారు.
Sorry, no posts matched your criteria.