Warangal

News December 1, 2025

గ్రామపంచాయతీ ఎన్నికలపై కలెక్టర్ సత్య శారద సమీక్ష

image

వరంగల్ జిల్లాలో గ్రామపంచాయతీ, వార్డ్ మెంబర్ రెండో సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద నియమించిన నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తిస్థాయిలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగేందుకు నోడల్ అధికారులు మరింత శ్రద్ధ వహించాలని ఆదేశాలు జారీ చేశారు.

News December 1, 2025

ఎయిడ్స్‌పై అవగాహన అత్యంత అవసరం: కలెక్టర్

image

వరల్డ్ ఎయిడ్స్ డే-2025 సందర్భంగా వరంగల్ జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో నిర్వహించిన అవగాహన సమావేశంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎయిడ్స్‌పై సమాజంలో విస్తృత అవగాహన అవసరమని, ముందస్తు జాగ్రత్తలు, సరైన సమాచారంతోనే వ్యాధిని నిరోధించగలమని పేర్కొన్నారు.

News December 1, 2025

వరంగల్‌: హెచ్ఐవీ కేసులు ఆందోళనకరం!

image

జిల్లాలో ఇప్పటి వరకు 5,464 మంది హెచ్ఐవీ బాధితులు నమోదు కాగా, వీరిలో 4,558 మందికి ప్రభుత్వం ప్రతి నెల ఉచిత మందులు అందిస్తోంది. 863 మంది బాధితులకు ఏఆర్జే ద్వారా నెలకు రూ.2,016 పెన్షన్ ఇస్తున్నారు. నెలకు సగటున 36 కొత్త హెచ్ఐవీ కేసులు వెలుగులోకి వస్తుండటం, గర్భిణులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో హై రిస్క్ వ్యక్తులు 3,498 మంది ఉన్నారు.
#నేడు ప్రపంచ ఎయిడ్స్ డే.

News November 30, 2025

రేపటి ప్రజావాణి రద్దు: కలెక్టర్

image

సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రేపు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వరంగల్ కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ ఉండదని స్పష్టంచేశారు. జిల్లాలోని ప్రజలు ఈ నిర్ణయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.

News November 30, 2025

పర్వతగిరి: నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ పరిశీలన..!

image

స్థానిక సంస్థల ఎన్నికలకు చేపట్టిన నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు, రాష్ట్ర బీసీ కమిషనర్ బాలమాయ దేవి పరిశీలించారు. ఈ సందర్భంగా అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ, నియమ నిబంధనలను పారదర్శకంగా చేపట్టాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ప్రతి దశను నిష్పక్షపాతంగా చేపట్టాలన్నారు. ఇండస్ట్రియల్ జీఎం నరసింహమూర్తి ఎంపీడీవో శంకర్ పాల్గొన్నారు.

News November 30, 2025

వరంగల్: వైన్స్ బంద్.. ఇబ్బందుల్లో మందుబాబులు..!

image

మద్యం దుకాణాలకు నేటితో గడువు ముగుస్తున్నందున గత మూడు రోజులుగా దుకాణాలకు ప్రభుత్వం మద్యం సరఫరాను నిలిపివేసింది. కాగా, రేపటి నుంచి కొత్త షాపులు ప్రారంభం కానుండగా, అధికశాతం షాపులు పాత అడ్డాల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. స్టాక్ లేకపోవడం, నూతన షాపుల కోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటుండటంతో జిల్లాలో వైన్ షాపులు బంద్ చేశారు. దీంతో మద్యం దొరకక మందుబాబులు విలవిల్లాడుతూ బెల్టు షాపులకు పరుగులు పెడుతున్నారు.

News November 30, 2025

వరంగల్ జిల్లా ఎన్నికల అబ్జర్వర్‌గా బాల మాయాదేవి

image

రెండో దఫా గ్రామ పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణకు వరంగల్ జిల్లా జనరల్ అబ్జర్వర్‌గా రాష్ట్ర బీసీ సంక్షేమ కమిషనర్ బి. బాల మాయాదేవిని రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై ఫిర్యాదులు, సమస్యలను 8712735548 సెల్‌కు తెలియజేయాలని కలెక్టర్ డా. సత్య శారద కోరారు.

News November 30, 2025

వరంగల్: రవాణా శాఖ హోంగార్డులకు వేతన వెతలు..!

image

వరంగల్ రవాణా శాఖలో పనిచేస్తున్న ఐదుగురు హోంగార్డులకు నాలుగు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇతర జిల్లాల్లో హోంగార్డులకు జీతాలు సక్రమంగా జమవుతున్నా, వరంగల్‌లో మాత్రం బకాయిలు క్లియర్ కాక అప్పులు చేస్తున్నారు. పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా స్పందన లేక నిరాశ చెందుతున్న వారు, ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే వేతనాలు విడుదల చేయాలని కోరుతున్నారు.

News November 30, 2025

బొబ్బరోనిపల్లి: 20 ఏళ్లుగా ఒకే కుటుంబం..!

image

దుగ్గొండి మండలం బొబ్బరోనిపల్లిలో సర్పంచ్ పదవి 20 ఏళ్లుగా ఒకే కుటుంబం చేతిలోనే కొనసాగుతోంది. 1994లో పంచాయతీ ఏర్పడిన తర్వాత 1995, 2013లో శంకేసి పద్మ, శంకేసి శోభ కమలాకర్ ఏకగ్రీవంగా గెలిచారు. 2001లో పద్మ భర్త నర్సింహాస్వామి, 2019లో కమలాకర్ విజయం సాధించారు. ఈసారి సర్పంచ్ పదవి జనరల్‌కు రావడంతో శోభ భర్త కమలాకర్ మళ్లీ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుండగా, ఫలితంపై గ్రామంలో ఆసక్తి పెరిగింది.

News November 30, 2025

WGL: ఖర్చు ఎంతైనా పర్వా నై.. ఇక బుజ్జగింపుల పర్వం..!

image

WGL జిల్లాలో తొలి విడత నామినేషన్‌ల ప్రక్రియ ముగిసింది. సర్పంచ్‌కు 656 మంది, వార్డు మెంబర్‌కు 1858 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నేటి నుంచి పార్టీల్లో బుజ్జగింపుల పర్వం ప్రారంభం కానుంది. తమ పార్టీలకు చెందిన రెబల్స్‌తో పాటు స్వతంత్రుల నామినేషన్లను వెనక్కి తీసుకునేలా నేతలు ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నారు. పదవుల కోసం రూ.లక్షలు ఖర్చుపెట్టి రంగంలోకి దిగిన కొందరు వెనకడుగు వేయకపోవడంతో హీట్ పెరగనుంది.