Warangal

News September 17, 2024

హనుమకొండ: జాతీయ జెండా ఎగురవేయనున్న కొండా సురేఖ

image

హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి మంత్రి కొండా సురేఖ ముఖ్యఅతిథిగా మంగళవారం హాజరవుతున్నారు. నేడు ఉదయం 9:48 నిమిషాలకు అదాలత్ కూడలిలోని అమరవీరుల స్తూపానికి పూలతో అంజలి ఘటించి నివాళులు అర్పించనున్నారు. అనంతరం 10 గంటలకు హనుమకొండ కలెక్టరేట్‌కు చేరుకొని జాతీయ జెండా ఎగరవేస్తారు.

News September 17, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..

image

> MLG: వితంతు మహిళపై అత్యాచారం… బాధిత కుటుంబం నిరసన
> JN: నిమజ్జనంలో అపశ్రుతి..
> HNK: గంజాయి తరలిస్తుండగా.. అరెస్టు
> JN: సీత్యా తండాలో పీడీఎస్ బియ్యం పట్టివేత..
> MLG: ఆదివాసీ విద్యార్ధి సంఘం మాజీ అధ్యక్షుడు మృతి..
> MHBD: బ్రెయిన్ ట్యూమర్ తో యువతి మృతి..
> JN: డ్రగ్స్ పై ప్రజలకు అవగాహన సదస్సు..

News September 16, 2024

ఖిల్లా వరంగల్ కోటకు మంత్రి పొంగులేటి

image

ఖిల్లా వరంగల్ కోటలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉదయం అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించనున్నారు. ఈ ఏర్పాట్లను కలెక్టర్ సత్య శారద పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణవేణి, వరంగల్ విద్యుత్ ఎస్ఈ మధుసూదన్ రావు, తాహశీల్దార్లు నాగేశ్వరరావు, ఇక్బాల్ పాల్గొన్నారు.

News September 16, 2024

సికింద్రాబాద్ నుంచి వరంగల్‌కు ఏసీలో ప్రయాణం రూ.710కే

image

నాగ్‌పూర్‌–సికింద్రాబాద్‌ మధ్య వందే భారత్‌ రైలును ప్రధాని మోడీ ప్రారంభించారు. మంగళవారం మినహా మిగతా రోజుల్లో ఈ సర్వీస్ నడవనుంది. సికింద్రాబాద్ నుంచి వరంగల్‌కు ఏసీ ధర రూ.710 అని అధికారులు స్పష్టం చేశారు. కాజీపేట స్టేషన్‌కు 10గంటల 4నిమిషాలకు ట్రైన్ చేరుకుంటుంది. నూతన ట్రైన్ ఏర్పాటుతో వ్యాపారులు, విద్యార్థులకు ఎంతగానో మేలు జరగనుంది.

News September 16, 2024

WGL: టీజ్ చేస్తే ఈ నంబర్లకు కాల్ చేయండి: సీపీ

image

గణేష్ నిమజ్జనం చేసే స్థలాలలో వ్యక్తులు అమ్మాయిలతో అనుచితంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ సీపీ ఆదేశాలు జారీ చేశారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ వంటివి చేస్తే వెంటనే ఈ నంబర్లకు కాల్స్ చేయాలని వరంగల్ సీపీ నంబర్ 8712685257, షీ టీం నంబర్ 8712685142కు కాల్ చేయాలిని సూచించారు.

News September 16, 2024

WGL: గణేశ్ నిమజ్జనం.. చెరువుల వద్ద పటిష్ఠ ఏర్పాట్లు

image

గణేశ్ నిమజ్జనాలకు నగరపాలక అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో మొత్తం 21 చెరువుల్లో నిమజ్జనం చేయనున్నారు. 28 క్రేన్ల సాయంతో విగ్రహాలను నిమజ్జనం అధికారయంత్రాంగం ఏర్పాట్లు చేసింది. రక్షణ చర్యల్లో భాగం అన్ని చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిమజ్జనం దృష్ట్యా నగరంలో ట్రాఫిక్ ఆంక్షల విధించారు.

News September 16, 2024

వరంగల్ : కొడుకు వైద్యానికి డబ్బుల్లేక తండ్రి ఆత్మహత్య

image

అనారోగ్యం బారిన పడ్డ కొడుకును రక్షించుకోవడానికి డబ్బుల్లేక ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లబెల్లి మండలం గోవిందాపురంలో జరిగింది. గ్రామానికి చెందిన కుంజ సునీల్ (28) అతడి 8 నెలల కుమారుడు 2 నెలల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. కొడుకు వైద్యం కోసం సునీల్ రూ.7లక్షలు అప్పు చేశాడు. అవి సరిపోకపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో సునీల్ ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబీకులు తెలిపారు.

News September 16, 2024

మిలాద్ ఉన్ నబి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సురేఖ

image

పవిత్ర హృదయంతో కూడిన ప్రతి మనిషికి ఈ భూమి యావత్తు ప్రార్థనాస్థలమేనన్న మహమ్మద్ ప్రవక్త మాటలు స్ఫూర్తిదాయకమైనవని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవమైన మిలాద్ ఉన్ నబీ పండుగ (సెప్టెంబర్ 16) ను పురస్కరించుకుని మంత్రి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దయ ప్రజల పై వుండాలని మంత్రి ఆకాంక్షించారు.

News September 15, 2024

MHBD: 6 నెలల క్రితం వివాహం.. ఉరేసుకొని ఆత్మహత్య

image

MHBD జిల్లా సీరోల్ మండలం మన్నెగూడెంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన వినేశ్ అనుమానాస్పద స్థితిలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి గత 6 నెలల క్రితం వివాహమైంది. సమాచారం తెలుసుకున్న డోర్నకల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా, భార్యాభర్తల మధ్య గొడవలే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది.

News September 15, 2024

నిమజ్జనం సందర్భంగా వరంగల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

image

గణపతి నిమజ్జనం సందర్భంగా వరంగల్ ట్రైసిటీస్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ తెలిపారు. ఈ ఆంక్షలు సోమవారం మధ్యాహ్నం 12 నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు. ఖమ్మం, ములుగు, నర్సంపేట, హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్లు ఆంక్షలు తప్పక పాటించాలని తెలిపారు.