India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా 99.91 శాతం విద్యార్థులు హాజరయ్యారు. సోమవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు 9,383 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 9,375 మంది హాజరు కాగా.. 8 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. DEO 4 పరీక్షా కేంద్రాలను, ACGE 5, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు 17 కేంద్రాలను సందర్శించినట్లు డీఈవో రంగయ్య తెలిపారు. మూడవ రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు అయన వెల్లడించారు.

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా 99.91 శాతం విద్యార్థులు హాజరయ్యారు. సోమవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు 9,383 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 9,375 మంది హాజరు కాగా.. 8 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. DEO 4 పరీక్షా కేంద్రాలను, ACGE 5, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు 17 కేంద్రాలను సందర్శించినట్లు డీఈవో రంగయ్య తెలిపారు. మూడవ రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు అయన వెల్లడించారు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కూలీలకు రెండు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో 11 మండలాల్లో 24,900కు పైగా కుటుంబాలు పనులు చేస్తుండగా, సుమారు రూ.5.13 కోట్ల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. 21 రోజుల్లో చెల్లించాల్సిన వేతనాలు ఆలస్యమవడంతో కూలీలు ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారు. అధికారులు వెంటనే బకాయిలు విడుదల చేయాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు.

వరంగల్ జిల్లాలో మాంసంప్రియులకు షాక్ తగిలింది. ఆదివారం చికెన్ ధరలు భారీ ధర పలికాయి. విత్ స్కిన్ కేజీ రూ.310-320 ఉండగా, స్కిన్లెస్ ధర రూ.340-350 వరకు పలుకుతోంది. లైవ్ కోడి కేజీ రూ.210-230 మధ్య విక్రయిస్తున్నారు. కాగా, నగరంతో పోలిస్తే పల్లెల్లో రూ.10-20 ధర వ్యత్యాసం ఉంది. పెరిగిన నిత్యవసర సరుకుల ధరలు, కోళ్ల సప్లై తక్కువ ఉండడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

మొక్కజొన్నకు క్వింటాకు రూ.2,400 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ సత్య శారద తెలిపారు. రైతులు పంటను విక్రయించేటప్పుడు తేమ శాతం (మాయిశ్చర్) 14 లోపు ఉండేలా చూసుకోవాలని సూచించారు. రైతులు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని, నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని కోరారు. రైతుల ఖాతాల్లో సకాలంలో డబ్బులు జమ అయ్యేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు.

వరంగల్ జిల్లాలో శుక్రవారం కురిసిన వర్షపాతం సగటున 0.9 మిల్లీమీటర్లు నమోదుకగా, జిల్లా వ్యాప్తంగా 4.9 మిల్లీమీటర్లు వర్ష పాతం నమోదైంది. జిల్లాలోని 13 మండలాల్లో సంగేంలో 1.8 మిల్లీమీటర్లు, కిలా వరంగల్లో 1.5 మిల్లీమీటర్లు, వరంగల్లో 0.8 మిల్లీమీటర్లు, గీసుకొండలో 0.8 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదుకగా, మిగిలిన 9 మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు.

పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ఈనెల23న మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్లో 7వ,8వ,9వ తరగతుల విద్యార్థులు రూపొందించిన ఆర్ట్, క్రాఫ్ట్ ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. ఇందులో ఉత్తమ ప్రదర్శనలను ఎంపిక చేసి, విజేతలకు బహుమతులు అందిస్తామని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములై సృజనాత్మకతను ప్రదర్శించాలన్నారు.

ప్రతి శాఖ తమ 99 రోజుల యాక్షన్ ప్లాన్ను రెండు రోజుల్లో సిద్ధం చేసి సమర్పించాలని కలెక్టర్ డా.సత్య శారద ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో 99 రోజుల ప్రగతి ప్రణాళికపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్ జిల్లాను అభివృద్ధిలో ముందంజలో నిలిపేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. ప్రజాప్రతినిధులను భాగస్వాములుగా చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా అమలు చేయాలన్నారు.

బడ్జెట్లో వరంగల్ జిల్లాకు అన్యాయం చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. రాష్ట్ర బడ్జెట్పై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వరంగల్ ఎంజీఎం, సూపర్ స్పెషలిటీ హాస్పిటల్కు ఒక రూపాయి కూడా కేటాయించలేదన్నారు. ఎయిర్ పోర్ట్, టెక్స్ టైల్ పార్క్, హైవే రోడ్ల మాటలేదని, గ్రేటర్ వరంగల్కు మరో సారి మొండిచెయ్యి చూపారని, దీనిపై జిల్లా మంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు.

పదవ తరగతి పబ్లిక్ పరీక్షల రెండవరోజు వరంగల్ జిల్లాలో మొత్తం 99.91 శాతం విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 9,482 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 9,473 మంది హాజరు కాగా 9 మంది గైర్హాజయ్యారు. మొత్తంగా హిందీ పరీక్షకు 99.91 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంగతులు జరగలేదని డీఈవో రంగయ్య తెలిపారు.
Sorry, no posts matched your criteria.