Warangal

News March 29, 2026

జూన్‌లో వరంగల్ నూతన కలెక్టరేట్ ప్రారంభం!

image

వరంగల్ జిల్లా పరిపాలన కేంద్రం చిరునామా మారనుంది. అజం జాహి మిల్లు స్థలంలో సర్వాంగ సుందరంగా నిర్మించిన నూతన కలెక్టరేట్ భవనం జూన్ నెలలో ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఇటీవల జిల్లా కలెక్టర్ డాక్టరు సత్యశారద భవనాన్ని సందర్శించి, ఏ అంతస్తులో ఏయే ప్రభుత్వ శాఖలను ఏర్పాటు చేయాలనే అంశంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News March 27, 2026

వరంగల్: కాంగ్రెస్ పాత కమిటీల రద్దు

image

జిల్లాలో కాంగ్రెస్ పాత కమిటీలను రద్దు చేసి కొత్త కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు డీసీసీ అధ్యక్షుడు అయూబ్ తెలిపారు. ఈ నెల 31లోగా మండల కమిటీలు, ఏప్రిల్ 15లోగా బూత్ లెవల్ కమిటీలు పూర్తి చేస్తామని చెప్పారు. సిటీలో డివిజన్ కమిటీల ఎంపిక మంత్రి కొండా సురేఖ రాక తర్వాత చేపడతామని పేర్కొన్నారు. కమిటీల్లో పదవుల కోసం నేతలు పోటీ పడనున్నారు. మండల అధ్యక్ష పదవులపై ఆయా ప్రాంతాల్లో పోటీ పెరగనుంది.

News March 27, 2026

వరంగల్: కాంగ్రెస్ పాత కమిటీల రద్దు

image

జిల్లాలో కాంగ్రెస్ పాత కమిటీలను రద్దు చేసి కొత్త కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు డీసీసీ అధ్యక్షుడు అయూబ్ తెలిపారు. ఈ నెల 31లోగా మండల కమిటీలు, ఏప్రిల్ 15లోగా బూత్ లెవల్ కమిటీలు పూర్తి చేస్తామని చెప్పారు. సిటీలో డివిజన్ కమిటీల ఎంపిక మంత్రి కొండా సురేఖ రాక తర్వాత చేపడతామని పేర్కొన్నారు. కమిటీల్లో పదవుల కోసం నేతలు పోటీ పడనున్నారు. మండల అధ్యక్ష పదవులపై ఆయా ప్రాంతాల్లో పోటీ పెరగనుంది.

News March 25, 2026

WGL: జాతీయ గ్రామీణ ఉపాధి పనులపై కలెక్టర్ సమీక్ష

image

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల్లో ఇంకా అసంపూర్తిగా ఉన్న వాటి పురోగతిపై కలెక్టర్ డా.సత్య శారద అధ్యక్షతన బుధవారం సమీక్షించారు. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనుల్లో కొన్ని పూర్తికాకుండా ఉండటానికి గల కారణాలను పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పనులను మండలాల వారీగా గుర్తించి పూర్తి చేయాలన్నారు.

News March 25, 2026

WGL: జాతీయ గ్రామీణ ఉపాధి పనులపై కలెక్టర్ సమీక్ష

image

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల్లో ఇంకా అసంపూర్తిగా ఉన్న వాటి పురోగతిపై కలెక్టర్ డా.సత్య శారద అధ్యక్షతన బుధవారం సమీక్షించారు. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనుల్లో కొన్ని పూర్తికాకుండా ఉండటానికి గల కారణాలను పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పనులను మండలాల వారీగా గుర్తించి పూర్తి చేయాలన్నారు.

News March 25, 2026

IBC సవరణ బిల్లుపై లోక్‌సభలో కడియం కావ్య గళమెత్తారు

image

IBC సవరణ బిల్లు–2025పై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్‌సభలో తీవ్ర విమర్శలు చేశారు. ఈ బిల్లు ప్రజల డబ్బును రక్షించేలా లేదని, హెయిర్‌కట్స్ పెరిగి ప్రమోటర్లు బాధ్యత తప్పించుకుంటున్నారని అన్నారు. NCLTలో ఖాళీలు ఉన్నపుడు 14 రోజుల టైమ్‌లైన్ సాధ్యం కాదని ప్రశ్నించారు. మోసాలపై కఠిన చర్యలు లేవని ఆందోళన వ్యక్తం చేస్తూ, బిల్లును పునఃపరిశీలనకు పంపాలని డిమాండ్ చేశారు.

News March 25, 2026

IBC సవరణ బిల్లుపై లోక్‌సభలో కడియం కావ్య గళమెత్తారు

image

IBC సవరణ బిల్లు–2025పై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్‌సభలో తీవ్ర విమర్శలు చేశారు. ఈ బిల్లు ప్రజల డబ్బును రక్షించేలా లేదని, హెయిర్‌కట్స్ పెరిగి ప్రమోటర్లు బాధ్యత తప్పించుకుంటున్నారని అన్నారు. NCLTలో ఖాళీలు ఉన్నపుడు 14 రోజుల టైమ్‌లైన్ సాధ్యం కాదని ప్రశ్నించారు. మోసాలపై కఠిన చర్యలు లేవని ఆందోళన వ్యక్తం చేస్తూ, బిల్లును పునఃపరిశీలనకు పంపాలని డిమాండ్ చేశారు.

News March 24, 2026

వరంగల్ జిల్లాలో టీబీ కేసులు.. వైద్యుల సూచనలు

image

జిల్లాలో టీబీ (క్షయ) కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గతేడాది 73,991 మందికి పరీక్షలు చేయగా 1,260 మందికి టీబీ నిర్ధారణ అయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 3,780 మందికి పరీక్షలు నిర్వహించగా 287 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం సుమారు 876 మంది చికిత్స పొందుతున్నారు. దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
# నేడు ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం

News March 24, 2026

WGL: రైతన్నకు ‘భరోసా’.. ఖాతాల్లో నిధుల జమ

image

యాసంగి సాగుకు సంబంధించి రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. వరంగల్ జిల్లాలో తొలి విడతగా ఎకరం లోపు భూమి ఉన్న 1,55,169 మంది రైతుల ఖాతాల్లో రూ.75.95 కోట్లు జమ చేసినట్లు కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. ఈ సాయం విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు రైతులకు ఎంతో ఊరటనిస్తుందని ఆమె పేర్కొన్నారు.

News March 23, 2026

పది పబ్లిక్ పరీక్షలకు WGL జిల్లాలో 99.86% హాజరు

image

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా 99.86 శాతం విద్యార్థులు హాజరయ్యారు. సోమవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు 12,047 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 12,030 మంది హాజరు కాగా.. 17 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. DEO 6 పరీక్షా కేంద్రాలను, ACGE 4, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు 25 కేంద్రాలను సందర్శించినట్లు డీఈవో గిరిరాజ్ తెలిపారు. 3వ రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు వెల్లడించారు..