Warangal

News April 1, 2026

WGL: ఫీజు రీయింబర్స్మెంట్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

2025– 26 విద్యాసంవత్సరానికి వరంగల్ జిల్లాలోని కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, వికలాంగుల ఫ్రెష్, రెన్యువల్ విద్యార్థులు పోస్టుమెట్రిక్, ప్రీమేట్రిక్ ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమాధికారి పీ.భాగ్యలక్ష్మి తెలిపారు. అభ్యర్థులు ఈనెల 20లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని ఆమె సూచించారు.

News April 1, 2026

వరంగల్: నేటి నుంచే 10TH పేపర్ల మూల్యాంకనం

image

పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం నేటి నుంచి కాజీపేటలోని ఫాతిమా హై స్కూల్లో ప్రారంభం కానుంది. ఏప్రిల్ 23 వరకు కొనసాగనున్న ఈ ప్రక్రియలో సుమారు 2.40 లక్షల పేపర్లను మూడు విడతల్లో దిద్దనున్నారు. ఏప్రిల్ 1– 9 వరకు భాషలు, గణితం, 10– 17 వరకు సైన్స్, 18– 23 వరకు సాంఘికం, వొకేషనల్ పేపర్లు మూల్యాంకనం చేయనున్నారు. ఏర్పాట్లను డీఈవో ఎల్వీ గిరిరాజ్ గౌడ్ పరిశీలించారు.

News April 1, 2026

హనుమకొండ: రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద రాత్రి వరకు రద్దీ

image

ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రద్దీ నెలకొంది. హనుమకొండలో సాధారణంగా రోజుకు 108 స్లాట్లు ఉండగా, ఈనెల 28 నుంచి 31 వరకు అదనంగా 80 స్లాట్లను పెంచారు. ఈనెల 28న 150, 30న 170 రిజిస్ట్రేషన్లు జరిగాయి. మంగళవారం సాయంత్రం వరకు 120 స్లాట్లు బుక్ కాగా, 112 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. నిన్న చివరిరోజు కావడంతో ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రజలు బారులు తీరారు.

News March 30, 2026

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలి: కలెక్టర్

image

ప్రజల నుంచి వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత అధికారులు తక్షణమే పరిశీలించి, నిర్ణీత కాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.సత్య శారద ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొని ప్రజల నుంచి 165 వినతులు స్వీకరించారు. అదనపు కలెక్టర్లు జి.సంధ్యారాణి, వై.వి.గణేష్ ఉన్నారు.

News March 30, 2026

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలి: కలెక్టర్

image

ప్రజల నుంచి వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత అధికారులు తక్షణమే పరిశీలించి, నిర్ణీత కాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.సత్య శారద ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొని ప్రజల నుంచి 165 వినతులు స్వీకరించారు. అదనపు కలెక్టర్లు జి.సంధ్యారాణి, వై.వి.గణేష్ ఉన్నారు.

News March 30, 2026

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలి: కలెక్టర్

image

ప్రజల నుంచి వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత అధికారులు తక్షణమే పరిశీలించి, నిర్ణీత కాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.సత్య శారద ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొని ప్రజల నుంచి 165 వినతులు స్వీకరించారు. అదనపు కలెక్టర్లు జి.సంధ్యారాణి, వై.వి.గణేష్ ఉన్నారు.

News March 30, 2026

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలి: కలెక్టర్

image

ప్రజల నుంచి వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత అధికారులు తక్షణమే పరిశీలించి, నిర్ణీత కాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.సత్య శారద ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొని ప్రజల నుంచి 165 వినతులు స్వీకరించారు. అదనపు కలెక్టర్లు జి.సంధ్యారాణి, వై.వి.గణేష్ ఉన్నారు.

News March 30, 2026

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలి: కలెక్టర్

image

ప్రజల నుంచి వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత అధికారులు తక్షణమే పరిశీలించి, నిర్ణీత కాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.సత్య శారద ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొని ప్రజల నుంచి 165 వినతులు స్వీకరించారు. అదనపు కలెక్టర్లు జి.సంధ్యారాణి, వై.వి.గణేష్ ఉన్నారు.

News March 30, 2026

వరంగల్: మూడు నెలల బియ్యం పంపిణీకి సిద్ధం

image

వరంగల్ జిల్లాలోని ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి బియ్యం రేషన్ దుకాణాలకు తరలింపు ప్రారంభమైంది. సుమారు 509 దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. నెలవారీ 5,594.26 మెట్రిక్ టన్నుల బియ్యం స్థానంలో మూడు నెలలకు కలిపి 16,858.94 మెట్రిక్ టన్నులు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 2,95,442 రేషన్ కార్డులు, 8,92,330 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News March 29, 2026

ఆస్తి పన్నుపై ఎలాంటి వడ్డీ మాఫీలేదు: కలెక్టర్

image

ఆస్తి పన్నుపై ఎలాంటి వడ్డీ మాఫీ లేదని,నగర ప్రజలు ఈనెల 31వ తేదీ లోపు పన్నులు చెల్లించి జరిమానా భారాన్ని నివారించుకోవాలని కలెక్టర్, జీసీడబ్ల్యూపీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. ఆదివారం వరంగల్‌లో 14,37,38 డివిజన్లలో, హనుమకొండలోని 5వ డివిజన్లోని సురేంద్రపురి, శ్రీనగర్ కాలనీ ప్రాంతాల్లో పన్నుల సేకరణను పరిశీలించారు. ఉప కమిషనర్లు ప్రసన్నరాణి, బిర్రు శ్రీనివాస్, రెవెన్యూ అధికారులు ఉన్నారు.