Warangal

News September 15, 2024

వరంగల్: రేపే నిమజ్జనం.. జర భద్రం

image

గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ముగిస్తుండటంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం గణనాథుడి నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. గ్రేటర్ పరిధిలోని పద్మాక్షి గుండం, బంధం చెరువు, చిన్న వడ్డేపల్లి, ఉర్సు, కోట, బెస్తం చెరువు, ఇతర ప్రాంతాల్లో నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరి మీ గణేశుడి నిమజ్జనం ఎప్పుడు? కామెంట్ చేయండి.

News September 15, 2024

వరంగల్: నిమజ్జనం కోసం చెరువులో పూడిక తీసివేత

image

వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో చెరువుల్లో గణేశ్ నిమజ్జనం కోసం పూడికతీత పనులను చేపట్టారు. గ్రేటర్ వరంగల్ ఆధ్వర్యంలో భారీ జేసీబీలతో హసన్పర్తి, కాజీపేట బంధం చెరువు, ములుగు రోడ్డులోని కోట చెరువు, దేశాయిపేట, గొర్రెకుంట, చిన్న వడ్డేపల్లి, ఖలా వరంగల్ గుండు చెరువు, రంగ సముద్రం రంగశాయిపేట బెస్తం చెరువులో పేరుకుపోయిన వ్యర్థాలు, గుర్రపు డెక్కను తొలగించారు.

News September 15, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్

image

> MHBD: రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులు
> MLG: మద్యం మత్తులో ఇద్దరు యువకుల వీరంగం
> WGL: గంజాయిని పట్టుకున్న పోలీసులు
> MHBD: గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరి అరెస్ట్
> BHPL: నిజాంపల్లిలో కరెంట్ షాక్‌తో యువకుడు మృతి
> HNK: ఆరుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
> HNK: రీల్స్ చేస్తూ హై-టెన్షన్ వైరు తాకి గాయాల పాలైన యువకుడు

News September 14, 2024

HNK: రీల్స్ చేస్తూ హై టెన్షన్ వైరు తాకి గాయాల పాలైన యువకుడు

image

రైలు పైకి ఎక్కి రీల్స్ చేస్తుండగా హైటెన్షన్ వైర్లు తాకి వ్యక్తి గాయాలపాలైన ఘటన కాజీపేటలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. రాజ్ కుమార్ అనే వ్యక్తి కడిపికొండ దగ్గరలో గల రాంనగర్ సమీప రైల్వే ట్రాక్‌పై ఆగిఉన్న గూడ్స్ రైలుపైకి సెల్ఫీలు దిగుతూ రీల్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో హై టెన్షన్ కరెంట్ వైర్లు తాకడంతో 70% శరీరం కాలిపోయింది. గమనించిన స్థానికులు ఎంజీఎంకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 14, 2024

ఈనెల 16 నుంచి 17 వరకు వైన్స్ బంద్: వరంగల్ సీపీ

image

ఈనెల 16న గణేశ్ విగ్రహాల శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఈనెల 16 నుంచి 17 వరకు మద్యం విక్రయాలను నిలిపివేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శనివారం తెలిపారు. గణేశ్ విగ్రహాల నిమజ్జనాన్ని పురస్కారించుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా వైన్స్‌లను బంద్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News September 14, 2024

జాతి నిర్మాణంలో ఇంజినీర్లది కీలక పాత్ర: మంత్రి సీతక్క

image

దేశ ప్రగతిలో ఇంజినీర్ల పాత్ర చాలా గొప్పదని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. పంచాయతీరాజ్ డిప్లమా ఇంజనీర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో సీతక్క పాల్గొన్నారు. ఆనకట్టలు, రహదారులు, వంతెనలు నిర్మించి దేశ ప్రగతిని ఇంజనీర్లు పరుగులు పెట్టించారని,తమ వృత్తికి వన్నె తెచ్చే విధంగా ఇంజినీర్లు పనిచేయాలని తెలిపారు.

News September 14, 2024

వరద నష్టం వివరాలు నమోదు చేయాలి: మంత్రి పొంగులేటి

image

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని ములకలపల్లిలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం సందర్శించారు. ఈ నేపథ్యంలో ప్రధాన రహదారి, భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కొట్టుకుపోయిన వంతెనను పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులను వరద నష్టం వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.

News September 14, 2024

కాజీపేటలో వందేభారత్ హాల్ట్

image

సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య ఈ నెల 16 నుంచి వందేభారత్ రైలు పట్టాలెక్కనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం రామగుండం, కాజీపేట స్టేషన్లలోనే హాల్టింగ్ సౌకర్యం ఉంది. మంగళవారం మినహా నాగ్‌పూర్‌లో ఉ.5 గంటలకు బయల్దేరి మ.12.15 గం.కు ఈ రైలు సికింద్రాబాద్ చేరుతుంది. మ.ఒంటి గంటకు SCలో బయల్దేరి రాత్రి 8.20 గంటలకు నాగ్‌పూర్ చేరుతుంది.

News September 14, 2024

వరంగల్‌ జిల్లాకు రూ.3కోట్లు

image

ఇటీవల కురిసిన వర్షాలు జిల్లాలో తీవ్రనష్టాన్ని మిగిల్చాయి. ఆ నష్టవివరాలను అందజేయాలని వరంగల్ కలెక్టర్ డా. సత్యశారద సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాల నేపథ్యంలో జిల్లాకు రూ.3కోట్ల నిధులను రాష్ట్రప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్ట అంచనా తయారు చేయాలని ఆమె సూచించారు.

News September 14, 2024

దేశం ఒక ప్రజాపోరాట యోధుడిని కోల్పోయింది: సీతక్క

image

దేశం ఒక ప్రజాపోరాట యోధుడిని కోల్పోయిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సీతారాం ఏచూరి చిత్రపటానికి మంత్రి సీతక్క పూలమాల వేసి నివాళులర్పించారు. భారతీయ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా సీతారాం ఏచూరి గుర్తింపు పొందారని, దశాబ్దాలుగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతూ భారత కమ్యునిస్టు రాజకీయాలపై చెరగని ముద్రవేసుకున్న ప్రజా ఉద్యమకారుడు సీతారాం ఏచూరి అని అన్నారు.