Warangal

News September 4, 2025

ఎయిర్‌పోర్ట్‌ను పరిశీలించిన ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఇంజినీరింగ్ బృందం

image

ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇంజినీరింగ్ బృందం మామునూర్ ఎయిర్‌పోర్ట్‌ను ప్రిలిమినరీ సర్వేలో భాగంగా పరిశీలించింది. అనంతరం వారు కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డా.సత్య శారదతో ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఏఎఐ ఏజీఎంలు నటరాజ్, మనీష్ జోన్వాల్, మేనేజర్లు ఓం ప్రకాష్, రోషన్ రావత్, ఎన్పీడీసీఎల్, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ అధికారులు పాల్గొన్నారు .

News September 4, 2025

WGL: పసుపు క్వింటా రూ.12,356

image

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు గురువారం చిరుధాన్యాలు తరలిరాగా, ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా మక్కలు(బిల్టీ) రూ.2,290 ధర వచ్చింది. అలాగే, సూక పల్లికాయకు రూ.6,100, పచ్చి పల్లికాయకు రూ.4,700 ధర వచ్చింది. పసుపు క్వింటా రూ.12,356 ధర వస్తే.. 5531 రకం మిర్చి రూ.14 వేలు ధర పలికాయని వ్యాపారులు తెలిపారు.

News September 4, 2025

వరంగల్: రెండు రోజులుగా అత్యల్ప వర్షపాతమే

image

వరంగల్ జిల్లాలో రెండు రోజులుగా మిశ్రమ వాతావరణం కనిపిస్తోంది. గీసుకొండలో 2 మి.మీ, సంగెంలో 0.8 అత్యల్ప వర్షపాతం నమొదయింది. ఇక మిగతా 11 మండలాల్లో ఎక్కడా చినుకు రాలలేదు. కాగా, గురువారం ఉదయం నుంచి మబ్బు పట్టి వాతావరణం చల్లబడింది. వరంగల్ నగరంలో అక్కడక్కడా తుంపర్లు పడుతున్నాయి. గత నెలలో కురిసిన విస్తారమైన వర్సలకు చెరువులు పూర్తిగా నిండిపోయి జిల్లాలో జలకళ ఉట్టిపడుతోంది.

News September 4, 2025

వరంగల్: నిబంధనలు పాటించని ఆసుపత్రులపై చర్యలు

image

అధిక సి-సెక్షన్లు చేసే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద హెచ్చరించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నిబంధనలు పాటించిన ప్రైవేటు ఆసుపత్రులకు మాత్రమే అనుమతులు మంజూరు చేస్తామని, రిజిస్ట్రేషన్ లేని ఆసుపత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లపై చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.

News September 4, 2025

WGL: డ్రోన్‌తో యూరియా పిచికారీ ప్రదర్శన.. పరిశీలించిన జిల్లా కలెక్టర్

image

గీసుగొండ మండలం తిమ్మాపురంలో రైతులకు అవగాహన కల్పించేందుకు డ్రోన్ సాయంతో నానో యూరియా పిచికారీ ప్రదర్శనను అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సత్య శారద హాజరై పరిశీలించారు. నానో యూరియా వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను కలెక్టర్ రైతులకు వివరించారు. ఉత్పాదకత పెంపుదలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని, రైతులు దీనిని వినియోగించుకోవాలని ఆమె సూచించారు.

News September 3, 2025

WGL: జిపిఓ అభ్యర్థులకు ఈనెల 5న నియామక పత్రాలు

image

ఈనెల 5న హైదరాబాద్‌లో జరగనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా జిపిఓ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో, ఏర్పాట్లపై హైదరాబాద్‌ నుంచి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద కూడా పాల్గొని, అవసరమైన ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు.

News September 3, 2025

వరంగల్: మెనూ పాటించని హాస్టల్ వార్డెన్‌పై కలెక్టర్ ఆగ్రహం

image

మెనూ పాటించని హాస్టల్ వార్డెన్‌పై కలెక్టర్ సత్య శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ పట్టణం చింతల్ యాకూబ్ పుర ప్రభుత్వ తెలంగాణ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ బాలుర ఎస్టీ హాస్టల్‌ను కలెక్టర్ సత్య శారద మంగళవారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్లో మెనూ ప్రకారం భోజనం లేకపోవడం, లైటింగ్ సమస్యలు, ప్రాంగణంలో వరదనీరు నిలవడాన్ని ఆమె గమనించారు.

News September 3, 2025

వరంగల్: బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

image

వరంగల్ పట్టణంలోని చింతల్ యఖుత్ పురలో ప్రభుత్వ తెలంగాణ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ బాలుర ఎస్టీ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మంగళవారం సాయంత్రం తనిఖీ చేశారు. వసతి గృహంలోని సౌకర్యాలను, విద్యార్థుల అభ్యాస పరిస్థితులను, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులకు తగిన సూచనలు చేశారు.

News September 3, 2025

WGL: గంజాయి ముఠా అరెస్ట్

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ డ్రగ్స్ కంట్రోల్ టీం భారీ ఆపరేషన్‌లో భాగంగా 763 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. దీని విలువ సుమారు రూ.3.81 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఖానాపూర్ మండలం, చిలుకలగుట్ట ఏరియాలో నిందితులు తెల్లటి బస్తాలను దింపుతుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు.

News September 2, 2025

భద్రకాళి అమ్మవారి దివ్య దర్శనం

image

భద్రకాళి దేవస్థానంలో ఆలయ అర్చకులు ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి హారతి ఇచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయం చేరుకొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. దేవస్థాన అర్చకులు తదితరులు ఉన్నారు.