India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
> MLG: శివాపూరులో గుండెపోటుతో వృద్ధురాలు మృతి
> BHPL: గణపురంలో పీడీఎస్ బియ్యం పట్టివేత
> MLG: పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లారీ
> MHBD: అనారోగ్యంతో సీపీఎం నాయకురాలు మృతి
> MLG: పేరూరులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
> MHBD: అనారోగ్యంతో జర్నలిస్టు మృతి
> MLG: గ్యాస్ సిలిండర్లు దొంగలిస్తున్న తల్లి కూతుల్లు అరెస్ట్
టీజీ ఎన్పీడీసీఎల్లో వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ఎవరైనా లంచం అడిగితే ఉపేక్షించదని యాజమాన్యం తెలిపింది. సంస్థలో అవినీతి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సాధించామని అన్నారు. సేవలకు ప్రతిఫలంగా లంచం అడిగితే 9281033233, 1064కు కాల్ చేయాలని తెలిపారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 సర్కిల్లో అన్ని కార్యాలయంలో పోస్టర్లను పెట్టడం జరిగిందన్నారు.
పారాలింపిక్స్లో కాంస్య పథకం సాధించిన దీప్తి జీవంజిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఘనంగా సన్మానించారు. వరంగల్ జిల్లాకు చెందిన దీప్తి పథకం సాధించడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని సీతక్క అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సాట్ చైర్మన్ శివసేనారెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయి-మేడారం అడవుల్లో కొన్ని రోజుల క్రితం విపత్తు కారణంగా వేల చెట్లు నేలకొరిగాయి. ఇప్పుడు ఆ ప్రాంతం చెట్లను కోల్పోయి వెలవెలబోతోంది. విపత్తు కారణంగా నేలకూలిన చెట్లను చూడటానికి చుట్టుపక్కల మండల ప్రజలు, విద్యార్థులు, మేడారం దర్శనం కోసం వచ్చే భక్తులు పర్యాటక ప్రాంతంగా తరలివచ్చి వీక్షిస్తున్నారు. అందరూ సెల్ ఫోన్లో చిత్రీకరించుకుంటున్నారు. ఎప్పుడు ఇంతటి విపత్తు చూడలేదని వారు తెలిపారు.
విద్య ఉజ్వల భవిష్యత్తుకు పునాది అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా నేడు మంత్రి సీతక్క ట్వీట్ చేశారు. చదువు మన తలరాతను మారుస్తుందని, ప్రతి ఒక్కరు కష్టపడి చదివి మన సమాజాభివృద్ధికి కృషి చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన WGL జిల్లాలో శనివారం మధ్యాహ్నం జరిగింది. స్థానికుల ప్రకారం.. ములుగు జిల్లా మంగపేట మండలం చింతకుంటకు చెందిన కొమురం జగన్ NSPT పోలీస్ స్టేషన్లో పట్టణ CI గన్మెన్గా పనిచేస్తున్నాడు. అయితే శనివారం గణపతి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని ఇంటి వెళ్లాడు. వాంతులు చేసుకోగా.. కుటుంబీకులు ఆస్పత్రికి తరలించడతంతో అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
కాళేశ్వరం ఎత్తిపోతల్లో ప్రధాన బ్యారేజీలతో పాటు మల్లన్న సాగర్ జలాశయ నిర్మాణానికి సంబంధించి చెన్నై హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఈనెల 11న విచారణ చేపట్టనుంది. సుమోటోగా స్వీకరించిన ఫిర్యాదు మేరకు తొలుత ఢిల్లీ ఎన్జీటీ ధర్మాసనం కాళేశ్వరంపై విచారణ చేపట్టి కేసును చెన్నై ధర్మాసనానికి బదిలీ చేసింది. క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి నివేదిక సమర్పించాలంటూ జిల్లా కలెక్టర్ నీటిపారుదల శాఖలను ధర్మాసనం ఆదేశించింది.
అన్నారం షరీఫ్ యాకూబ్ బాబా దర్గాలో వసూళ్ల పర్వం కొనసాగుతోందన భక్తులు మండిపడుతున్నారు. టెండర్ దారులు సొంత రశీదు టిక్కెట్లు ముద్రించి డబ్బులు వసూలు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. కందూరు చేయాలంటే రూ.2వేలకు పైగానే చెల్లించుకోవాల్సిందేనని వాపోతున్నారు. దర్గాలో భక్తుల నుంచి బలవంతంగా కానుకల పేరిట వసూలు చేస్తున్నారని, ఈ అక్రమాలపై అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. మీరూ వెళ్తే కామెంట్ చేయండి.
మేడారం అడవుల్లో ఘోర విపత్తుపై ప్రభుత్వానికి అటవీ రక్షణ ప్రధానాధికారి డోబ్రియాల్ని నివేదిక ఇచ్చారు. క్లౌడ్ బరస్ట్ వల్లే ఈ విపత్తు సంభవించిందని, మేఘాలు కిందకు వచ్చి బరస్ట్ కావడంతోనే చెట్లు నేలకూలాయని తెలిపారు. 3 కి.మీటర్ల పొడవు, 2 కిలో మీటర్ల వెడల్పులో 204 హైక్టార్లలో 50 వేల చెట్లు కూలాయన్నారు. క్లౌడ్ బరస్ట్ ఎందుకు జరిగిందో తెలుసుకోవాలని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్కు తెలిపామని అన్నారు.
వినాయక చవితి వేడుకలకు ఉమ్మడి వరంగల్ జిల్లా సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా వినాయక మండపాలకు గణనాథులను భక్తులు బాజాబజంత్రీలతో తీసుకువచ్చారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎల్లం బజార్లో భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ తరహాలో 40 అడుగుల భారీ మట్టి గణపతిని ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఎల్లంబజార్ గణపతి ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
Sorry, no posts matched your criteria.