Warangal

News March 8, 2025

రైల్వే శాఖ మంత్రికి వినతిపత్రం అందజేత

image

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి, వరంగల్ ఎంపీ డా.కడియం కావ్యలు మర్యాదపూర్వకంగా కలిశారు. కాజీపేట జంక్షన్‌కు రైల్వే డివిజన్‌గా అప్‌గ్రేడ్‌ చేయాలని కోరుతూ ఎంపి కేంద్రమంత్రికి వినతిపత్రం అందజేశారు. అలాగే నష్కల్ నుంచి హసన్‌పర్తి, నష్కల్ నుంచి చింతలపల్లి నూతన రైల్వే బైపాస్ లైన్లను ORR చుట్టూ అలైన్‌మెంట్‌ చేయాలని కోరారు.

News March 8, 2025

హనుమకొండ జిల్లాలో MURDER.. కారణం ఇదే..!

image

హనుమకొండ(D),ఎల్కతుర్తి(M), వీరనారాయణ గ్రామంలో తల్లి రేవతిని <<15683962>>కొడుకు చంపిన<<>> విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. కుమారస్వామి,రేవతి(40) దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకొడుకు అజయ్(23) 2ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. తండ్రి 15ఏళ్ల క్రితం చనిపోగా తల్లి పెద్దకొడుకు వద్ద ఉంది. రాత్రి తాగొచ్చిన అజయ్ తల్లిని గొడ్డలితో నరికి చంపాడు.

News March 8, 2025

Way2News Special.. వరంగల్‌ను శాసిస్తున్న మహిళా శక్తి

image

ఓరుగల్లును మరోసారి మహిళా శక్తి శాసిస్తోంది. ఒకప్పుడు రుద్రమదేవి పరిపాలనలో గొప్ప శోభను అందుకున్న వరంగల్ రాజ్యం,నేడు అనేక కీలక పదవుల్లో మహిళా నేతలు, అధికారులతో మరో చరిత్ర సృష్టిస్తోంది.మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, వరంగల్ ప్రాంతాన్ని నడిపిస్తున్న మహిళా నేతల కృషిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కీలక హోదాల్లో మహిళలు ప్రభుత్వ పరిపాలన నుంచి రాజకీయాల వరకు భాగమవుతున్నారు. HAPPY WOMEN’S DAY.

News March 8, 2025

ఈనెల 27న వరంగల్‌లో భారీ బహిరంగ సభ

image

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 27 ఏప్రిల్ తేదీకి 25 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో జరిగిన సమావేశంలో కీలక ప్రకటన చేశారు. ఓరుగల్లు (వరంగల్)లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.

News March 8, 2025

హనుమకొండ: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం.. నిందితుడి అరెస్ట్

image

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ, అలాగే నిట్‌ లాంటి కళాశాలల్లో సీటు ఇప్పిస్తున్నానంటూ బాధితుల నుంచి రూలక్షల్లో డబ్బుతో పాటు బంగారు అభరణాలను స్వాహా చేసిన మోసగాడిని హనుమకొండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి పోలీసులు సుమారు రూ.5.10 లక్షల విలువ గల బంగారు అభరణాలతోపాటు రూ.2.68 లక్షల నగదు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

News March 8, 2025

వరంగల్: ఎల్ఆర్ఎస్ నిబంధన ప్రకారం అమలు చేయాలి..

image

ఎల్ఆర్ఎస్ నిబంధనల ప్రకారం పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ కార్యదర్శి దాన కిషోర్ అన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఎల్ఆర్ఎస్ పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ 2020 క్రమబద్ధీకరణకు సంబంధించిన ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలన్నారు.

News March 7, 2025

BREAKING: హనుమకొండ జిల్లాలో MURDER

image

హనుమకొండ జిల్లాలో కాసేపటి క్రితం దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఎల్కతుర్తి మండలం వీర్నరాయణపూర్‌లో తల్లిని కొడుకు గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. మృతురాలు వీర్నరాయణపూర్ గ్రామానికి చెందిన చదిరం రేవతిగా గుర్తించారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 7, 2025

వరంగల్ నూతన పోలీస్ కమిషనర్‌గా సన్ ప్రీత్ సింగ్

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన సీపీగా సన్ ప్రీత్ సింగ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన సీపీ గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఓఎస్‌డీగా పనిచేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న అంబర్ కిషోర్ ఝాను రామగుండం పోలీస్ కమిషనరేట్ కమిషనర్‌గా నియమించారు.

News March 7, 2025

MHBD: పోలీస్ స్టేషన్‌లో దావత్.. ఇద్దరి సస్పెండ్

image

మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రాజారాం, కానిస్టేబుల్ సుధాకర్‌ను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేస్తూ ఐ.జి చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ స్టేషన్‌పైన విశ్రాంతి గదిలో ఇద్దరు బయట వ్యక్తులతో కలిసి మద్యం తాగినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై విచారణ జరిపి సస్పెండ్ చేసినట్లు ఐజీ వెల్లడించారు.

News March 7, 2025

WGL: మనం ప్రమాదకరమైన గాలిపీలుస్తున్నాం..!

image

కర్బన ఉద్గారాలతో గాలి నాణ్యత తగ్గి, భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గాలి నాణ్యత విలువ 0-50 ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 51-100ఉంటే పర్వాలేదని, 101-150 ఉంటే పెద్దలూ, పిల్లల్లో ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులు రావొచ్చని హెచ్చరిస్తున్నారు. 201-300 ఉంటే అందరికి వచ్చే ప్రమాదముంది. ఉమ్మడిWGLలో గాలినాణ్యత విలువ 104గా ఉంది. ఇప్పటికైనా మనం మారాల్సిన అవసరముంది.ఏమంటారు!

error: Content is protected !!