India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. నెల రోజులుగా తన రికార్డును తానే బ్రేక్ చేస్తూ మొక్కజొన్న ఈరోజు భారీ ధర పలికింది. మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈరోజు రికార్డు ధర వచ్చింది. నేడు క్వింటా మక్కలకు రూ.2,960 ధర వచ్చినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. కాగా మంగళవారం రూ.2,885, బుధవారం రూ.2,911, గురువారం రూ. 2936 ధర వచ్చింది.
వరంగల్ టిమ్స్ ఆసుపత్రి వ్యయం పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. గత సర్కారు నిర్మించ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వ్యయాలపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ ఆస్పత్రి స్థలం మార్ట్గేజ్పై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అంచనా వ్యయాలను పెంచడానికి గల కారణాలను సీఎం తెలుసుకుంటున్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు అన్ని రకాల మిర్చి ధరలు పడిపోయాయి. గురువారం క్వింటా తేజ మిర్చి ధర రూ.18,000 పలకగా.. నేడు రూ.17,500 పలికింది. అలాగే 341 రకం మిర్చి నిన్న రూ.14,600 పలకగా నేడు రూ.14,000కి తగ్గింది. మరోవైపు వండర్ హాట్ మిర్చి(WH)కి నిన్న రూ.15వేల ధర రాగా ఈరోజు రూ.14,500కి చేరింది.
ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో 5లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో చేపట్టిన దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు నిర్ణయించారు. జలయజ్ఞం కింద 2005లో రూ.6 వేల కోట్లతో ప్రారంభించగా, ఇప్పటికీ రూ.14 వేల కోట్లు వెచ్చించారు. నానాటికీ గడువు, అంచనా వ్యయం పెరుగుతోంది. పూర్తి పనులకు మరో రూ.3 వేల కోట్లు అవసరమని అంచనా వేశారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు పత్తి ధర మళ్లీ తగ్గింది. ఈరోజు క్వింటా పత్తి రూ.7,500 పలికింది. ఈ వారం మొదటి రోజు (మంగళవారం) పత్తి ధర రూ.7,600 పలకగా, బుధవారం రూ.7,560కి చేరింది. గురువారం మరింత తగ్గి రూ.7,555కి పడిపోయి, నేడు మరింత పతనమైంది. పత్తి ధరలు రోజురోజుకు తగ్గుతుండడంతో రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు.
అనుమతి లేని స్థలాల క్రమబద్ధీకరణకు అడుగడుగునా సమస్యలు వెంటాడుతున్నాయి. పట్టణ భూగరిష్ఠ పరిమితి (అర్బన్ ల్యాండ్ సీలింగ్) నిబంధనలు, WGL నూతన బృహత్ ప్రణాళిక (మాస్టర్ ప్లాన్) జోన్లు, ధరణి పోర్టల్ అనుసంధానంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. HNK, WGL ప్రాంతాల్లో 82 వేల పైచిలుకు దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉంది. అపరిష్కృతంగా ఉన్న స్థలాల క్రమబద్ధీకరణ కోసం వేలాదిమంది బల్దియా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
జనగామలో గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతో వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రానున్న గణపతి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉత్సవ కమిటీ సభ్యులదే అని అన్నారు. ఇతర మతాల వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దన్నారు.
> NSPT: ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి అడ్మిషన్
> HNK: శిక్షణ సమయంలోనే పోలీస్ చట్టాలపై సాధించాలి: సీపీ
> JN: జిల్లాలో పర్యటించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
> WGL: మార్కెట్లో క్వింటా పత్తి ధర రూ.7,555, మక్కల ధర రూ.2,936
> BHPL: మేడిగడ్డ బ్యారేజీకి కొనసాగుతున్న వరద
> WGL: ఎంజీఎంలో కనీస వసతులు కరవు
> BHPL: ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్
> MHBD: నీటి సంపులో పడి చిన్నారి మృతి..
> WGL: ఉరి వేసుకుని ఒకరు బలవన్మరణం
> MHBD: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
> TRR: వివాహిత ఆత్మహత్యాయత్నం
> BHPL: పేకాట స్థావరాలపై దాడులు
> MHBD: సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన సదస్సు
> BHPL: కాటారంలో దొంగల భీభత్సం
> HNK: పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో తీవ్ర విషాదం జరిగింది. గూడూరు మండలం పడమటి తండా గ్రామ శివారు భాగ్య తండాకు చెందిన మూడేళ్ల చిన్నారి గురువారం సాయంత్రం ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందింది. చిన్నారి మృతితో భాగ్య తండాలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.