News January 3, 2025
CBIకి రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం లేదు: సుప్రీం
రాష్ట్రాల పరిధిలో పనిచేస్తున్న కేంద్ర ఉద్యోగులపై FIR నమోదుకు CBIకి రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ఇద్దరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతికి సంబంధించి CBI దర్యాప్తును AP హైకోర్టు గతంలో రద్దు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా HC తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. కేంద్ర ఉద్యోగులపై ఎఫ్ఐఆర్కు రాష్ట్రాల అనుమతి అవసరం లేదని పేర్కొంది.
Similar News
News January 25, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News January 25, 2025
మాజీ సీఎం కేసీఆర్ సోదరి కన్నుమూత
TG: మాజీ సీఎం కేసీఆర్ ఐదో సోదరి చీటి సకలమ్మ కన్నుమూశారు. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో కొద్దిసేపటి కిందటే చనిపోయారు. కొంతకాలంగా వయోభారం, అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె కన్నుమూయగా, మృతదేహాన్ని ఓల్డ్ అల్వాల్లోని నివాసానికి తరలించారు. సకలమ్మ మృతిచెందడంతో సోదరుడు కేసీఆర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
News January 25, 2025
జగన్ CM కావడానికి VSR పనిచేశారు: కాకాణి
AP: జగన్ CM కావడానికి <<15247358>>విజయసాయిరెడ్డి<<>> పని చేశారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ‘పార్టీ కోసం పాటుపడ్డారు. కుట్రలు, దుష్ప్రచారం చేసినా ధైర్యంగా ఎదుర్కొన్నారు. వైసీపీతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది’ అని కాకాణి చెప్పారు. మరోవైపు తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నానన్న వార్తలను ఆ పార్టీ నేత అయోధ్య రామిరెడ్డి ఖండించారు. దావోస్ పర్యటన నుంచి వచ్చాక మీడియాతో మాట్లాడతానన్నారు.