News January 6, 2025
మరికొన్ని రోజుల్లో సీబీఐ దాడులు: కేజ్రీవాల్
మనీశ్ సిసోడియా ఇంట్లో మరికొన్ని రోజుల్లో CBI సోదాలు చేయనుందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ అరెస్టులు, దాడులు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన బీజేపీ నిరాశలో ఉందనడానికి నిదర్శనమన్నారు. ఇప్పటిదాకా తమకు వ్యతిరేకంగా వారికి ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఇక ముందు కూడా దొరకవని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇరువురూ బెయిల్పై ఉన్న విషయం తెలిసిందే.
Similar News
News January 21, 2025
క్షేమంగానే మావోయిస్టు నేత దామోదర్!
TG: ములుగు జిల్లా తాడ్వాయికి చెందిన మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లో ఈ నెల 16న జరిగిన ఎన్కౌంటర్లో దామోదర్ చనిపోయినట్లు ఆ పార్టీ లేఖ విడుదల చేసింది. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. తాను క్షేమంగానే ఉన్నట్లు దామోదర్ కుటుంబీకులకు చేరవేసినట్లు సమాచారం. ఎన్కౌంటర్లో 16మంది మావోలు చనిపోయిన విషయం తెలిసిందే.
News January 21, 2025
నేడు KRMB కీలక సమావేశం
కృష్ణా నది యాజమాన్య బోర్డు(KRMB) నేడు హైదరాబాద్ జలసౌధలో కీలక సమావేశం కానుంది. ఇప్పటికే 2సార్లు వాయిదా పడిన ఈ భేటీ ఉ.11గంటలకు జరగనుంది. నాగార్జున సాగర్ భద్రతకు సంబంధించిన నిఘా, తనిఖీలు, పర్యవేక్షణ తమ పరిధిలోనే ఉండాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. అటు సాగర్, శ్రీశైలంలోని కాంపొనెంట్లను కృష్ణాబోర్డుకు అప్పగించాలని, ప్రాజెక్టుల రక్షణ CRPFకు ఇవ్వాలని AP కోరుతోంది. ఈ అంశాలే అజెండాగా భేటీ జరగనుంది.
News January 21, 2025
ఆ పెన్షన్ దారులందరికీ వైద్య పరీక్షలు
AP: దివ్యాంగుల పెన్షనర్లలో అనర్హులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంధత్వం, వినికిడి లోపం, కాళ్లు, చేతులు దెబ్బతినడంతో రూ.6వేలు పెన్షన్ పొందుతున్నవారికి ఒకట్రెండు రోజుల్లో పరీక్షలు చేసి అనర్హులను తొలగించనుంది. రాష్ట్రంలోని సుమారు 7లక్షల మంది లబ్ధిదారుల్లో 40% అనర్హులు ఉండొచ్చని అంచనా. అవయవాలు బాగానే ఉన్నా ఫేక్ సర్టిఫికెట్లతో ఇన్నాళ్లూ డబ్బులు తీసుకున్నవారి పెన్షన్ కట్ కానుంది.