News February 18, 2025
సీఈసీ నియామకం.. కేంద్రంపై కాంగ్రెస్ మండిపాటు

చీఫ్ ఎలక్షన్ కమిషనర్(CEC) ప్రకటన కేంద్రం తొందరపాటు నిర్ణయమని కాంగ్రెస్ మండిపడింది. ‘ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఎన్నికల ప్రక్రియ పవిత్రతను కలిగి ఉండాలని సుప్రీంకోర్టు ఎన్నోసార్లు పునరుద్ఘాటించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నిష్పక్షపాతంగా ఉండాలి. సుప్రీంకోర్టు తీర్పు రాకముందే సీఈసీ నియామకాన్ని చేపట్టడం అత్యున్నత ధర్మాసనాన్ని అవమానించడమే’ అని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ విమర్శించారు.
Similar News
News January 23, 2026
దక్షిణ కోస్తా రైల్వే జోన్ చుట్టూ వివాదం!

AP: విశాఖ కేంద్రంగా ఏర్పడుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ బౌండరీస్ చుట్టూ వివాదం రాజుకుంటోంది. గెజిట్ నోటిఫికేషన్ విడుదలలో జాప్యం, జూరిడిక్షన్ అంశం చర్చనీయాంశమైంది. వాల్తేర్ డివిజన్ ఆదాయానికి కీలకమైన కొత్తవలస-కిరండల్ లైన్ను ఒడిశా పరిధికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలొస్తున్నాయి. దీంతో స్వయం సమృద్ధి కలిగిన రైల్వే జోన్ కావాలంటూ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
News January 23, 2026
JC vs పెద్దారెడ్డి.. తాడిపత్రిలో హై అలర్ట్

AP: తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. JC ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి పరస్పరం సవాల్ విసురుకున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇద్దరి ఇళ్ల వద్ద భారీగా బలగాలను మోహరించారు. రాయలసీమ ప్రాజెక్టులపై చర్చకు కేతిరెడ్డి సవాల్ విసరగా.. సిద్ధమంటూ ఆయన ఇంటి ముట్టడికి JC వర్గీయులు పిలుపునిచ్చారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ TDP కౌన్సిలర్లు పెద్దారెడ్డిపై PSలో ఫిర్యాదు చేశారు.
News January 23, 2026
‘₹40 లక్షలు మోసం చేశాడు’.. మంధాన మాజీ ప్రియుడిపై ఫిర్యాదు

భారత క్రికెటర్ స్మృతి మంధాన మాజీ ప్రియుడు పలాశ్ ముచ్చల్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన ₹40 లక్షలు మోసం చేశారని సాంగ్లి(MH)లో విజ్ఞాన్ మానే అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘నజరియా అనే మూవీలో ఇన్వెస్ట్ చేయాలని, నటించే ఛాన్స్ ఇస్తానని పలాశ్ చెప్పాడు. అతడికి ₹40 లక్షలు ఇచ్చా. ప్రాజెక్టు పూర్తి కాలేదు. డబ్బు ఇవ్వమంటే పట్టించుకోలేదు’ అని పేర్కొన్నారు. అటు FIR నమోదు కాలేదని పోలీసులు చెప్పారు.


