News April 9, 2025
తిరుపతి-పాకాల-కాట్పాడి డబ్లింగ్ పనులకు కేంద్రం ఆమోదం

తిరుపతి-పాకాల-కాట్పాడి సింగిల్ రైల్వే లైన్ (104km) డబ్లింగ్ పనులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు రూ.1,322కోట్లతో చేపట్టే ఈ పనుల ద్వారా 400 గ్రామాల్లోని 14 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. దీని ద్వారా 35 లక్షల పని దినాల కల్పన, పర్యాటకంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. ఏడాదికి 4M టన్నుల సరకు రవాణాకు కూడా అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.
Similar News
News November 21, 2025
పైరసీ కట్టడికి ప్రత్యేక వింగ్?

TG: సినిమాల పైరసీ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇదే సమయంలో దానిపై ఉక్కుపాదం మోపేందుకు ఓ ప్రత్యేక వింగ్ పెట్టాలని సీఎం రేవంత్ ఆలోచిస్తున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. పైరసీతో పాటు ఇతర సైబర్ నేరాల కట్టడికి ఇదే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఇప్పటికే పోలీస్ శాఖకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు వివరించాయి. ఐ బొమ్మ రవి అరెస్టును పోలీసులు ఛాలెంజ్గా తీసుకున్న విషయం తెలిసిందే.
News November 21, 2025
నవంబర్ 21: చరిత్రలో ఈ రోజు

1947: స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి తపాలా బిళ్ల విడుదల
1970: శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సి.వి.రామన్ మరణం (ఫొటోలో)
1987: నటి నేహా శర్మ జననం
2013: తెలుగు సినీ నిర్మాత వడ్డే రమేశ్ మరణం
☛ ప్రపంచ మత్స్య దినోత్సవం
☛ ప్రపంచ టెలివిజన్ దినోత్సవం
News November 21, 2025
నవంబర్ 21: చరిత్రలో ఈ రోజు

1947: స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి తపాలా బిళ్ల విడుదల
1970: శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సి.వి.రామన్ మరణం (ఫొటోలో)
1987: నటి నేహా శర్మ జననం
2013: తెలుగు సినీ నిర్మాత వడ్డే రమేశ్ మరణం
☛ ప్రపంచ మత్స్య దినోత్సవం
☛ ప్రపంచ టెలివిజన్ దినోత్సవం


