News July 6, 2024
అమరావతి ORRకి కేంద్రం గ్రీన్ సిగ్నల్
AP: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. భూసేకరణ సహా మొత్తం రూ.20-25 వేల కోట్లకు పైగా నిర్మాణ వ్యయాన్ని భరించనుంది. ఉమ్మడి కృష్ణా, GNT జిల్లాల్లో CRDA పరిధిలో 189కి.మీ మేర ఈ ORRని నిర్మిస్తారు. అలాగే VJA తూర్పు బైపాస్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అమరావతి- HYD మధ్య 6 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే, మేదరమెట్ల- అమరావతి రహదారి ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించింది.
Similar News
News October 5, 2024
ABHIMANYU: అసాధారణంగా ఆడుతున్నా అవకాశమేదీ?
దేశవాళీ క్రికెట్లో ఉత్తరాఖండ్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నారు. కానీ టీమ్ ఇండియా ఎంట్రీ మాత్రం ఆయనకు అందని ద్రాక్షగా మారిందని నెటిజన్లు అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఇరానీ ట్రోఫీలోనూ 191 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడారు. 166 ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్ల్లో 26 సెంచరీలతో 7,506 పరుగులు చేశారు. 29 ఏళ్ల అభిమన్యును బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సెలక్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
News October 5, 2024
నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు
సినీ హీరో అక్కినేని నాగార్జునపై జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర రెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుమ్మిడికుంట చెరువు కబ్జాచేసి N-కన్వెన్షన్ నిర్మించారని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు లీగల్ ఒపీనియన్కు పంపారు. నాగార్జున చెరువును ఆక్రమించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారని, చట్టాలను ఉల్లంఘించారని భాస్కర రెడ్డి పేర్కొన్నారు.
News October 5, 2024
Project Flower గురించి తెలుసా?
ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధానికి దిగిన ఇరాన్-ఇజ్రాయెల్ దేశాలు ఒకప్పుడు పరస్పరం సహకరించుకున్నాయి. సైనిక సహకారం కోసం Project Flower పేరుతో 1977లో ఇరాన్-ఇజ్రాయెల్ కలసి పనిచేశాయి. నాటి ఇరాన్ షా మొహమ్మద్ రెజా రక్షణ వ్యవస్థ బలోపేతానికి ఇజ్రాయెల్ సాయం తీసుకున్నారు. ప్రతిఫలంగా ఇజ్రాయెల్ భారీగా అయిల్ వనరులు పొందింది. అయితే, ఈ ప్రాజెక్టు 1979లో Iranian Revolution- 1979 కారణంగా అర్ధాంతరంగా ముగిసింది.