News August 20, 2024
లేటరల్ ఎంట్రీ నియామకాలపై కేంద్రం యూటర్న్

లేటరల్ ఎంట్రీ నియామకాలపై కేంద్రం వెనక్కి తగ్గింది. ప్రైవేటు రంగం నుంచి 45 మంది కార్యదర్శుల నియామకాలకు జారీ చేసిన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని యూపీఎస్సీకి కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ లేఖ రాశారు. ఈ ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నియామకాలపై ప్రతిపక్షాలతో సహా మిత్రపక్షమైన ఎల్జేపీ వ్యతిరేకత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News February 15, 2025
బాంబూ సాల్ట్.. కిలో రూ.30,000

ఉప్పు బ్రాండ్లను బట్టి KG ₹30-₹200 వరకు ఉంటుంది. అయితే కొరియన్/బాంబూ సాల్ట్ ధర ₹20-30K. దీన్ని తొలుత కొరియాలో తయారుచేసేవారు. వెదురు బొంగులో సముద్రపు ఉప్పును నింపి 400డిగ్రీల వద్ద కాల్చుతారు. ఇలా 9సార్లు చేస్తే స్పటిక రూపంలోకి మారుతుంది. KG తయారీకి 20D పడుతుంది. ఇందులో 73మినరల్స్ ఉంటాయి. దీన్ని వాడితే ఆరోగ్య సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో ఉత్తరాఖండ్ సర్కార్ దీన్ని తయారుచేస్తోంది.
News February 15, 2025
సిన్నర్పై డోపింగ్ ఆరోపణలు.. మూడు నెలలు నిషేధం

మెన్స్ టెన్నిస్ నం.1 ప్లేయర్ జన్నిక్ సిన్నర్కు భారీ షాక్ తగిలింది. డోపింగ్లో పట్టుబడ్డ అతడిపై వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ 3 నెలల నిషేధం విధించింది. ఫిజియోథెరపీ సమయంలో ఉత్ప్రేరకం తన శరీరంలోకి వెళ్లిందని సిన్నర్ ఆంగీకరించారు. WADA కూడా సిన్నర్ ఉద్దేశపూర్వకంగా ఎలాంటి మోసం చేయలేదని పేర్కొంది. అయినా FEB 9- మే 4 వరకు నిషేధం అమల్లో ఉంటుందంది. కాగా ఇటీవల సిన్నర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచారు.
News February 15, 2025
భారత్లో పర్యటించనున్న ఖతర్ దేశాధినేత

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఖతర్ దేశాధినేత షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ తనీ ఈ నెల 17-18 తేదీల్లో భారత్లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ పర్యటనలో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు కేంద్ర మంత్రులు, సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలతో ఆయన భేటీ కానున్నట్లు తెలిపింది.