News June 11, 2024

మహారాష్ట్రలో ‘కేంద్ర కేబినెట్’ చిచ్చు

image

మహారాష్ట్రలో 7 ఎంపీ సీట్లు గెలుచుకున్నప్పటికీ కేంద్రంలో ఒకటే సహాయమంత్రి పదవి దక్కడంపై శివసేన(శిండే) గుర్రుగా ఉంది. కనీసం కేబినెట్ హోదా మంత్రి పదవి రాకపోవడంపై నిరాశగా ఉన్నామని ఆ పార్టీ ఎంపీ శ్రీరంగ్ తెలిపారు. తక్కువ సీట్లు గెలిచిన చిరాగ్ పాస్వాన్, కుమారస్వామి, జితిన్ రాం మాంఝీకి కేబినెట్ పదవులు ఇచ్చారని మండిపడ్డారు. ఇక ఒక సీటే గెలిచిన NCP(అజిత్ పవార్)కి సహాయమంత్రి పదవి ఆఫర్ చేయగా తిరస్కరించింది.

Similar News

News March 15, 2025

RCB: ఈసారైనా కప్ నమ్‌దేనా..!

image

IPL ఆరంభం నుంచి టైటిల్ కోసం RCB విశ్వప్రయత్నాలు చేస్తోంది. 17 సీజన్లు గడిచినా అది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఈసారైనా ఆ జట్టు కప్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. తనదైన రోజు ఏ జట్టునైనా ఓడించగలిగే RCBలో కోహ్లీ, పాటీదార్, లివింగ్‌స్టోన్, సాల్ట్, బేథేల్, జితేశ్, డేవిడ్ లాంటి హిట్టర్లు ఉన్నారు. బౌలింగ్‌లోనూ యశ్ దయాల్, భువీ, ఎంగిడి, హేజిల్‌వుడ్, తుషార్ ఉన్నారు. మరి RCB ఈసారి కప్ కొడుతుందా?

News March 15, 2025

బుమ్రాను ఆడగలననుకోవడం నా అమాయకత్వం: ఆస్ట్రేలియా బ్యాటర్

image

భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా బ్యాటర్ మెక్‌స్వీనీ ప్రశంసలు కురిపించారు. బుమ్రాను ఆడటం చాలా కష్టమని పేర్కొన్నారు. ‘ఆయన బౌలింగ్‌లో కష్టపడ్డానన్నది చాలా చిన్నపదం. బుమ్రా అత్యద్భుతమైన బౌలర్. అందరు బౌలర్లలా ఆయన్ను ఆడేయొచ్చని నేను అమాయకంగా పొరబడ్డా. అతడిని ఎదుర్కోవడం చాలా కష్టం. అయితే, బుమ్రా బౌలింగ్‌ను నాలాగే ఇతర బ్యాటర్లు కూడా ఆడలేకపోయారన్నది ఒక్కటే స్వల్ప ఊరట’ అని పేర్కొన్నారు.

News March 15, 2025

బెడ్‌పై తిని పడుకుంటే రూ.4.7 లక్షల జీతం

image

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) బంపరాఫర్ ఇచ్చింది. 10 రోజులపాటు వాటర్ బెడ్‌పై పడుకుంటే రూ.4.7 లక్షల జీతం చెల్లిస్తోంది. వాటర్‌ప్రూఫ్ ఫ్యాబ్రిక్‌తో స్పెషల్ బాత్ టబ్‌లు తయారు చేసింది. ఇందులో పడుకునే 10 మంది వాలంటీర్లకు ఫుడ్, డ్రింక్స్, ఫోన్ అన్ని సమకూరుస్తారు. ఈ 10 రోజులూ వారు ఆ బెడ్‌పై విశ్రాంతి తీసుకోవడమే పని. స్పేస్ జర్నీలో మానవ శరీరంపై ఉండే ప్రభావాలను అంచనా వేసేందుకే ESA ఈ ప్రయోగం చేపట్టింది.

error: Content is protected !!