News November 29, 2024

కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్‌లో పడింది: కాంగ్రెస్‌

image

పార్ల‌మెంటు సమావేశాలు వ‌రుస‌గా వాయిదా ప‌డుతున్నా కేంద్రం ఎందుకు సభను నియంత్రించ‌డం లేద‌న్నది మిస్టరీగా ఉందని కాంగ్రెస్ పేర్కొంది. అదానీ వ్య‌వ‌హారం, మ‌ణిపుర్‌, సంభ‌ల్ అల్ల‌ర్లు, ఢిల్లీలో శాంతిభ‌ద్ర‌త‌ల అంశాల‌పై స‌భ‌లో విప‌క్షాల ఆందోళ‌నల‌ను ప్ర‌భుత్వం ప్రోత్సహిస్తోందని జైరాం రమేశ్ అన్నారు. ఈ అంశాల్లో విమ‌ర్శ‌ల‌కు బాధ్య‌త వ‌హించాల‌న్న భావ‌న‌తో ప్ర‌భుత్వం డిఫెన్స్‌లో పడిందని విమర్శించారు.

Similar News

News November 27, 2025

నిజాంసాగర్ ప్రాజెక్టు ముంపు రైతులతో కవిత

image

కామారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గురువారం నాగిరెడ్డిపేట్ గ్రామంలో నిజాంసాగర్ ప్రాజెక్టు ముంపు రైతులతో సమావేశం అయ్యారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లు రెండేళ్ల కింద నోటికి ఏదీ వస్తే అది చెప్పి ఓట్లు వేయించుకున్నారని అన్నారు. ఇప్పుడు మాత్రం కనబడకుండా పోయారన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కనబడని పరిస్థితి ఉందన్నారు.

News November 27, 2025

7,948 MTS, హవల్దార్ పోస్టులు

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<>SSC<<>>) 7,948 MTS(నాన్ టెక్నికల్), హవల్దార్ ఖాళీల వివరాలను రీజియన్ల వారీగా ప్రకటించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్&కస్టమ్స్ (CBIC), సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్‌(CBN)లో ఈ పోస్టులు ఉన్నాయి. వీటిలో ఏపీలో 404, తెలంగాణలో169 పోస్టులు ఉన్నాయి. గతంలో 5,464 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. తాజాగా పోస్టులను జత చేసింది. త్వరలో పరీక్ష షెడ్యూల్‌ను ప్రకటించనుంది.

News November 27, 2025

రాజధాని రైతులతో చంద్రబాబు సమావేశం

image

AP: అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సమావేశం అయ్యారు. ఇందులో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్ అన్సారియా పాల్గొన్నారు. గ్రామ కంఠాలు, జరీబు, అసైన్డ్, లంక భూములు, వీధిపోటు సమస్యలు, రాజధాని గ్రామాల్లో వసతులు, ఉద్యోగాల కల్పనపై చర్చించారు.