News October 24, 2024
ఎన్డీయేలోని కీలక రాష్ట్రాలకు కేంద్రం రైల్వే కానుకలు

NDAలో కీలక భాగస్వాములైన ఏపీ, బిహార్లకు కేంద్రం ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేసింది. ఏపీలో ₹2,245 కోట్ల విలువైన 57 KM అమరావతి లైన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు బిహార్కు ₹4,553 కోట్ల విలువైన 2 రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ 2 రాష్ట్రాలకే రూ.6,798 కోట్ల విలువైన ప్రాజెక్టులు కేటాయించడం దేశవ్యాప్తంగా రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.
Similar News
News January 2, 2026
నువ్వుల పంటలో బిహారీ గొంగళి పురుగు – నివారణ

నువ్వుల పంట తొలిదశలో చిన్న గొంగళి పురుగులు ఆకు పత్రహరితాన్ని గోకి తినడం వల్ల ఆకులు జల్లెడలా మారతాయి. ఎదిగిన గొంగళి పురుగులు మొగ్గలకు, పువ్వులకు, కాయలకు రంధ్రాలు చేసి విత్తనాలను తింటాయి. వీటి నివారణకు ఎకరాకు 16- 20 పక్షి స్థావరాలను, హెక్టారుకు ఒక దీపపు ఎరను అమర్చాలి. తొలుత లీటరు నీటికి వేపనూనె 5mlను, తర్వాతి దశలో లీటరు నీటికి క్లోరిఫైరిపాస్ 2.5ml లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
News January 2, 2026
అధిక బరువుతో ముప్పు.. ఓసారి చెక్ చేసుకోండి!

ఆరోగ్యంగా ఉండాలంటే ఎత్తుకు తగిన బరువు ఉండటం తప్పనిసరి. దీనిని బాడీ మాస్ ఇండెక్స్ (BMI) ఆధారంగా లెక్కిస్తారు. 5 అడుగుల ఎత్తున్న పురుషులు 50-55kgs, మహిళలు 45-50kgs ఉండాలి. అదే 5.5ft ఎత్తున్న అబ్బాయిలు 60-65, అమ్మాయిలు 55-60 కిలోల బరువుండాలి. 6ft ఎత్తున్న మెన్స్ 75-82, ఉమెన్స్ 69-74 కిలోల మధ్య ఉండటం ఉత్తమం. అధిక బరువు గుండె జబ్బులు, మధుమేహానికి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. share it
News January 2, 2026
NZలో ఆవు మూత్రం.. 2 లీటర్లకు రూ.13వేలు

న్యూజిలాండ్ ఆక్లాండ్లోని Navafresh అనే ఇండియన్ స్టోర్లో ఆవు మూత్రం, పేడ అమ్ముతుండటంతో అక్కడి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఆవు మూత్రం 2 లీటర్లకు 253 డాలర్లు (రూ.13వేలు), ఆవు పేడ కేజీ 220 డాలర్లు (రూ.11వేలు), ఆవు పేడతో చేసిన బేబీ పౌడర్ 214-250 డాలర్లుగా ఉన్నట్లు ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. వీటిలో శక్తిమంతమైన యాంటీ బయోటిక్స్ ఉంటాయని, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని వాటిపై రాసినట్లుందని ఆమె పేర్కొన్నారు.


