News January 1, 2025

మన్మోహన్ మెమోరియల్ కోసం 2 ప్రాంతాలను ప్రతిపాదించిన కేంద్రం

image

మాజీ ప్రధాని, దివంగత మన్మోహన్ సింగ్ మెమోరియల్‌ ఏర్పాటుకు కేంద్రం సిద్ధమైంది. నిర్మాణం కోసం 2 ప్రాంతాలను ప్రతిపాదిస్తూ ఆయన కుటుంబానికి సమాచారం ఇచ్చింది. రాజ్ ఘాట్‌ సమీపంలోని రాష్ట్రీయ స్మృతిస్థల్, కిసాన్ ఘాట్ ప్రాంతాల్లో 1-1.5 ఎకరాల స్థలాలను కేంద్రం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వీటిలో ఒకదాన్ని మన్మోహన్ ఫ్యామిలీ సెలక్ట్ చేయాల్సి ఉంది. అనంతరం నిర్మాణ పనులను కేంద్రం ప్రారంభించనుంది.

Similar News

News November 20, 2025

ఢిల్లీ బ్లాస్ట్.. నలుగురు కీలక నిందితుల అరెస్ట్

image

ఢిల్లీ పేలుడు కేసులో మరో నలుగురు కీలక నిందితులను NIA అరెస్ట్ చేసింది. డా.ముజమ్మిల్ షకీల్(పుల్వామా), డా.అదీల్ అహ్మద్(అనంత్‌నాగ్), డా.షాహీన్ సయిద్(యూపీ), ముఫ్తీ ఇర్ఫాన్(J&K)ను పటియాలా కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకుంది. ఎర్రకోట పేలుడులో వీరు కీలకంగా వ్యవహరించినట్లు NIA గుర్తించింది. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఆరుకు చేరింది.

News November 20, 2025

త్వరలో రెస్టారెంట్లు, సొసైటీల్లో ఎంట్రీకి ఆధార్!

image

ఆధార్ విషయంలో త్వరలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెస్టారెంట్లలో లైవ్ ఈవెంట్‌కు వెళ్లాలన్నా, హౌసింగ్ సొసైటీల్లోకి ఎంట్రీ కావాలన్నా, ఏదైనా ఎగ్జామ్ రాయాలన్నా మీ గుర్తింపు కోసం ఆధార్ చూపించాల్సి రావొచ్చు. ఆఫ్‌లైన్ ఆధార్ వాడకాన్ని పెంచాలనే ఉద్దేశంతో UIDAI ఈ తరహా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వ్యక్తుల ప్రైవసీకి కూడా ఇది ఉపయోగపడుతుందని ఆ సంస్థ చెబుతోంది.

News November 20, 2025

TMC-HBCHలో ఉద్యోగాలు

image

విశాఖపట్నంలోని <>TMC<<>>-హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్& రీసెర్చ్ సెంటర్ 2 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి DMLT/ డిగ్రీ(MLT)/ బీఎస్సీ(హిమటాలజీ)/ ఎంఎస్సీ (ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవంగల వారు ఈనెల 24న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. వెబ్‌సైట్: https://tmc.gov.in/