News January 1, 2025
మన్మోహన్ మెమోరియల్ కోసం 2 ప్రాంతాలను ప్రతిపాదించిన కేంద్రం
మాజీ ప్రధాని, దివంగత మన్మోహన్ సింగ్ మెమోరియల్ ఏర్పాటుకు కేంద్రం సిద్ధమైంది. నిర్మాణం కోసం 2 ప్రాంతాలను ప్రతిపాదిస్తూ ఆయన కుటుంబానికి సమాచారం ఇచ్చింది. రాజ్ ఘాట్ సమీపంలోని రాష్ట్రీయ స్మృతిస్థల్, కిసాన్ ఘాట్ ప్రాంతాల్లో 1-1.5 ఎకరాల స్థలాలను కేంద్రం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వీటిలో ఒకదాన్ని మన్మోహన్ ఫ్యామిలీ సెలక్ట్ చేయాల్సి ఉంది. అనంతరం నిర్మాణ పనులను కేంద్రం ప్రారంభించనుంది.
Similar News
News January 20, 2025
భారత క్రికెటర్లకు బీసీసీఐ షాక్
భారత క్రికెటర్లు మ్యాచ్లకు హాజరయ్యే సమయంలో వ్యక్తిగత వాహనాలు ఏర్పాటు చేసుకోవద్దని ఆటగాళ్లకు బీసీసీఐ స్పష్టం చేసింది. జట్టు సభ్యులంతా టీమ్ బస్సులోనే రావాలని తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(CAB)తో పాటు ఇతర రాష్ట్రాలకు తెలియజేసింది. ఇంగ్లండ్తో తొలి టీ20 కోల్కతాలో జరగనున్న సంగతి తెలిసిందే. బీసీసీఐ ఆదేశాలను పాటిస్తామని CAB అధ్యక్షుడు స్నేహశిష్ గంగూలీ తెలిపారు.
News January 20, 2025
నేడు ట్రంప్ ప్రమాణ స్వీకారం
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత కాలమాన ప్రకారం రాత్రి 10:30 గంటలకు ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా వాషింగ్టన్ క్యాపిటల్ హాల్లోని రోటుండా ఇండోర్లో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారత ప్రభుత్వం నుండి విదేశాంగ మంత్రి జై శంకర్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
News January 20, 2025
జనవరి 20: చరిత్రలో ఈరోజు
1900: సంస్కృతాంధ్ర పండితుడు పరవస్తు వెంకట రంగాచార్యులు మరణం
1907: ప్రముఖ రంగస్థల నటుడు బందా కనకలింగేశ్వరరావు జననం
1920: సినీ దర్శకుడు, ‘జానపద బ్రహ్మ’ బి.విఠలాచార్య జననం
1940: సినీనటుడు ‘రెబల్ స్టార్’ కృష్ణంరాజు జననం
1957: భారత్ తొలి అణు రియాక్టర్ ‘అప్సర'(ముంబై) ప్రారంభం