News December 18, 2024

నేడు టీపీసీసీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్

image

TG: అమెరికాలో గౌతమ్ అదానీపై కేసు, మణిపుర్ అల్లర్లపై ప్రధాని మోదీ వైఖరిని నిరసిస్తూ TPCC ఇవాళ ఛలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో CM రేవంత్, Dy.CM భట్టితో సహా కాంగ్రెస్ MPలు, MLAలు పాల్గొంటారు. ఉ.11 గంటలకు నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా వెళ్లనున్నారు. మణిపుర్‌లో అల్లర్లు జరిగినప్పటి నుంచి ప్రధాని అక్కడ పర్యటించలేదని కాంగ్రెస్ విమర్శిస్తోంది.

Similar News

News December 8, 2025

గ్లోబల్ సమ్మిట్ PHOTO GALLERY

image

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తొలిరోజు ముగిసింది. ఇవాళ రూ.1.88లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. CM రేవంత్ అన్నీ తానై పర్యవేక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. తొలిరోజు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలను పైన చూడవచ్చు.

News December 8, 2025

హనుమాన్ చాలీసా భావం – 32

image

రామ రసాయన తుమ్హరే పాసా|
సదా రహో రఘుపతి కే దాసా||
ఓ ఆంజనేయా! నీ దగ్గర రామ నామం అనే శక్తిమంతమైన అమృతం ఉంది. ఈ శక్తి నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. అందుకే నువ్వు ఎల్లప్పుడూ రఘుపతికి నమ్మకమైన, గొప్ప దాసుడివిగా ఉండగలుగుతున్నావు. శ్రీరాముడిపై నీకున్న అనంతమైన భక్తికి, ఆ రామనామమే మూలం. ఆ రామనామ శక్తితోనే నీకు అన్నీ సాధ్యమయ్యాయి. ఆ శక్తులతోనే మమ్ము కాపాడు తండ్రీ! <<-se>>#HANUMANCHALISA<<>>

News December 8, 2025

చలి పంజా.. బయటికి రావద్దు!

image

TG: రాష్ట్రవ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. వచ్చే 2-3 రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు, ఎల్లుండి ADB, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, MDK, కామారెడ్డి జిల్లాల్లో శీతల గాలులు వీస్తాయంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం, రాత్రి వేళల్లో అవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించింది.