News June 17, 2024

సచివాలయంలో పవన్ కళ్యాణ్‌కు ఛాంబర్ కేటాయింపు

image

AP: సచివాలయంలో మంత్రి పవన్ కళ్యాణ్‌కు ఛాంబర్ కేటాయించారు. రెండో బ్లాక్ మొదటి అంతస్తులో 212 గదిని ఆయన కోసం రెడీ చేస్తున్నారు. జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్‌కు కూడా అదే అంతస్తులో ఛాంబర్లు కేటాయించారు. ఆయా ఛాంబర్లలో ఫర్నిచర్, ఇతర సామగ్రిని అధికారులు సమకూరుస్తున్నారు. కాగా ఎల్లుండి మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరిస్తారు.

Similar News

News October 17, 2025

తిరుమల: శ్రీవారి దర్శనానికి 12గంటల సమయం!

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 12గంటల వరకు సమయం పడుతోంది. అటు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 30 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు. నిన్న స్వామిని 61,521 మంది దర్శించుకోగా.. 25,101 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.66కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

News October 17, 2025

ఈశాన్య రుతుపవనాల ఎఫెక్ట్.. భారీ వర్షాలు

image

AP: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడించింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి 35-55KM వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

News October 17, 2025

జనగణన.. వచ్చేనెల ఇళ్ల లెక్కింపు

image

దేశంలో జనగణన కసరత్తు మొదలైంది. NOV 10-30 మధ్య అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎంపిక చేసిన ఏరియాల్లో హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సస్ చేపట్టనున్నారు. 2027లో జనగణన తొలిదశ జరగనుంది. దేశాభివృద్ధి, ప్రజల పరిస్థితులు తెలుసుకునేందుకు దీన్ని నిర్వహిస్తారు. ఈ గణాంకాల ఆధారంగానే ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలు రూపొందిస్తారు. దేశంలో 1872 నుంచి జనగణన చేస్తుండగా చివరిసారి 2011లో జరిగింది.