News December 19, 2024

హైబ్రిడ్ మోడల్‌లో ఛాంపియన్ ట్రోఫీ-2025

image

ఛాంపియన్స్ ట్రోఫీ-2025 హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని ICC నిర్ణయించింది. ఈ నిర్ణయంతో పాకిస్థాన్ నిర్వహించే టోర్నీ మ్యాచులను ఇండియా తటస్థ వేదికలో ఆడనుంది. అలాగే పాక్ కూడా ఇండియా నిర్వహించే టోర్నీ మ్యాచులన్నీ తటస్థ వేదికలో ఆడుతుంది. దీంతోపాటు 2024 నుంచి 2027 వరకు జరిగే అన్ని ICC ఈవెంట్స్ హైబ్రిడ్ మోడల్‌లో జరుగుతాయని ఐసీసీ వెల్లడించింది.

Similar News

News January 18, 2025

ఫ్రీ కోచింగ్.. ఫిబ్రవరి 15 నుంచి తరగతులు

image

TG: BC స్టడీ సర్కిళ్లలో RRB, SSC, బ్యాంకింగ్ తదితర రిక్రూట్‌మెంట్లకు ఫ్రీ కోచింగ్ తరగతులు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు JAN 20 నుంచి FEB 9 వరకు అప్లై చేసుకోవాలి. ఇంటర్, డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. FEB 12-14 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. అభ్యర్థుల తల్లిదండ్రుల ఆదాయం గ్రామాల్లో ₹2L, పట్టణాల్లో ₹1.50Lకు మించకూడదు.
వెబ్‌సైట్: https://tgbcstudycircle.cgg.gov.in/

News January 18, 2025

లవ్ యూ మిషెల్.. ఒబామా ట్వీట్

image

తన భార్య మిషెల్ ఒబామాతో విడాకులు తీసుకుంటున్నారని వస్తోన్న వార్తలకు అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా చెక్ పెట్టారు. ఆమె బర్త్ డే సందర్భంగా స్పెషల్ విషెస్ తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్ డే మై లవ్. మీరు నా జీవితంలో హాస్యం, ప్రేమ, దయతో నింపావు. నీతో కలిసి జీవితంలో ఎన్నో సాహసాలు చేయగలిగినందుకు నేను చాలా అదృష్టవంతుడిని. లవ్ యూ’ అని తెలిపారు.

News January 18, 2025

తిరుమలలో అపచారం

image

కలియుగ దైవం కొలువైన తిరుమల కొండపై అపచారం జరిగింది. తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు కొండపైకి కోడిగుడ్డు పలావ్ తీసుకొచ్చారు. రాంభగీచ బస్టాప్ వద్ద వారు ఈ నిషేధిత ఆహారపదార్థాలు తింటుండగా భక్తులు చూసి అధికారులకు ఫిర్యాదు చేశారు. తిరుమల నియమాలు తమకు తెలియదని వారు చెప్పారు. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. అలిపిరి వద్ద తనిఖీ సిబ్బంది డొల్లతనం వల్లే ఇలా జరిగిందని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.