News January 22, 2025

CHAMPIONS TROPHY: పాకిస్థాన్‌కు మరో షాక్?

image

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఓపెనింగ్ సెర్మనీ పాకిస్థాన్ ఆవల జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రెస్ కాన్ఫరెన్స్, కెప్టెన్ల ఫొటో షూట్‌ కోసం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్థాన్ వెళ్లడం లేదని సమాచారం. రోహిత్ కోసమే ఓపెనింగ్ సెర్మనీ వేదిక మారుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఫిబ్రవరి 19న టోర్నీ ప్రారంభం కావాల్సి ఉండగా స్టేడియాల మరమ్మతులు ఇంకా ఫినిష్ చేయలేక పాక్ కిందా మీదా పడుతోంది.

Similar News

News November 15, 2025

పోలీస్ స్టేషన్ పేలుడు వెనుక ఉగ్ర కుట్ర?

image

జమ్మూకశ్మీర్ నౌగామ్ <<18292633>>పోలీస్ స్టేషన్‌<<>>లో జరిగిన పేలుడుకు తామే కారణమంటూ జైషే మహ్మద్ అనుబంధ ఉగ్రవాద సంస్థ PAFF ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ పేలుడు వెనుక ఉగ్రకుట్ర కూడా ఉందన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బ్లాస్ట్ కేసు దర్యాప్తు చేస్తుండగానే ఈ పేలుడు సంభవించినట్లు J&K పోలీసులు ప్రకటించారు. కానీ, ఉగ్రకోణం అనుమానాలను కొట్టిపారేయకుండా ఆ దిశగానూ దర్యాప్తు ప్రారంభించారు.

News November 15, 2025

ప్రభాస్- డాన్స్ మాస్టర్‌ ప్రేమ్ రక్షిత్ కాంబోలో మూవీ?

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోతున్నారు. ఇప్పటికే ఆయన చేతిలో ఫౌజీ, స్పిరిట్, సలార్& కల్కి సీక్వెల్స్ ఉండగా మరో సినిమాకు ఆయన ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ డైరెక్టర్‌గా మారనున్నారని, ఆయన చెప్పిన కథను ప్రభాస్ ఓకే చేసినట్లు సినీవర్గాల సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా ప్రభాస్ ‘రాజాసాబ్’ వచ్చే Jan-9న విడుదలవనుంది.

News November 15, 2025

ఎగ్ షెల్ పేరెంటింగ్ గురించి తెలుసా?

image

పిల్లల్ని పెంచడంలో పేరెంట్స్ వివిధ రకాల పద్ధతులను ఎంచుకుంటారు. వాటిల్లో ఒకటే ఎగ్‌ షెల్‌ పేరెంటింగ్‌‌. ఇందులో తల్లిదండ్రులు పిల్లలను ఎక్కడికీ పంపకుండా తమ వద్దే ఉంచుకుంటారు. పిల్లలు బయటకు వెళ్లి అందరితో కలిస్తేనే నైపుణ్యాలు వస్తాయి. సమస్యల్ని, సవాళ్లని తమంతట తాము పరిష్కరించుకునేలా తయారవుతారు. అన్నిట్లో తల్లిదండ్రులపై ఆధారపడకూడదు. కాబట్టి ఇలాంటి విధానం పిల్లలకు మంచిది కాదంటున్నారు నిపుణులు.