News February 19, 2025

నేటి నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ

image

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ నేటి నుంచే మొదలుకానుంది. పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. టోర్నీలో మొత్తం 15 మ్యాచులు జరగనున్నాయి. గ్రూప్-ఏలో భారత్, బంగ్లా, న్యూజిలాండ్, పాక్ ఉండగా గ్రూప్-బిలో అఫ్గాన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఉన్నాయి. ఇరు గ్రూపుల్లోని తొలి రెండు జట్లు సెమీస్‌కు చేరతాయి. భారత్ తొలిమ్యాచ్ రేపు బంగ్లాతో ఆడనుంది.

Similar News

News March 19, 2025

నాకు రక్షణ కల్పించండి: వివేకా హత్య కేసు నిందితుడు

image

AP: వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ కడప SPని కలిసి తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఈ హత్య కేసులో నిందితులు జైల్లో నన్ను బెదిరించారు. నేను మాట్లాడే విషయాలు కొందరికి నచ్చట్లేదు. వైసీపీకి చెందిన కొందరు నన్ను బెదిరిస్తున్నారు. ‘హత్య’ సినిమాలో నన్ను క్రూరంగా చిత్రీకరించారు. ఆ మూవీలో నలుగురే చంపినట్లు చూపించారు. 8మందిని ఎందుకు చూపించలేదు?’’ అని ప్రశ్నించారు.

News March 19, 2025

రేవంత్‌పై నమోదైన కేసు కొట్టివేత

image

TG: గత ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును హైకోర్టు తాజాగా కొట్టివేసింది. 2020 మార్చిలో జన్వాడలో డ్రోన్ ఎగురవేశారని రేవంత్‌తో సహా పలువురిపై రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి పీఎస్‌లో కేసు నమోదైంది. అలాగే రేవంత్‌ను కించపరిచే విధంగా మాట్లాడారని సైఫాబాద్ పీఎస్‌లో కేటీఆర్‌పై నమోదైన కేసును కూడా హైకోర్టు కొట్టివేసింది.

News March 19, 2025

బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ

image

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో సమావేశమయ్యారు. వీరిద్దరు సుమారు 40 నిమిషాల పాటు పలు ఒప్పందాలపై చర్చించారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఉద్యోగాల కల్పనలో ఏఐ వినియోగంపై సమాలోచనలు జరిపారు. స్వర్ణాంధ్రప్రదేశ్-2047 విజన్ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం గేట్స్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం కలిసివస్తుందని CBN పేర్కొన్నారు.

error: Content is protected !!