News June 18, 2024
ఈ నెల 20 నుంచి 24 వరకు రీవెరిఫికేషన్కు ఛాన్స్

ఏపీ ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ <<13462523>>ఫలితాల్లో<<>> 59 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రీవెరిఫికేషన్కు ఈ నెల 20 నుంచి 24 వరకు అధికారులు అవకాశం కల్పించారు. మే 24 నుంచి జూన్ 1 వరకు జరిగిన సప్లిమెంటరీ పరీక్షలకు దాదాపు 1.40 లక్షల మంది విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే. కాగా ఫస్టియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను ఈ నెల 26న విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News December 23, 2025
జూన్ నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి: పార్థసారథి

AP: 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పార్థసారథి చెప్పారు. నిర్మాణంలో ఉన్న 5.5L ఇళ్లను వచ్చే జూన్-జులై నాటికి పూర్తి చేయాలని CM ఆదేశించారన్నారు. టిడ్కో గృహాలకుగాను కేంద్రంతో కలిసి SC, BC, మైనార్టీలకు ₹50K, STలకు ₹75K, పీజీటీడీఎస్ వర్గాలకు ₹లక్ష వరకు అదనపు సాయం అందిస్తున్నాం. అన్ని సమస్యలను పరిష్కరించి వచ్చే జూన్కు గృహాలను అందిస్తాం’ అని తెలిపారు.
News December 23, 2025
ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు.. క్లారిటీ

TG: ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దుపై కొంత గందరగోళం నెలకొంది. కొత్తగా ఏర్పడిన పంచాయతీలు, మండలాలు 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం ప్రత్యేక అకౌంట్ ఓపెన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం మెమో ఇచ్చింది. పంచాయతీ కార్యదర్శి/MPDO, సర్పంచ్/MPP డిజిటల్ సంతకాలతో పేమెంట్స్ జరుగుతాయని పేర్కొంది. అయితే అధికారుల, మీడియా గ్రూపుల్లో ఇది ఉపసర్పంచ్లకు చెక్ పవర్ రద్దుగా ప్రచారమైంది. వాస్తవానికి ఉపసర్పంచ్ చెక్ పవర్ తొలగించలేదు.
News December 23, 2025
చరిత్రలో బ్రహ్మోత్సవాల పరంపర ఏంటి..?

తిరుమల బ్రహ్మోత్సవాల చరిత్ర పురాతనమైనది. లోకకళ్యాణం కోసం బ్రహ్మ ఈ ఉత్సవాలను ప్రారంభించాడట. అందుకే వీటిని ‘బ్రహ్మోత్సవాలు’ అంటారు. చారిత్రకంగా పల్లవ, చోళ, విజయనగర చక్రవర్తులు ఈ వేడుకలను వైభవంగా నిర్వహించేవారు. ఒకప్పుడు భక్తుల రద్దీని బట్టి ఏటా 12 సార్లు కూడా బ్రహ్మోత్సవాలు జరిగేవని చెబుతారు. కాలక్రమేణా అవి తగ్గి, ప్రస్తుతం మనం చూస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలుగా స్థిరపడ్డాయి. <<-se>>#VINAROBHAGYAMU<<>>


