News August 21, 2025

ZPTC ఉపఎన్నికల విజేతలను అభినందించిన చంద్రబాబు

image

AP: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో విజయం సాధించిన లతారెడ్డి, కృష్ణారెడ్డిని సీఎం చంద్రబాబు అభినందించారు. ఉండవల్లిలోని నివాసంలో ఉమ్మడి కడప జిల్లా నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశం అయ్యారు. నేతలంతా కలిసి పనిచేసి, కార్యకర్తలను సమన్వయం చేసుకుని గెలిపించారని చంద్రబాబు ప్రశంసించారు. ఇది ప్రజాస్వామ్య విజయమన్నారు. ఇదే స్ఫూర్తి కొనసాగించాలని పిలుపునిచ్చారు.

Similar News

News April 3, 2026

CBSE కొత్త కరిక్యులం.. 3 భాషలు చదవాల్సిందే

image

వచ్చే అకడమిక్ ఇయర్(2026-27) నుంచి అమలు చేసే పాఠ్య ప్రణాళికను CBSE రిలీజ్ చేసింది. ఆరో తరగతి నుంచి త్రీ లాంగ్వేజ్ ఫార్ములా(3 భాషలు చదవడం)ను తప్పనిసరి చేసింది. ఇందులో 2 భారతీయ భాషలు ఉండాలి. ఇంగ్లిష్‌ను ఫారిన్ లాంగ్వేజ్‌గా పరిగణిస్తారు. అలాగే మాథ్స్, సైన్స్‌లో టూ లెవెల్ సిస్టమ్ రానుంది. ఇందులో భాగంగా 80మార్కుల కామన్ ఎగ్జామ్ రాయడం తప్పనిసరి. మరో 25Mకు అడ్వాన్స్‌డ్ లెవెల్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఆప్షనల్.

News April 3, 2026

LokPoll సర్వే.. కేరళంలో కాంగ్రెస్‌దే అధికారం!

image

కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని UDFదే అధికారమని <<19539543>>LokPoll<<>> సర్వే అంచనా వేసింది. ఆ కూటమికి 42-44% ఓట్లు, 77-81 సీట్లు వస్తాయని తెలిపింది. సీఎం విజయన్ సారథ్యంలోని LDFకు 39-41% ఓట్లు, 58-62 సీట్లు రావొచ్చని వెల్లడించింది. NDA 14-16% ఓట్లు, 1-2 సీట్లతో మూడో స్థానానికి పరిమితమవ్వొచ్చని పేర్కొంది. కేరళంలో 140 స్థానాలకు ఈ నెల 9న పోలింగ్ జరగనుంది.
<<-se>>#ELECTIONS2026<<>>

News April 3, 2026

భూ భారతి: రిజిస్ట్రేషన్ అయ్యాక మళ్లీ నో ఛేంజ్

image

TG: ‘భూ భారతి’లో GOVT కొత్త రూల్ పెడుతోంది. భూ యజమాని ముందు ఇంటిగ్రేటెడ్‌ పోర్టల్లో భూ సర్వేకు దరఖాస్తు చేస్తే సరిహద్దు రైతులకు సర్వేయర్లు నోటీసులిస్తారు. వారి సమక్షంలో సర్వే చేసి తహసీల్దార్లకు రిపోర్టు ఇస్తారు. రెవెన్యూశాఖ ఇచ్చే సర్వేపటంతో భూ భారతి పోర్టల్లో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌కు రైతు దరఖాస్తు చేసుకోవాలి. సర్వేలో తేలిన విస్తీర్ణానికే రిజిస్ట్రేషన్‌ చేస్తారు. తరువాత మార్పునకు అవకాశం ఉండదు.