News May 13, 2024
మోదీ నామినేషన్కు చంద్రబాబు

AP: ప్రధాని మోదీ వారణాసి లోక్సభ స్థానం నుంచి రేపు నామినేషన్ వేయనున్న నేపథ్యంలో 12 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ప్రధాని ఆహ్వానించారు. ఏపీలో ఎన్డీయే భాగస్వామిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి కూడా ఆహ్వానం అందింది. ఈక్రమంలో ఎల్లుండి ప్రత్యేక విమానంలో ఆయన వారణాసి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఎన్డీయే మిత్రపక్షాల సభలో పాల్గొని ఆయన ప్రసంగిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి.
Similar News
News February 17, 2026
పిల్లల్ని కనేముందు కౌన్సిలింగ్ అవసరం

పెళ్లి తర్వాత పిల్లల ప్లానింగ్కు ముందు భార్యాభర్తలు కౌన్సెలింగ్ తీసుకోవడం ద్వారా అనవసర భయాలు తొలగిపోతాయంటున్నారు నిపుణులు. మధుమేహం, థైరాయిడ్, అధిక రక్తపోటు లాంటి సమస్యలుంటే ముందే గుర్తించి చికిత్స తీసుకోవాలి. సహజంగా గర్భం దాల్చలేకపోతే దంపతులిద్దరూ వైద్యులను సంప్రదించాలి. అలాగే కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ, పేరెంటింగ్పై అవగాహన పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
News February 17, 2026
డబ్బులే డబ్బుల్.. దేశంలో భారీగా క్యాష్ ట్రాన్సాక్షన్స్

దేశంలో డిజిటల్ పేమెంట్స్ జోరు కొనసాగుతున్నా ఇంకా నగదు చలామణి భారీగా ఉందని SBI లేటెస్ట్ రిపోర్ట్ తెలిపింది. JANలో రూ.40లక్షల కోట్లు చేతులు మారినట్లు పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఇది 11.1% ఎక్కువ. నగదు చలామణిలో 97.6% ప్రజల వద్దే నోట్ల రూపంలో ఉంది. నెలకు రూ.40లక్షల కంటే ఎక్కువ UPI లావాదేవీలు జరిపితే GST నోటీసులు, ఇన్కమ్ ట్యాక్స్ భయాలతో నగదు బదిలీ పెరిగినట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
News February 17, 2026
300కు 300 మార్కులు

JEE <<19159273>>మెయిన్లో<<>> AP జమ్మలమడుగుకు చెందిన పసల మోహిత్ 100 పర్సంటైల్తో 300కు 300 మార్కులు సాధించారు. రోజుకు 4 గంటలే చదివానని, ర్యాంకుల కోసం ఒత్తిడి లేకపోవడంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. విజయవాడలో ఇంటర్ చదివిన అతడు IIT బాంబేలో కంప్యూటర్ సైన్స్ చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. మోహిత్ తండ్రి కిరణ్ కుమార్ ప్రొద్దుటూరులో వైద్యుడిగా పనిచేస్తుండగా, తల్లి సబిత జమ్మలమడుగులోని ప్రభుత్వ ఆసుపత్రిలో డెంటిస్ట్.


