News September 16, 2024
నేడు గుజరాత్కు సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఇవాళ గుజరాత్ రాజధాని గాంధీనగర్లో పర్యటించనున్నారు.‘రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్-2024’లో పాల్గొని ప్రసంగిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, మానవ వనరుల గురించి జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించనున్నారు. ఈ సదస్సును PM మోదీ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా PMతో CBN సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వరద నష్టాన్ని ఆయనకు వివరిస్తారని సమాచారం.
Similar News
News December 1, 2025
యువతకు ‘గీత’ చెప్పిన కర్మ సిద్ధాంతం ఇదే!

నేటి యువతరం భగవద్గీత నుంచి కర్మ సిద్ధాంతాన్ని నేర్చుకోవాలి. లక్ష్యంపై దృష్టి పెట్టి, ఫలితంపై ఆందోళన చెందకుండా తమ పనిని నిస్వార్థంగా చేయాలని గీత బోధిస్తుంది. మంచి జరిగినా, చెడు జరిగినా రెండింటినీ జీవితంలో భాగమే అనుకొని, ఏకాగ్రతతో నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం, సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించాలి. ఈ ఆత్మవిశ్వాసం, నిలకడ నేటి పోటీ ప్రపంచంలో విజయానికి కీలకం. SHARE IT
News December 1, 2025
తెలంగాణ అప్డేట్స్

*రైతు భరోసా ఇవ్వకుండా కౌలు రైతులను ప్రభుత్వం మోసగించిందని BRS నేత హరీశ్ విమర్శించారు.
* టెట్ దరఖాస్తులలో వివరాల సవరణ గడువు నేటితో ముగియనుంది. పేరు, ఆధార్, ఫోన్ నంబర్, అర్హతలు, సెంటర్లు మార్పు చేసుకోవచ్చు.
* కరెంటు సహా ఇతర బిల్లుల ఆధారంగా ‘ఆల్టర్నేటివ్ క్రెడిట్ స్కోరు’ ఇచ్చేందుకు ‘తెలంగాణ ఇన్ఫర్మేషన్ బ్యూరో (TIB)’ను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ స్కోరుతో బ్యాంకులు SHG సభ్యులకు లోన్లు ఇస్తాయి.
News December 1, 2025
హైదరాబాద్లో 45 పోస్టులకు నోటిఫికేషన్

HYD సనత్నగర్లోని <


