News December 22, 2024

భద్రతను కుదించుకున్న చంద్రబాబు

image

AP: CM చంద్రబాబు తన భద్రతను కుదించుకున్నారు. సిబ్బంది స్థానంలో టెక్నాలజీని వినియోగించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఉండవల్లిలోని CM నివాసంలో సిబ్బందికి బదులు డ్రోన్‌తో పహారా కాయనున్నారు. ఇది కొత్తగా, అనుమానాస్పదంగా ఏది కనిపించినా వెంటనే మానిటరింగ్ టీమ్‌కు సమాచారం చేరవేస్తుంది. దానికి కేటాయించిన డక్‌పై అదే ఛార్జింగ్ పెట్టుకుంటుంది. చంద్రబాబుకు ప్రస్తుతం 121 మంది భద్రత కల్పిస్తున్నట్లు సమాచారం.

Similar News

News January 15, 2025

బంగ్లాదేశ్‌లో కంగనా ‘ఎమర్జెన్సీ’ బ్యాన్!

image

కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా విడుదలను బంగ్లాదేశ్‌లో బ్యాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల సరిహద్దు విషయంపై భారత్, బంగ్లా మధ్య వివాదం చెలరేగింది. ఈక్రమంలోనే ఎమర్జెన్సీపై అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించినట్లు సమాచారం. ఇంతకుముందు పుష్ప-2, భూల్ భులయ్యా-3 సినిమాలను కూడా బంగ్లా ప్రభుత్వం నిషేధించింది. కాగా ఈనెల 17న ఎమర్జెన్సీ విడుదల కానుంది.

News January 15, 2025

యూపీలో తెలంగాణ బస్సుకు అగ్నిప్రమాదం

image

ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లో 50 మంది TGలోని భైంసా ప్రయాణికులతో వెళ్తున్న బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో పల్సికి చెందిన ప్రయాణికుడు మరణించాడు. మిగతావారు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదంలో బస్సుతో పాటు ప్రయాణికుల సామాగ్రి దగ్ధమైంది. వీరంతా కాశీకి వెళ్తున్నట్లు సమాచారం. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.

News January 15, 2025

రేపు కనుమ.. ప్రత్యేకతలు ఇవే!

image

3 రోజుల సంక్రాంతి వేడుకల్లో రేపు కీలకమైన కనుమ. వ్యవసాయంలో చేదోడువాదోడుగా ఉండే పశువులను ఈ రోజున అలంకరించి పూజించడం ఆనవాయితీ. ఏడాదంతా శ్రమించే వాటికి రైతులు ఇచ్చే గౌరవం ఇది. అలాగే కనుమనాడు మినప వడలు, నాటుకోడి పులుసుతో భోజనం తప్పనిసరి. కనుమ రోజు కాకులు కూడా కదలవని నానుడి. అందుకే పండక్కి వచ్చిన వారు రేపు తిరుగు ప్రయాణం చేయకూడదంటారు. 3 రోజులు పండుగను ఆస్వాదించిన తర్వాతే తిరిగెళ్లాలనేది సంప్రదాయం.