News November 2, 2024
చిన్నారి హత్యాచారం ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి

AP: తిరుపతి జిల్లాలో చిన్నారిపై <<14509648>>హత్యాచారం<<>> ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. హోంమంత్రి అనిత రేపు బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
Similar News
News February 14, 2026
రికార్డ్: T20 WC 2026లో భారీ స్కోర్

కొలంబో: T20 WCలో ఒమన్తో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 235-5 స్కోర్ చేసింది. ఈ ఎడిషన్లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్కోర్ ఇదే. 13 సిక్సర్లు, 21 ఫోర్లు నమోదవడం విశేషం. ఐర్లాండ్ బ్యాటర్లలో లోర్కాన్ టకర్ (51 బంతుల్లో 94*) , గారెత్ డెలానీ (56), డాక్రెల్ (9 బంతుల్లో 35)* రాణించారు. నదీమ్ వేసిన 18వ ఓవర్లో టకర్ 26 రన్స్ (6, 4, 4, 6, 0, 6) బాదారు. ఒమన్ టార్గెట్ 236 రన్స్.
News February 14, 2026
2026-27 బడ్జెట్: వ్యవసాయం, నీరు పారుదలకు కేటాయింపులు

AP: అన్నదాత సుఖీభవ పథకానికి రాష్ట్ర బడ్జెట్లో రూ.6,600 కోట్లను కేటాయించారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు రూ.1,927 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ.500 కోట్లు, పంటల బీమాకు రూ.250 కోట్లు, PM కృషి సించాయీ యోజనకు రూ.190 కోట్లు, మత్స్యకార సేవలో కోసం రూ.260 కోట్లు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు రూ.9,906 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.6,105 కోట్లను కేటాయిస్తున్నట్లు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.
News February 14, 2026
అప్పు తీర్చడానికి మళ్లీ అప్పు: పయ్యావుల

AP: పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేయాల్సి వస్తోందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ‘గత ప్రభుత్వంలో రాష్ట్రం ₹9.74లక్షల కోట్ల అప్పుతో ఆర్థికంగా విధ్వంసమైంది. మేము చేస్తున్న అప్పు ఉత్పాదకతకు ఖర్చు చేస్తున్నాం. ఆర్థిక సంక్షోభం నుంచి ఇంకా బయటపడలేదు. పరిస్థితులు సానుకూలంగా లేవు. అనేక సవాళ్లు ఉన్నా అభివృద్ధి సంక్షేమంపై మా లక్ష్యాల్లో మార్పు లేదు’ అని వివరించారు.


