News September 17, 2024
చంద్రబాబు ఇంటిని ముందుగా కూలగొట్టాలి: ఎంపీ విజయసాయి

CM చంద్రబాబు అబద్ధాల రాజ్యానికి చక్రవర్తి అని YCP MP విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘సిగ్గు విడిచిన వ్యక్తికి తన తప్పు కనపడదనే నానుడి ఉంది. పాలకులకు ఒక న్యాయం పౌరులకు ఇంకొక న్యాయం ఉండదు. చట్టం ముందు అందరూ సమానులే. కృష్ణానది ఒడ్డుపై కట్టిన అక్రమ కట్టడంలో నివసిస్తున్న ఆయనకు బుడమేరు రివలెట్పై ఇళ్లను కూలగొట్టే నైతిక అధికారం ఎక్కడుంటుంది! అందుకే ముందుగా ఆయన నివాసాన్ని కూలగొట్టాలి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News December 23, 2025
మెస్సీ సోదరికి యాక్సిడెంట్.. తీవ్ర గాయాలు

అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ మెస్సీ సోదరి మారియా సోల్ మియామిలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి గోడను ఢీకొట్టింది. దీంతో ఆమె శరీరంలో కొంతభాగం కాలిపోవడంతో పాటు వెన్నెముక, మడమ, మణికట్టు వద్ద ఫ్రాక్చర్ అయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. జనవరి 3న జరగాల్సిన ఆమె పెళ్లి కూడా వాయిదా పడింది. మెస్సీ ఇటీవల భారత్లో పర్యటించిన సంగతి తెలిసిందే.
News December 23, 2025
డిస్కౌంట్లో చేనేత వస్త్రాల అమ్మకాలు: సవిత

AP: ఈనెల 26నుంచి తిరుపతిలో చేనేత ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుందని మంత్రి సవిత తెలిపారు. ’60, 50, 40 శాతాల్లో చేనేత వస్త్రాలపై డిస్కౌంట్లు ఉన్నాయి. గుంటూరు, మంగళగిరిలోని యర్రబాలెంలో 60% డిస్కౌంట్తో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశాం. VJAలోని ఆప్కో మెగా షో రూమ్లో 50%, మిగిలిన అన్ని షో రూముల్లో 40% డిస్కౌంట్లు ఉన్నాయి. 2 రోజుల్లోగా సహకారసంఘాల నుంచి చేనేత వస్త్రాల కొనుగోళ్లు ప్రారంభమవుతాయి’ అని తెలిపారు.
News December 23, 2025
భాకరాపురంలో జగన్ ప్రజాదర్బార్

AP: వైసీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి జగన్ పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు, స్థానికులు పెద్దఎత్తున పాల్గొన్నారు. జగన్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రేపు ఉదయం ఇడుపులపాయలో ఆయన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు.


