News July 3, 2024
చంద్రబాబు కీలక నిర్ణయం

AP: శాఖలపై గతంలో గంటల పాటు సమీక్షలు నిర్వహించే CM చంద్రబాబు రూట్ మార్చారు. ఏ శాఖతో రివ్యూ అయినా 30 నిమిషాల్లోనే ముగించాలని ఉన్నతాధికారులకు సూచించారట. ఇసుక, రహదారులు, నిత్యావసరాలపై నిన్న సమీక్షించిన CM.. ఒక్కో శాఖకు 30 నిమిషాలే కేటాయించారు. అధికారులు ఏం చెప్పాలనుకున్నా 20 నిమిషాల్లోనే ముగించమని ఆదేశించారట. కందిపప్పుల ధరలు పెరగడాన్ని CM దృష్టికి తీసుకెళ్లగా, కేంద్రంతో మాట్లాడుతామని బదులిచ్చారు.
Similar News
News December 30, 2025
అలా సందుల్లో దూరడం విజ్ఞత అనిపించుకోదు.. సజ్జనార్ స్వీట్ వార్నింగ్

TG: న్యూ ఇయర్ వేడుకల వేళ యువతకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. చౌరస్తాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయనే భయంతో సందుల్లో దూరి, ప్రమాదకరంగా వాహనాలు నడపడం విజ్ఞత అనిపించుకోదని స్పష్టం చేశారు. మద్యం మత్తులో వాహనం నడపడం మృత్యువును ఆహ్వానించడమేనని, ఒకవేళ యముడు వదిలేసినా చట్టం వదలదన్నారు. ‘మీ ప్రాణం విలువ మాకు తెలుసు. కాబట్టే ఈ హెచ్చరిక’ అని ట్వీట్ చేశారు.
News December 30, 2025
సమయం పెంపు.. రెండు రోజులు కిక్కే కిక్కు

AP: న్యూఇయర్ సందర్భంగా మద్యం అమ్మకాల పని వేళలను ఎక్సైజ్ శాఖ పొడిగించింది. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు అమ్ముకునేందుకు మద్యం షాపులకు పర్మిషన్ ఇచ్చింది. బార్లు, ఇన్-హౌస్, ఈవెంట్లకు పర్మిట్ లైసెన్సులు ఉన్న వారికి రాత్రి ఒంటిగంట వరకు అనుమతి ఇచ్చింది. మరోవైపు రాష్ట్రంలోకి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, నాటు సారా రాకుండా అధికారిక పనివేళలు పెంచినట్లు తెలిపింది.
News December 30, 2025
జర్మన్ పౌరుడికి ఎలా పెన్షన్ ఇస్తాం: ఆది శ్రీనివాస్

TG: వేములవాడ మాజీ ఎమ్మెల్యేగా చెన్నమనేని రమేశ్ పెన్షన్ పొందడంపై MLA ఆది శ్రీనివాస్ అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. రమేష్ జర్మన్ పౌరుడు అని కేంద్ర హోంశాఖ ధ్రువీకరించగా, తప్పుడు పత్రాలతో గెలిచినందుకు హైకోర్టు ఆయనకు రూ.30 లక్షల ఫైన్ విధించిందని ఫిర్యాదులో తెలిపారు. అయినా మాజీ ఎమ్మెల్యేగా ప్రతి నెలా రూ.50వేలు పెన్షన్ అకౌంట్లో జమ అవుతోందన్నారు. అయితే ఈ అంశంపై సెక్రటరీకి నిర్ణయాధికారం లేదు.


