News April 11, 2024

ఆ నియోజకవర్గాల్లో YCP అభ్యర్థుల మార్పు?

image

AP: రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో YCP తమ అభ్యర్థులను మారుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మైలవరం-జోగి రమేశ్, విజయవాడ వెస్ట్-పోతిన మహేశ్, గుంటూరు2- కిలారు రోశయ్య, గుంటూరు ఎంపీ-విడదల రజినీ, కర్నూలు ఎంపీ-KE ప్రభాకర్, పి.గన్నవరం-పాముల రాజేశ్వరి, అవనిగడ్డ-సింహాద్రి చంద్రశేఖర్, చిలకలూరిపేట-మర్రి రాజశేఖర్, రాయచోటి-రెడ్డప్పగారి రమేశ్ రెడ్డికి సీట్లు కేటాయిస్తున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Similar News

News April 10, 2026

ఫిట్‌గా ఉంటే హెల్తీగా ఉన్నట్లేనా?

image

చాలామంది ఫిట్‌గా ఉంటే హెల్తీగా ఉన్నట్లే అనుకుంటారు. కానీ రెండూ వేరు. హెల్త్ మన శరీరం లోపల అవయవాలు ఎలా పనిచేస్తున్నాయనే దానిపై ఆధారపడి ఉంటుంది. మంచి నిద్ర, బ్యాలెన్స్‌డ్ ఫుడ్, తక్కువ స్ట్రెస్ ఉంటే హెల్తీగా ఉన్నట్లు లెక్క. మరోవైపు ఫిట్‌నెస్ అంటే శారీరక సామర్థ్యం. బరువులు ఎత్తడం, వేగంగా పరుగెత్తడం వంటివి ఫిట్‌నెస్‌ను సూచిస్తాయి. ఒక బాడీబిల్డర్ చూడటానికి చాలా ఫిట్‌గా ఉన్నా లోపల హెల్తీగా లేకపోవచ్చు.

News April 10, 2026

జాబ్ ఆఫర్ చేసిన MNC.. షాక్ ఇచ్చిన అభ్యర్థి

image

జాబ్ ఆఫర్ చేసిన కంపెనీకే షాక్ ఇచ్చాడు కన్సల్టెంటుగా పనిచేసిన ఓ అభ్యర్థి. ‘ఓ MNCలో అన్నీ అధ్వానంగా ఉంటాయి. నా CVకి సరిపోయే జాబ్ ఉందని ఆ కంపెనీ నుంచి కాల్ వచ్చింది. కానీ వాళ్ల సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టానని, అందులో పని చేయనని చెప్పేశా. ఇవి పిల్ల చేష్టలని అనుకోవచ్చు. కానీ అదెంతో అద్భుతంగా, సంతృప్తిగా అనిపించింది. మళ్లీ సంప్రదిస్తే CEO ఏడ్చేలా ఈ-మెయిల్ పంపుతా’ అని రెడిట్‌లో రాసుకొచ్చారు.

News April 10, 2026

యుద్ధం.. శాంతి చర్చలకు పాక్ బయల్దేరిన జేడీ వాన్స్

image

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్‌తో శాంతి చర్చల్లో పాల్గొనేందుకు కాసేపటి క్రితమే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాకిస్థాన్‌కు బయల్దేరారు. ఇస్లామాబాద్‌లోని సెరెనా హోటల్‌లో అమెరికా-ఇరాన్ ప్రతినిధులు భేటీ కానున్నారు. చర్చల ఫలితాలపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. చర్చల నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో 2 రోజులు లాక్‌డౌన్ విధించారు.