News March 30, 2024
ఢిల్లీ జల్ బోర్డు కేసులో ఛార్జిషీట్ దాఖలు

ఢిల్లీ జల్ బోర్డు మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ED ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఫ్లో మీటర్ల కొనుగోళ్ల టెండర్లలో అవినీతి జరిగినట్లు ఆరోపించింది. DJB మాజీ చీఫ్ ఇంజినీర్ జగదీశ్ అరోరా, కాంట్రాక్టర్ అనిల్ అగర్వాల్, NBCC మాజీ GM మిట్టల్, తేజిందర్ సింగ్ అనే నలుగురితో పాటు NKG ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే కంపెనీని నిందితులుగా చేర్చింది. ఈ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్కు ED సమన్లు పంపిన సంగతి తెలిసిందే.
Similar News
News February 9, 2026
క్లీనింగ్ టిప్స్..

* వంటింటి అరల్లో బేకింగ్ సోడాని నీళ్ళలో కలిపి సీసాలో వేసి మూలల్లో స్ప్రే చేస్తే దుర్వాసనల సమస్య తగ్గుతుంది. * బాత్రూం షవర్ రంధ్రాలు మూసుకుపోతే… దానిని వైట్ వెనిగర్తో శుభ్రం చేయాలి. * ఫర్నిచర్కు చెదలు పట్టకుండా ఉండాలంటే… కర్పూరం పొడి, లిక్విడ్ పారాఫిన్ సమపాళ్ళలో కలిపి వాటిని తుడిస్తే సమస్య తగ్గుతుంది. * ఫ్రిజ్ లోపల దుర్వాసన వస్తోంటే వంటసోడాలో కాసిని నీళ్ళు కలిపి తుడిస్తే సరిపోతుంది.
News February 9, 2026
ముంబై పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

<
News February 9, 2026
కోడి మాంసం, గుడ్లు తినొచ్చు: మంత్రి అచ్చెన్నాయుడు

AP: బర్డ్ ఫ్లూను పూర్తిగా నియంత్రణలోకి తీసుకొస్తున్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అన్నమయ్య(D) సదుం(M)లో వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. కోళ్ల పెంపకందారులు బయోసెక్యూరిటీ చర్యలు పాటించాలని ఆదేశించారు. కోడి మాంసం, గుడ్ల వినియోగం పూర్తిగా సురక్షితమని చెప్పారు. అసాధారణ రీతిలో పక్షులు మరణిస్తే అధికారులకు తెలియజేయాలన్నారు.


