News February 27, 2025
ఎండోమెంట్ పరిధిలోకి చార్మినార్ ‘భాగ్యలక్ష్మీ’ అమ్మవారి ఆలయం

హైదరాబాద్లోని చార్మినార్ను ఆనుకొని ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి టెంపుల్ను ఎండోమెంట్ పరిధిలోకి తెస్తూ ట్రిబ్యునల్ కీలక తీర్పు ఇచ్చింది. ఆలయానికి తక్షణమే ఈవోను నియమించాలని దేవాదాయశాఖ కమిషనర్ను ఆదేశించింది. యూపీకి చెందిన రాజ్మోహన్ దాస్ టెంపుల్పై ఆజమాయిషీ చెలయిస్తున్నాడంటూ ఓ మహిళ కోర్టుకెక్కింది. ఆ వివాదం నడుస్తుండగానే ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఆలయాన్ని దేవదాయ పరిధిలోకి తెస్తూ తీర్పునిచ్చింది.
Similar News
News March 19, 2025
భయపడుతున్న ఇన్ఫ్లుయెన్సర్లు

బెట్టింగ్ యాప్ ప్రచారం ఇన్ఫ్లుయెన్సర్ల పాలిట శాపంగా మారింది. అత్యాశకు పోతే అసలుకే ఎసరు తెచ్చిపెట్టింది. ప్రమోషన్స్ చేసిన వారికి పోలీసులు నోటీసులు జారీ చేస్తుండటంతో ఏం చేయాలో తెలియక వారంతా తలలు పట్టుకుంటున్నారు. తమకు వచ్చిన ఫేమ్ అంతా ఒక్కసారిగా నాశనం అవుతుండటం వారి ఆందోళనలను రెట్టింపు చేస్తోంది. దీనికి తాజాగా ఈడీ కూడా తోడవ్వడంతో తమ పరిస్థితి ఏమవుతుందో అని కొందరు భయపడుతున్నారు.
News March 19, 2025
ఘోరం.. భర్తను ముక్కలుగా నరికిన భార్య

యూపీ మీరట్లో ఓ మహిళ తన భర్తను దారుణంగా చంపింది. లండన్లో మర్చంట్ నేవీ ఆఫీసర్ అయిన సౌరభ్.. తన భార్య ముస్కాన్ బర్త్ డే కోసం ఫిబ్రవరి 24న ఇండియాకు వచ్చాడు. ప్రియుడు మోహిత్తో సంబంధాలు కొనసాగిస్తున్న ముస్కాన్.. సౌరభ్ను చంపాలని ప్లాన్ చేసింది. అతడు రాగానే చంపి, ముక్కలుగా నరికి పెద్ద డ్రమ్ములో వేసి సిమెంట్తో కప్పారు. తాజాగా అతడి శరీర భాగాలు బయటపడ్డాయి. నిందితులు అరెస్ట్ అయ్యారు.
News March 19, 2025
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన జట్లు

*1681- ముంబై ఇండియన్స్
*1649- ఆర్సీబీ
*1513- పంజాబ్ కింగ్స్
*1508- చెన్నై సూపర్ కింగ్స్
*1492- కేకేఆర్
*1348- ఢిల్లీ క్యాపిటల్స్
*1235- రాజస్థాన్
*1038- సన్రైజర్స్ హైదరాబాద్ *400- డెక్కన్ ఛార్జర్స్
*332- లక్నో *270- గుజరాత్ టైటాన్స్