News April 25, 2024
WAY2NEWS యాప్లో ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉ.11 గంటలకు నాంపల్లిలో విద్యాశాఖ కార్యదర్శి రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. అందరికంటే ముందుగా, వేగంగా WAY2NEWS యాప్లో మీ ఫలితాలు తెలుసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే ఉండే స్క్రీన్లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే క్షణాల్లో ఫలితం వస్తుంది. అంతే సులువుగా ఒక్క క్లిక్తో దీన్ని షేర్ చేయొచ్చు.
#Be Ready
Similar News
News January 22, 2025
BRSకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
TG: బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో భారీ ఊరట లభించింది. బీఆర్ఎస్ నల్లగొండ దీక్షకు కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ నెల 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలలోగా సభ నిర్వహించుకోవాలని సూచించింది. కాగా ఈ నెల 21న నల్లగొండలో దీక్ష చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. కానీ స్థానిక పోలీసులు ఈ సభకు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.
News January 22, 2025
ఎలా ఆడాలో రోహిత్కు చెప్పక్కర్లేదు: రహానే
రోహిత్ శర్మ పదేళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో ఆడబోతున్నారు. రేపు J&Kతో మ్యాచ్లో ముంబై తరఫున బరిలోకి దిగనున్నారు. ఈ సందర్భంగా ముంబై కెప్టెన్ రహానే మాట్లాడుతూ ‘రోహిత్ ఏంటో అందరికీ తెలుసు. నేషనల్, ఇంటర్నేషనల్ ఏ మ్యాచ్ ఆడినా ఒకేలా ఉంటాడు. ఆట గురించి అతనికి బాగా తెలుసు. ఏం చేయాలో ఇతరులు చెప్పాల్సిన అవసరం లేదు. అతడిచ్చే ఇన్ పుట్స్ మాకు చాలా ముఖ్యం. రోహిత్ తిరిగి ఫామ్లోకి వస్తాడనే నమ్మకముంది’ అని చెప్పారు.
News January 22, 2025
ఆయుష్మాన్ భారత్కు ‘ఆప్’ద అడ్డంకులు: మోదీ
ఆమ్ఆద్మీ వంచన, అబద్ధాలకు శీశ్మహలే పెద్ద ఉదాహరణ అని PM మోదీ అన్నారు. ఢిల్లీ BJP కార్యకర్తలతో మాట్లాడారు. ‘ఉచిత వైద్యం అందించే ఆయుష్మాన్ భారత్ను అమలు చేయాలని ‘ఆప్’ద మనుషుల్ని కోరాం. కానీ వాళ్లు ఒప్పుకోలేదు. ఎన్నో ప్రయోజనాలున్న ఈ స్కీమ్ అమలుకు ఆప్ద అడ్డంకులు సృష్టించింది. భారత ఎకానమీకి మిడిల్క్లాసే వెన్నెముకని బీజేపీ భావిస్తుంది. వారి ఆశలు, ఆశయాలను మనం అర్థం చేసుకున్నాం’ అని అన్నారు.