News March 21, 2024
ఛీ.. ఛీ.. అసలు ఈమె తల్లేనా?

TS: మంచిర్యాల జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. ఓ తల్లి 8 నెలల పసికందును చేనులో వదిలేసింది. నిన్న రాత్రి చేనులో వదిలేసి వెళ్లడంతో వీధి కుక్కలు ఆ పసిపాపపై దాడి చేసి, చంపేశాయి. శరీర భాగాలను పీక్కుతిన్నాయి. తల్లి గంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భీమిని మండలం కేస్లాపూర్ గ్రామంలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది.
Similar News
News November 18, 2025
BREAKING: భారీ అగ్ని ప్రమాదం

TG: మహబూబ్నగర్లోని గొల్లపల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సలార్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో మంటలు చెలరేగి ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.
News November 18, 2025
BREAKING: భారీ అగ్ని ప్రమాదం

TG: మహబూబ్నగర్లోని గొల్లపల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సలార్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో మంటలు చెలరేగి ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.
News November 18, 2025
వాహన ఫిట్నెస్ ఫీజులు 10 రెట్లు పెంపు

వాహనాల ఫిట్నెస్ ఫీజుకు కేంద్రం మూడు(10-15 ఏళ్లు, 15-20, 20-25) స్లాబులు తీసుకొచ్చింది. వాటిని బట్టే ఫీజు ఉంటుంది. 20ఏళ్లు పైబడిన వాహనాలకు 10రెట్లు పెంచింది. ట్రక్కులు/బస్సులకు రూ.25వేలు, మీడియం కమర్షియల్ వాహనాల(MCV)కు రూ.20 వేలు, లైట్ కమర్షియల్ వాహనాల(LCV)కు రూ.15వేలు, త్రీ వీలర్స్కు రూ.7వేలు, బైకులకు రూ.2వేలు చేసింది. 15 ఏళ్లలోపు బైకులకు రూ.400, LMVకు రూ.600, MCVకు రూ.1000గా నిర్ణయించింది.


