News March 21, 2024

ఛీ.. ఛీ.. అసలు ఈమె తల్లేనా?

image

TS: మంచిర్యాల జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. ఓ తల్లి 8 నెలల పసికందును చేనులో వదిలేసింది. నిన్న రాత్రి చేనులో వదిలేసి వెళ్లడంతో వీధి కుక్కలు ఆ పసిపాపపై దాడి చేసి, చంపేశాయి. శరీర భాగాలను పీక్కుతిన్నాయి. తల్లి గంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భీమిని మండలం కేస్లాపూర్ గ్రామంలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది.

Similar News

News October 1, 2024

పాస్‌పోర్టుల రంగులకు అర్థం ఇదే

image

సాధారణంగా పాస్‌పోర్టు నీలం రంగులో ఉంటుందన్న సంగతి తెలిసిందే. పౌరులందరికీ ప్రభుత్వం జారీ చేసే పాస్‌పోర్టులు ఈ రంగులో ఉంటాయి. ఇది కాక మరో 3 రంగులున్నాయి. ఒకటి ఆరెంజ్ కలర్ కాగా మిగతావి తెలుపు, మెరూన్ రంగులు. పదోక్లాస్ పూర్తి చేయని వారికి ఆరెంజ్, దౌత్యవేత్తలకు మెరూన్, భారత ప్రభుత్వ పని మీద విదేశాలకు వెళ్లే అధికారులకు తెలుపు రంగులో పాస్‌పోర్టుల్ని కేంద్రం జారీ చేస్తుంది.

News October 1, 2024

అదే గనుక జరిగితే తీవ్ర పరిణామాలు తప్పవు.. ఇరాన్‌ను హెచ్చరించిన అమెరికా

image

ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణి దాడికి ఇరాన్ సిద్ధమవుతున్నట్లు స‌మాచారం ఉంద‌ని అమెరికా తెలిపింది. అదే గ‌నుక జ‌రిగితే టెహ్రాన్ తీవ్ర ప‌రిణామాల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించింది. న‌స్ర‌ల్లాను హ‌త‌మార్చిన అనంత‌రం లెబ‌నాన్‌లో ఇజ్రాయెల్‌ గ్రౌండ్ ఆప‌రేష‌న్స్ చేపట్టింది. ఈ నేప‌థ్యంలో ఇరాన్ దాడి స‌మాచారంపై ఇజ్రాయెల్ ర‌క్ష‌ణాత్మ‌క వ్యూహాల‌కు పూర్తి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు అమెరికా ప్ర‌క‌టించింది.

News October 1, 2024

10 ఉమ్మడి జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లు

image

తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాలకు సీనియర్ ఐఏఎస్‌లను స్పెషల్ ఆఫీసర్లుగా ప్రభుత్వం నియమించింది. ఆదిలాబాద్- ఇలంబరితి, కరీంనగర్- ఆర్‌వీ కర్ణన్, నల్గొండ- అనిత రామచంద్రన్, నిజామాబాద్- ఎ.శరత్, రంగారెడ్డి- డి.దివ్య, మహబూబ్‌నగర్- రవి, వరంగల్- టి.వి.కృష్ణారెడ్డి, మెదక్-దాసరి హరిచందన, ఖమ్మం- కె.సురేంద్రమోహన్, హైదరాబాద్-ఆమ్రపాలిలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.