News November 24, 2024
రచిన్ రవీంద్రను తిరిగి దక్కించుకున్న చెన్నై

ఓపెనింగ్ బ్యాటర్ రచిన్ రవీంద్రను CSK రూ.4కోట్లకు కొనుగోలు చేసింది. బేస్ ప్రైజ్ రూ.1.50 కోట్లతో వేలంలోకి వచ్చిన ఇతడి కోసం పంజాబ్, చెన్నై పోటీ పడ్డాయి. గత సీజన్లో చెన్నై తరఫున ఆడిన ఇతను 161 స్ట్రైక్ రేట్తో 222 పరుగులు చేశారు.
Similar News
News November 13, 2025
కాపర్ టీ వాడుతున్నారా?

అవాంఛిత గర్భధారణను నివారించడానికి చాలామంది మహిళలు కాపర్ టీ వాడతారు. అయితే దీన్ని సరిగ్గా ప్లేస్ చేయకపోతే అనేక సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కలయిక సమయంలో నొప్పి, రక్తస్రావం, ఇన్ఫెక్షన్లు, దద్దుర్లు, కొన్నిసార్లు గర్భాశయ లైనింగ్ గాయపడటం వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించి వారి పర్యవేక్షణలో దాన్ని తొలగించుకోవాలని సూచిస్తున్నారు.
News November 13, 2025
అదానీ కోసమే భూటాన్కు మోదీ: ప్రియాంక్ ఖర్గే

తన ఫ్రెండ్ అదానీకి లబ్ధి చేకూర్చేందుకే భూటన్లో ప్రధాని మోదీ పర్యటించారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. ‘ఢిల్లీలో ఉగ్రదాడితో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఈ సమయంలో ప్రధాని మోదీ భూటాన్ ఎందుకు వెళ్లారు? అదానీ డీల్ కోసం’ అని రాసుకొచ్చారు. అదానీ పవర్కు రూ.6000 కోట్ల హైడ్రో ప్రాజెక్ట్ డీల్పై సంతకం కోసం మోదీ భూటాన్ వెళ్లారని ఎక్స్లో ఫొటో ట్యాగ్ చేశారు.
News November 13, 2025
ఈ సమయంలో వరిని ఆశించే తెగుళ్లు – నివారణకు సూచనలు

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వరి పంటలో మెడవిరుపు, గింజ మచ్చ తెగులు, సుడిదోమ, కంకినల్లి ఆశించే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. వరిలో మెడవిరుపు లక్షణాలు కనిపిస్తే 200 లీటర్ల నీటిలో ఐసోప్రోథియోలేన్ 300ml లేదా కాసుగామైసిన్ 500ml కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. గింజమచ్చ, కంకినల్లిని గమనిస్తే స్పైరోమెసిఫెన్ 1ml+ ప్రొపికొనజోల్ 1ml లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.


