News November 20, 2024
మణిపుర్ అగ్నికి వాయువు జోడించిన చిదంబరం

‘ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి కల్పిస్తేనే ఒకే రాష్ట్రంలో మైతేయ్, నాగా, కుకీలు కలిసి బతుకుతారని’ మణిపుర్పై మాజీ HM చిదంబరం చేసిన ట్వీట్ పాత గాయాల్ని రేపినట్టైంది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వినతి మేరకు ఆ ట్వీట్ను తొలగించారు. ప్రశాంతత నెలకొన్న రాష్ట్రంలో మంటలు చెలరేగడానికి చిదంబరమే కారణమని CM బిరేన్ సింగ్ ఆరోపించారు. గతంలో మయన్మార్ విద్రోహ శక్తులతో చేతులు కలిపారంటూ ఆయన ఫొటోను బయటపెట్టారు.
Similar News
News November 15, 2025
బరువు ఎప్పుడూ ఒకేలా ఉండాలంటే..

ఎత్తుకు తగ్గ బరువును మెయింటైన్ చేస్తూ, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. కొన్ని అలవాట్లను పాటిస్తే బరువు పెరగకుండా జాగ్రత్తపడొచ్చంటున్నారు నిపుణులు. రాత్రి 8 తర్వాత ఆహారం తీసుకోకూడదు. ఆలస్యంగా, ఎక్కువ మోతాదులో తినడంతో జీవక్రియలకు అంతరాయం కలుగుతుంది. ప్రాసెస్డ్ ఫుడ్, నూడిల్స్, వేపుళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. శరీరానికి తగినంత నీరు అందేలా చూసుకోవాలి.
News November 15, 2025
పేదల తరఫున గొంతెత్తుతూనే ఉంటాం: RJD

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన ఆర్జేడీ ఫలితాలపై తొలిసారి స్పందించింది. ప్రజాసేవ నిరంతర ప్రక్రియ అని, దానికి అంతం లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఎత్తుపల్లాలు సహజమని పేర్కొంది. ఓటమితో విచారం.. గెలుపుతో అహంకారం ఉండబోదని తెలిపింది. ఆర్జేడీ పేదల పార్టీ అని, వారి కోసం తన గొంతును వినిపిస్తూనే ఉంటుందని ట్వీట్ చేసింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 25 సీట్లకు పరిమితమైన విషయం తెలిసిందే.
News November 15, 2025
రైల్ వీల్ ఫ్యాక్టరీలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు

బెంగళూరులోని <


