News August 9, 2024

పిల్ల‌లూ.. మీ మ‌నీశ్ అంకుల్ తిరిగి వ‌చ్చేస్తున్నారు: రాఘవ్ చద్దా

image

ఆప్ సీనియ‌ర్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మ‌నీశ్ సిసోడియాకు బెయిల్ ద‌క్క‌డంపై ఆ పార్టీ నేత‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా స్పందిస్తూ ‘ఢిల్లీ విద్యా విప్ల‌వ వీరుడు మ‌నీశ్ సిసోడియాకు బెయిల్ రావ‌డంతో దేశం మొత్తం స‌ంతోషంగా ఉంది. పేద పిల్ల‌ల‌కు మంచి భ‌విష్య‌త్తును అందించ‌డ‌మే ఆయ‌న చేసిన నేరం. పిల్ల‌లూ.. మీ మ‌నీశ్ అంకుల్ తిరిగి వ‌చ్చేస్తున్నారు’ అంటూ ట్వీట్ చేశారు.

Similar News

News December 5, 2025

మాలధారణలో ఉన్నప్పుడు బంధువులు మరణిస్తే..?

image

అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు రక్తసంబంధీకులు మరణిస్తే వెంటనే మాల విసర్జన చేయాలి. మరణించిన వ్యక్తి దగ్గరి బంధువు అయినందున గురుస్వామి వద్ద ఆ మాలను తీసివేయాలి. ఈ నియమం పాటించిన తర్వాత ఓ ఏడాది వరకు మాల ధరించకూడదు. అయితే దూరపు బంధువులు, మిత్రులు మరణిస్తే, మాలధారులకు ఎలాంటి దోషం ఉండదు. వారు మరణించినవారిని తలచుకొని, స్నానం చేసి స్వామిని ప్రార్థిస్తే సరిపోతుంది. <<-se>>#AyyappaMala<<>>

News December 5, 2025

వారికి కూడా చీరలు.. సీఎం కీలక ప్రకటన

image

TG: 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలను అందించే బాధ్యత మంత్రులు సీతక్క, సురేఖకు అప్పగిస్తున్నట్లు CM రేవంత్ చెప్పారు. ‘ప్రస్తుతం 65L చీరలు పంపిణీ చేశాం. ఇంకా 35L చీరలు రావాలి. ఎన్నికల కోడ్‌తో ఆగిన చోట్ల, పట్టణ ప్రాంతాల మహిళలకూ MAR 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చీరలు ఇస్తాం’ అని ప్రకటించారు. డ్వాక్రా మహిళలు, వైట్ రేషన్ కార్డు ఉన్న మహిళలకు ప్రస్తుతం చీరలు ఇస్తున్న విషయం తెలిసిందే.

News December 5, 2025

ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు: సీఎం రేవంత్

image

TG: హనుమాన్ గుడిలేని ఊరు ఉండొచ్చు.. కానీ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదని CM రేవంత్ అన్నారు. వరంగల్(D) నర్సంపేట సభలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందని, తాము ఒకేసారి ₹20,614Cr మాఫీ చేశామని తెలిపారు. ‘KCR పదేళ్లు రేషన్ కార్డులు ఇవ్వలేదు. మేం లక్షలాది మందికి ఇచ్చాం. 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నాం. ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం’ అని చెప్పారు.