News March 17, 2024
పాకిస్థాన్కు చైనా నిఘా నౌక!

పాకిస్థాన్ నౌకాదళంలో తొలిసారిగా ఓ నిఘా నౌక చేరింది. భారత్పై కన్నేసి ఉంచేందుకు చైనా ఈ నౌకను అందించింది. అణు వార్హెడ్లు ఉన్న బాలిస్టిక్ క్షిపణుల్ని గుర్తించే సామర్థ్యం దీనికి ఉంది. ఈ నౌకను పాక్ ‘పీఎన్ఎస్ రిజ్వాన్’గా పిలుస్తోంది. చైనాలోని ఫుజియాన్ మావై షిప్ బిల్డింగ్ సంస్థ నిర్మించింది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, భారత్ వద్ద మాత్రమే ఈ తరహా నిఘా నౌకలు ఉండగా పాక్ వాటి సరసన చేరింది.
Similar News
News December 2, 2025
ఈ సారి చలి ఎక్కువే: IMD

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


