News May 11, 2024
భారత్లో మళ్లీ పుంజుకుంటున్న చైనా ఫోన్ల మార్కెట్!

2020లో చైనాతో సరిహద్దు వివాదం తర్వాత ఆదరణ కోల్పోయిన ఆ దేశ ఫోన్ బ్రాండ్లు మళ్లీ పుంజుకుంటున్నాయి. షియోమీ, ఓప్పో, వివో, రియల్మీ, ట్రాన్షన్, మోటరోలా మూకుమ్మడి మార్కెట్ షేర్ మార్చి నాటికి 75%కు చేరింది. రూ.25వేలు-50వేల రేంజ్ ఫోన్ల మార్కెట్ షేర్ 18%కు పెరిగింది. కానీ రెవెన్యూ షేర్లో చైనా కంపెనీలు వెనకబడ్డాయి. యాపిల్, శాంసంగ్ అందించే ప్రీమియం ఫోన్లపై దృష్టిసారించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
Similar News
News April 3, 2026
సేతుపతి-సాయిపల్లవి మూవీ.. జూన్లో సెట్స్పైకి!

విజయ్ సేతుపతి, సాయిపల్లవి జంటగా మణిరత్నం తెరకెక్కించనున్న కొత్త మూవీ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే దీనిపై అప్డేట్ రానున్నట్లు సమాచారం. మణిరత్నం సొంత బ్యానర్ మద్రాస్ టాకీస్తో కలిసి లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మ్యూజిక్ లెజెండ్ AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్తో సాయిపల్లవి నటించిన ‘ఏక్ దిన్’ మే 1న రిలీజ్ కానుంది.
News April 3, 2026
మా ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది గుర్తింపు: రేవంత్

TG గ్రూప్-1 ఉద్యోగ నియామకాల విషయంలో <<19551715>>సుప్రీంకోర్టు<<>> ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు CM రేవంత్ రెడ్డి తెలిపారు. ‘ఇది ఉద్యోగ నియామకాల పట్ల మా ప్రభుత్వ పారదర్శకతకు, చిత్తశుద్ధికి గుర్తింపు. రాష్ట్ర పునర్నిర్మాణంలో గ్రూప్-1 అధికారులుగా యువతను భాగస్వాములను చేశాం. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా వ్యవస్థను ప్రక్షాళన చేసి నియామకాలను పూర్తి చేసిన TGPSC ఛైర్మన్, సిబ్బందికి అభినందనలు’ అని ట్వీట్ చేశారు.
News April 3, 2026
హార్ముజ్ To ఇండియా.. షిప్కు ఎంత టైమ్ పడుతుంది?

ఇరాన్ తీరంలోని హార్ముజ్ జలసంధి నుంచి షిప్స్/ట్యాంకర్లు భారత పశ్చిమ తీరానికి చేరుకోవడానికి లోడు, రూట్ను బట్టి సాధారణంగా 2-3 రోజులు పడుతుంది. సుమారు 1000KM దూరంలోని కాండ్లా(GJ) పోర్టుకు 36-40 గంటల్లో నౌకలు చేరుకుంటాయి. ముంబై(MH)కి రావడానికి 50-55 గంటలు అవుతుంది. ఆయిల్ ట్యాంకర్లు సగటున గంటకు 24-37 KM వేగంతో ప్రయాణిస్తాయి. అమెరికాతో యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ను ఇరాన్ మూసేయడం తెలిసిందే.


