News April 6, 2024

భారత ఎన్నికలపై చైనా కుట్ర: మైక్రోసాఫ్ట్

image

దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మైక్రోసాఫ్ట్ సంచలన విషయాలు వెల్లడించింది. ఓటర్లను తప్పుదోవపట్టించేందుకు చైనా కుట్రపన్నుతోందని తెలిపింది. భారత్ సహా ఈ ఏడాది జరగనున్న US, సౌత్‌కొరియా తదితర దేశాల ఎన్నికలనూ ప్రభావితం చేసేందుకు చైనా సైబర్ గ్రూప్స్ ప్లాన్ చేస్తున్నాయని తెలిపింది. ఏఐతో రూపొందించిన ఫేక్ కంటెంట్‌ను సోషల్ మీడియాలో ప్రచారం చేసి అనుకూల ఫలితాలు పొందేందుకు డ్రాగన్ ప్లాన్ చేస్తోందట.

Similar News

News December 8, 2025

నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీలో ఉద్యోగాలు

image

CSIR-నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీ(<>NML<<>>) 5జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు డిసెంబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 27ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్టెనోగ్రఫీ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.48వేల వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://nml.res.in/

News December 8, 2025

‘హమాస్’పై ఇండియాకు ఇజ్రాయెల్ కీలక విజ్ఞప్తి

image

‘హమాస్’ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలని భారత్‌ను ఇజ్రాయెల్ కోరింది. పాక్‌కు చెందిన లష్కరే తోయిబా, ఇరాన్ సంస్థలతో దీనికి సంబంధాలున్నాయని చెప్పింది. గాజాలో కార్యకలాపాల పునరుద్ధరణకు ప్రయత్నిస్తోందని, ప్రపంచవ్యాప్తంగా దాడులకు అంతర్జాతీయ సంస్థలను వాడుకుంటోందని తెలిపింది. హమాస్ వల్ల ఇండియా, ఇజ్రాయెల్‌కు ముప్పు అని పేర్కొంది. ఇప్పటికే US, బ్రిటన్, కెనడా తదితర దేశాలు హమాస్‌ను టెర్రర్ సంస్థగా ప్రకటించాయి.

News December 8, 2025

తెలంగాణ అప్డేట్స్

image

* ఈ నెల 17 నుంచి 22 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిది
* తొలిసారిగా SC గురుకులాల్లో మెకనైజ్డ్ సెంట్రల్ కిచెన్‌ను ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
* రాష్ట్రంలోని హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు, CHCల్లో మరో 79 డయాలసిస్ సెంటర్లు..
* టెన్త్ పరీక్షలకు విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్ ద్వారా మాత్రమే సేకరించాలని స్పష్టం చేసిన ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీహరి