News August 24, 2024

రోదసిలో భారీగా పేరుకుపోతున్న చైనా ఉపగ్రహాల చెత్త

image

భూ కక్ష్యలోని క్రియాశీల ఉపగ్రహాలకు చైనా అంతరిక్ష ప్రయోగాలు పెను ముప్పుగా మారుతున్నాయి. ఈ నెల 6న ఆ దేశం ప్రయోగించిన లాంగ్ మార్చ్ 6ఏ రాకెట్ 300 ముక్కలై భూమి చుట్టూ తిరుగుతోంది. దశాబ్దాలపాటు ఇవి కక్ష్యలోనే ఉంటాయని అంచనా. భూకక్ష్యలో మిల్లీమీటర్ శకలాలు కూడా విధ్వంసాన్ని సృష్టించగలవు. ఆ దేశానికి చెందిన ఉపగ్రహాలు అనేకసార్లు ప్రపంచానికి ముప్పు తెచ్చేలా నియంత్రణ లేకుండా సముద్రాల్లో పడిన సంగతి తెలిసిందే.

Similar News

News November 20, 2025

నాగర్ కర్నూల్ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

“NGKL: అందెశ్రీకి మౌనం పాటించిన ఎంపీ మల్లు రవి
“NGKL: 100 ప్రభుత్వ పాఠశాలలకు గ్రీన్ బోర్డులు
“NGKL:ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం
“BLMR: కొండనాగులలో మినీ స్టేడియం ఎమ్మెల్యే
“ACPT: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.
“ACPT: 9 మంది పేకాట రయూలు అరెస్టు
కల్వకుర్తి: భవిత కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఈవో

News November 20, 2025

పొగిడిన నోళ్లే తిడుతున్నాయ్.. కరెక్టేనా?

image

రాజమౌళి.. మొన్నటి వరకు తెలుగు సినీ కీర్తిని ప్రపంచ వేదికపై రెపరెపలాడించిన వ్యక్తి. బాలీవుడ్‌ ఆధిపత్యాన్ని ఎదురించి సౌత్ సినిమాను దేశవ్యాప్తం చేసిన డైరెక్టర్. కానీ ఇప్పుడు.. ఆస్కార్ తెచ్చాడని పొగిడిన నోళ్లే నేలకు దించేస్తున్నాయి. ప్రశంసించిన వాళ్లే విమర్శిస్తున్నారు. ‘దేవుడిపై పెద్దగా నమ్మకం లేదు’ అన్న ఒకేఒక్క మాట జక్కన్నను పాతాళానికి పడేసిందా? అంతరాత్మ ప్రభోదానుసారం మాట్లాడటం తప్పంటారా? COMMENT

News November 20, 2025

ఎదురుపడ్డా పలకరించుకోని జగన్-సునీత!

image

అక్రమ ఆస్తుల కేసులో AP మాజీ సీఎం జగన్ ఇవాళ HYD నాంపల్లి CBI కోర్టుకు హాజరైన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆయన బాబాయి వివేకానందరెడ్డి కుమార్తె సునీత కూడా కోర్టులోనే ఉన్నారు. తన తండ్రి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగించాలని దాఖలు చేసిన పిటిషన్ వాదనల నేపథ్యంలో ఆమె న్యాయస్థానానికి హాజరయ్యారు. కోర్టు ప్రాంగణంలో అన్నాచెల్లెళ్లు ఎదురు పడినా ఒకరినొకరు పలకరించుకోలేదని, ఎవరో తెలియనట్లు వ్యవహరించినట్లు సమాచారం.