News October 15, 2024
ఈనెల 22న తరగతులను బహిష్కరించాలి: ఆర్.కృష్ణయ్య

TG: రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఈనెల 22న తరగతులను బహిష్కరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, స్కాలర్షిప్ రూ.5,500 నుంచి రూ.10వేలకు పెంచాలనే డిమాండ్తో కలెక్టరేట్లు, ఎమ్మార్వో ఆఫీసులను ముట్టడించాలని ఓ ప్రకటన విడుదల చేశారు. డిగ్రీ కాలేజీలను నిరవధికంగా బంద్ చేయాలనే నిర్ణయాన్ని యాజమాన్యాలు ఉపసంహరించుకోవాలని కోరారు.
Similar News
News December 17, 2025
దేవదేవుని లక్షణాలు – ఒకే శ్లోకంలో

వేద్యో వైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః|
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః||
అన్నీ తెలిసినవాడు, సకల విద్యలకు మూలమైనవాడు, నిత్యం జ్ఞానరూపంలో ఉండేవాడు, దుష్టులను సంహరించి ధర్మాన్ని రక్షించేవాడు, తత్త్వజ్ఞానానికి అధిపతి, లక్ష్మీదేవికి భర్త, మధురమైనవాడు, ఇంద్రియాలకు అందనివాడు, మాయలన్నిటికీ కారణభూతుడు, సృష్టి కార్యాలు చేయువాడు, అనంత శక్తి, గొప్ప సంపద కలవాడు.. ఆయనే శ్రీమహావిష్ణువు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News December 17, 2025
కేంద్ర సంస్కృత వర్సిటీలో ఉద్యోగాలు.. అప్లైకి 3రోజులే ఛాన్స్

న్యూఢిల్లీలోని కేంద్ర <
News December 17, 2025
నాగార్జున ‘కేడి’ డైరెక్టర్ కేకే కన్నుమూత

టాలీవుడ్లో విషాదం నెలకొంది. యువ దర్శకుడు కిరణ్ కుమార్(KK) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘కేడి’ మూవీతో దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఆయన డైరెక్ట్ చేసిన ‘KJQ: కింగ్.. జాకీ.. క్వీన్’ షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. విడుదలకు ముందే KK మరణించారు.


