News July 31, 2024

ఆగస్టు 5 నుంచి ‘స్వచ్ఛదనం-పచ్చదనం’: మంత్రి సీతక్క

image

TG: ఆగస్టు 5 నుంచి 13 వరకు గ్రామాల్లో ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ పేరుతో పారిశుద్ధ్యం, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని మంత్రి సీతక్క అసెంబ్లీలో ప్రకటించారు. గ్రామాలకు నిధులు ఇవ్వడం లేదన్న BRS ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఆమె ఖండించారు. తాము అధికారంలోకి వచ్చాక గ్రామ పంచాయతీలకు రూ.378 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వం నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించలేదని దుయ్యబట్టారు.

Similar News

News October 26, 2025

జూబ్లీహిల్స్‌లో ‘కారు’ను పోలిన ఫ్రీ సింబల్స్

image

TG: జూబ్లీహిల్స్ ఉప‌ఎన్నికలో BRSకు ఫ్రీ సింబల్స్‌తో తిప్పలు తప్పేలా లేవు. ఇండిపెండెంట్లకు EC కెమెరా, చపాతీ రోలర్, రోడ్ రోలర్, సోప్ డిష్, టీవీ, షిప్ వంటి ఫ్రీ సింబల్స్ కేటాయించింది. ఇవి కారును పోలి ఉంటాయనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో నెలకొంది. ఇలాంటి ఫ్రీ సింబల్స్ తొలగించాలని BRS ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసింది. అయితే ఈసారి అభ్యర్థి ఫొటో కూడా ఉండనుండటంతో ఈ ‘సింబల్ కన్ఫ్యూజన్‌’ అంతగా ఉండకపోవచ్చు.

News October 26, 2025

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

image

AP: ఇంటర్ విద్యార్థులు తమ పేరు, గ్రూప్, మీడియం తదితర వివరాలను చెక్ చేసుకునేందుకు ఇంటర్ విద్యా మండలి అవకాశం కల్పించింది. <>సైట్‌<<>>లో టెన్త్ క్లాస్ రోల్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే స్టూడెంట్ వివరాలు వస్తాయని చెప్పింది. ఏమైనా తప్పులుంటే రిక్వెస్ట్ లెటర్‌ను కాలేజీ ప్రిన్సిపల్ ద్వారా ఈ నెల 28లోగా RIO ఆఫీసులో అప్లై చేసుకోవాలని సూచించింది. పేరు మార్పు కోసం బ్యాంకులో రూ.100 చలాన్ కట్టాలని చెప్పింది.

News October 26, 2025

ఎర పంటల వల్ల వ్యవసాయంలో లాభమేంటి?

image

కొన్ని రకాల పంటలు కొన్ని పురుగులను విపరీతంగా ఆకర్షిస్తాయి. ఆ పంటలను ప్రధాన పొలంలో వేస్తే పురుగు రాకను, ఉనికిని వెంటనే గుర్తించవచ్చు. అటువంటి పంటలను ఎరపంటలు లేదా ఆకర్షక పంటలు అంటారు. ఎరపంటలు వేయడం వల్ల ప్రధాన పంటపై పురుగుల ఉద్ధృతి తగ్గుతుంది. అలాగే పురుగుమందులు వాడాల్సిన అవసరం, వాటి కొనుగోలుకు పెట్టే ఖర్చు తగ్గుతుంది. రైతులు ఈ ఎర పంటల ప్రాధాన్యాన్ని గుర్తించి ప్రధాన పంటలో వేసుకోవాలి.