News April 30, 2024

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం ప్రచారం

image

AP: సీఎం జగన్ ప్రచార పర్వం కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మూడు నియోజకవర్గాల్లో సీఎం పర్యటిస్తారని వైసీపీ ప్రధాన కార్యదర్శి రఘురాం తెలిపారు. ఉదయం 10 గంటలకు కొండేపి నియోజకవర్గంలో, మధ్యాహ్నం 12:30 గంటలకు కడప(D) మైదుకూరు నియోజకవర్గంలో, మధ్యాహ్నం 3 గంటలకు పీలేరు నియోజకవర్గంలో జరిగే సభల్లో ఆయన ప్రసంగిస్తారని తెలిపారు.

Similar News

News January 1, 2026

పాలమూరు ప్రాజెక్టుపై KCR, హరీశ్‌వి తప్పుడు ప్రచారాలు: ఉత్తమ్

image

TG: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్, హరీశ్ రావు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి జలాలపై సీఎం, మంత్రులకు ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘ప్రాజెక్టు పూర్తికి రూ.80వేల కోట్లు అవసరం. BRS ప్రభుత్వం రూ.27వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. ఆ పార్టీ నేతలు 90% పూర్తి చేశామని ఎలా చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రూ.7వేల కోట్లు ఖర్చు చేశాం’ అని వివరించారు.

News January 1, 2026

X మొత్తం ఇదే.. ఇలా చేయడం నేరమే!

image

కొందరు X వేదికగా అమ్మాయిలు, సెలబ్రిటీల ఫొటోలను షేర్ చేస్తూ వారిని అసభ్యంగా (బికినీలో) చూపించాలని AI టూల్ ‘గ్రోక్’ను కోరుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అది మెషీన్ కావడంతో అభ్యంతరకర ఫొటోలు సైతం ఎడిట్ చేసి ఇస్తోంది. అయితే ఇలా చేయడం ఇతరుల వ్యక్తిగత గోప్యతను దెబ్బతీయడమే. అనుమతి లేకుండా ఫొటోలను మార్ఫింగ్ చేయడం సైబర్ క్రైమ్ లాంటిదే. జైలు శిక్ష కూడా పడే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

News January 1, 2026

నిమ్మలో కొమ్మల కత్తిరింపు వల్ల లాభమేంటి?

image

అంటు కొమ్మలను నాటిన నిమ్మ మొక్కల వేరు మూలం నుంచి పెరిగే కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. కాండంపై 2 అడుగుల ఎత్తువరకు పక్క కొమ్మలు పెరగకుండా తీసేయాలి. చెట్టుకు ఉన్న అనవసర, ఎండు, తెగులు సోకిన కొమ్మ భాగాలను కత్తిరించి తీసేయాలి. కొమ్మ కత్తిరింపుల తర్వాత చెట్టుపై 1% బోర్డో మిశ్రమం లేదా కాపర్ఆక్సీక్లోరైడ్‌ను చెట్టుపై పిచికారీ చేయాలి. చెట్టు మొదలు నుంచి 1.5 అడుగుల ఎత్తు వరకు బోర్డో పేస్టును పూయాలి.